Venu Goapl Reddy
Author- NTV Telugu-
JD Vance – Usha: అమెరికా ఉపాధ్యక్షుడి లవ్ ఎఫైర్.? అందుకే, భార్య హిందూ మతం గురించి కామెంట్స్..
JD Vance - Usha: అమెరికా ఉపాధ్యక్షడు జేడీ వాన్స్, తన భార్య ఉషా గురించి, ఆమె హిందూ మతం గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. జేడీ వాన్స్ వ్యాఖ్యలను ఇండియన్ అమెరికన్స్ తీవ్రంగా ఖండిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జేడీ వాన్స్-ఉషా చిలుకూరి ప్రేమ ఆసక్తికరం అంశంగా మారిన సంగతి తెలిసిందే. -
Mallikarjun Kharge: దేశంలో ఆర్ఎస్ఎస్ను నిషేధించాలి.. కాంగ్రెస్ చీఫ్ డిమాండ్..
Mallikarjun Kharge: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను దేశంలో నిషేధించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనే వారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేయడాన్ని నిషేధించాలని అన్నారని ఖర్గే గుర్తు చేశారు. 2024లో బీజేపీ ప్రభుత్వం ఆ నిషేధాన్ని ఎత్తివేసిందని, దానిని తిరిగి అమలు చేయాలని కోరారు. ‘‘ఆర్ఎస్ఎస్ను నిషేధించాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం’’ అని ఖర్గే శుక్రవారం అన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను ఆయన విషంతో పోల్చారు -
H-1B visa: “భారతదేశం అమెరికన్ కలల్ని దొంగిలిస్తోంది”.. ట్రంప్ సర్కార్ ఆరోపణ..
H-1B visa: ట్రంప్ సర్కార్ భారతదేశంపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉంది. H-1B వీసాలు అమెరికన్లకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నాయని, భారతీయులు వీటిని దుర్వినియోగం చేస్తున్నారని పలు సందర్భాల్లో అధికార రిపబ్లికన్ పార్టీ సభ్యులు విమర్శలు చేస్తున్నారు. -
Justice Surya Kant: భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్..
Justice Surya Kant: భారతదేశ తదుపరి ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నియమితులయ్యారు. నవంబర్ 24న ఆయన సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ప్రస్తుత సీజేఐ బీఆర్ గవాయ్ స్థానంలో ఆయన అత్యున్నత న్యాయ పదవికి నియమితులయ్యారు. న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సూర్యకాంత్ నియామకాన్ని ధ్రువీకరించారు. “భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వబడిన అధికారాలను వినియోగించుకుని, భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ను నవంబర్ 24 నుండి భారత ప్రధాన న్యాయమూర్తిగా నియమించడానికి రాష్ట్రపతి […] -
Wedding Season: దేశవ్యాప్తంగా 46 లక్షల పెళ్లిళ్లు.. ఏకంగా రూ. 6.5 లక్షల కోట్ల వ్యాపారం..
Wedding Season: నవంబర్ 1 నుంచి ప్రారంభమయ్యే పెళ్లిళ్ల సీజన్లో రూ. 6.5 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని గురువారం ఒక నివేదిక తెలిపింది. 45 రోజుల వ్యవధిలో 46 లక్షల వివాహాలు జరుగుతాయని, దీని ద్వారా లక్షల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పింది. ఢిల్లీ 4.8 లక్షల వివాహాల ద్వారా రూ.1.8 లక్షల కోట్లు సమకూరుస్తుందని CAIT రీసెర్చ్ అండ్ ట్రేడ్ డెవలప్మెంట్ సొసైటీ (CRTDS) అధ్యయనం తెలిపింది. -
Rahul Gandhi: పీఎం మోడీపై అనుచిత వ్యాఖ్యలు.. రాహుల్ గాంధీపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు..
Rahul Gandhi: బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రధానమంత్రి కార్యాలయాన్ని అగౌరపరిచేవిగా, ‘‘మర్యాద అన్ని హద్దులు దాటాయి’’ అని బీజేపీ పేర్కొంది. ఇలాంటి వ్యాఖ్యలు వ్యక్తిగమైనవని, ఎగతాళి చేసేవిగా ఉన్నాయని, భారత గణతంత్ర రాజ్య అత్యున్నత రాజ్యాంగ కార్యాలయ గౌరవాన్ని అవమానించే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాయని చెప్పింది. -
Amazon Layoffs: టెక్ట్స్ మేసేజ్లతో ఉద్యోగులకు ఉద్వాసన పలికిన అమెజాన్..
Amazon Layoffs: టెక్ ఇండస్ట్రీలో ఎవరి జాబులు ఎప్పుడు పోతాయో తెలియడం లేదు. ఉన్నట్లుండి ఐటీ కంపెనీలు లేఆఫ్స్ ప్రకటిస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా, అమెజాన్ ఇటీవల భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగించింది. అయితే, కేవలం టెక్స్ట్ మెసేజ్ ద్వారా ఉద్యోగుల్ని తీసేస్తున్నట్లు ప్రకటించం ఇప్పుడు సంచలనంగా మారింది. -
Sunroof: ప్రాణాలు తీసిన సన్రూఫ్.. కారుపై రాయి పడి మహిళ మృతి..
Sunroof: సన్రూఫ్ కార్లపై ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. ప్రతీ కంపెనీ తమ ప్రముఖ కార్లకు ఖచ్చితంగా సన్రూఫ్ ఆప్షన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే, కొన్ని సందర్భాల్లో ఇవి ఎంత ప్రమాదమో తెలిసే ఘటన చోటు చేసుకుంది. కొండపై నుంచి కారుపై రాయి పడి 43 ఏళ్ల స్నేహల్ గుజరాతీ అనే మహిళ మరణించిన విషాద సంఘటన చోటు చేసుకుంది. -
USA: భారతీయులకు ట్రంప్ దెబ్బ.. ఈసారి H-1B హోల్డర్ల జీవిత భాగస్వాములే టార్గెట్..
USA: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరసగా భారతీయులకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నాడు. ఇప్పటికే, ట్రంప్ ఇమ్మిగ్రేషన్, వలస విధానాలను కఠినతరం చేశాడు. ఇప్పుడు ఆయన దృష్టి H-1B వీసాలపై పడింది. ఈ వీసాలు దుర్వినియోగం అవుతున్నాయని, అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని ట్రంప్ ప్రభుత్వంలోని వ్యక్తులు ఆరోపిస్తున్నారు. -
PM Modi: ఇద్దరు యువరాజులు, రెండు అవినీతి కుటుంబాలు.. రాహుల్, తేజస్వీలపై ప్రధాని ఫైర్..
PM Modi: బీహార్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీ ప్రతిపక్షాలపై ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్పై విరుచుకుపడ్డారు. ‘‘అవినీతికి పాల్పడిన యువరాజులు’’ అని పిలిచారు. వీరిద్దరు ‘‘తప్పుదు హామీల దుకాణం’’ నడుపుతున్నారని ఆరోపించారు. బీహార్ లోని ముజఫర్పూర్లో జరిగిన మెగా ర్యాలీలో గురువారం ప్రధాని మోడీ పాల్గొన్నారు. Read Also: Rules change November 1: ఆధార్ అప్డేట్ నుంచి LPG, క్రెడిట్ కార్డ్ వరకు.. నవంబర్ 1 […]
తాజావార్తలు
-
Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
-
ICC T20 Rankings: ఆఫ్ఘనిస్థాన్ను క్లీన్స్వీప్ చేసినా ఉపయోగం లేకపాయే.. నంబర్ 1 స్థానం ఫసక్..!
-
TMC Crisis: టీఎంసీకి కొత్త పేర్లు, గుర్తులు.. మమతకు ‘‘ఫుట్బాల్ ప్లేయర్’’, రిటబ్రతకు ‘‘ఎన్వలప్ కవర్’’..
-
Suhas: తెలుగు ఆడియన్స్ అనే పదమే రావట్లేదా సుహాస్?
-
KFC పార్కింగ్లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..