Air Force chief: ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ లాగా F-35 జెట్లను కొనలేము..
- ఫ్రిజ్, వాషింగ్ మెషిన్ల లాగా ఎఫ్-35 జెట్లను కొనలేము..
- భారత్ లెటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి..
- ఇటీవల భారత్కి ట్రంప్ ఎఫ్-35 ఆఫర్..
- ఎయిర్ ఫోర్స్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air Force chief: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ భారత్కి F-35 స్టీల్త్ ఫైటర్ జెట్లను విక్రయించాలని ఇటీవల ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన వచ్చిన తర్వాత, అమెరికా ఇంకా ఈ విమానం కోసం అధికారికంగా ఆఫర్ చేయలేదని ఇండియన్ ఎయిర్ఫోర్స్ చీఫ్(ఐఏఎఫ్) ఏపీ సింగ్ అన్నారు. ఇండియా టుడే కాంక్లేవ్లో ఆయన ఈ వ్యాక్యలు చేశారు. భారతదేశం అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అసవరం ఉందని చెప్పారు. 5వ జనరేషన్ ఫైటర్ జెట్ల కార్యక్రమాన్ని భారత్ వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఎయిర్ మార్షల్ ఏపీ సింగ్ మాట్లాడుతూ.. భారత వైమానిక దళం ఎఫ్-35లను ఇంకా విశ్లేషించాల్సిన అవసరం ఉందని, దాదాపు 80 మిలియన్ డాలర్ల ఖరీదు చేసే జెట్, మార్కెట్లోనే అత్యంత ఖరీదైన ఎంపికలో ఒకటి, దాని పనితీరును కూడా యూఎస్ నివేదిక గుర్తించింది. ‘‘మనం దానిని జాగ్రత్తగా విశ్లేషించాలి. అవసరాలు ఏమిటి, దానితో పాటు ఏం వస్తాయి. ఖర్చు కూడా దానిలో ఒక భాగం, ఇది కేవలం బయట చూడటం ద్వారా కొనుగోలు చేసే ఫ్రిజ్, వాషింగ్ మెషిల్ లాంటిది కాదు. మేము దాని గురించి ఇంకా ఆలోచించలేదు. ఇప్పటివరకు ఆఫర్ రాలేదు’’ అని ఏపీ సింగ్ అన్నారు.
Also Read
- TMC Rebellion: నాడు ఠాక్రే, నేడు మమత.. దేశ రాజకీయాల్లో రెండు ముక్కలుగా చీలిపోయిన అతిపెద్ద పార్టీలు ఇవే..
- MP: ‘సారీ అమ్మా, నాన్న.. మళ్లీ పరీక్ష రాసే ధైర్యం లేదు’.. కన్నీరు పెట్టిస్తున్న నీట్ విద్యార్థిని సూసైడ్ నోట్
- Aadhaar Mobile Number Update: ఆధార్లో మొబైల్ నంబర్ మార్పు.. ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు? పూర్తి వివరాలు ఇవే
- BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
Read Also: Vimal pan masala: విమల్ పాన్ మసాలా యాడ్.. షారూఖ్, అజయ్ దేవ్గన్, టైగర్ ష్రాఫ్లకు నోటీసులు..
ప్రధాని నరేంద్రమోడీ ఇటీవల అమెరికా పర్యటనలో ట్రంప్ భారత్కి ఎఫ్-35 స్టెల్త్ ఫైటర్ జెట్లను ఆఫర్ చేశారు. భారత్ తన రక్షణ పరికరాల కోసం రష్యాపై ఆధారపడకుండా, అమెరికా చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా దీనిని చూస్తున్నారు. ఇదిలా ఉంటే, చైనా 6వ తరం యుద్ధవిమానాలను ప్రదర్శిస్తున్న తరుణంలో భారత తక్షణ అవసరాలను తీర్చడానికి భారత్ యుద్ధవిమానాలను కొనుగోలు చేయాల్సి రావచ్చని ఎయిర్ మార్షల్ చెప్పారు. ప్రస్తుతం భారతదేశ ఐదవ తరం ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ – అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) – ఇంకా అభివృద్ధి దశలోనే ఉంది. మొదటి జెట్లు 2035 లో మాత్రమే చేర్చబడతాయని భావిస్తున్నారు.
భారత్ వద్ద ప్రస్తుతం 30 ఫైటర్ స్వ్కాడ్రన్ల ఉన్నాయి. అయితే, వీటి సంఖ్య 42. ఒక ఫైటర్ స్వ్కాడ్రన్,2లో 18 జట్లు ఉంటాయి. చైనా ఆరవ తరం విమానాలను పరీక్షిస్తుండటంతో పాటు, పాకిస్తాన్కి ఎఫ్-16 నిర్వహణ కోసం అమెరికా నిధులు ఇవ్వడం గురించి ఆందోళన నెలకున్న తరుణంలో కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిన అవసరాన్ని ఎయిర్ చీఫ్ నొక్కి చెప్పారు.
తాజావార్తలు
-
Sophie Ecclestone Fielding: గల్లీ క్రికెట్లో కూడా ఇలా ఆడరమ్మ.. ఇంగ్లండ్ స్టార్ సోఫీ ఎక్లెస్టోన్ను ఆడేసుకుంటున్న నెటిజెన్స్!
-
Raghavvi: రాఘవ లారెన్స్ కూతురు సంచలన నిర్ణయం.. హీరోయిన్గా కాకుండా ఆ రూట్లో ఇండస్ట్రీలోకి ఎంట్రీ!
-
Ranveer Singh : రణ్వీర్ సింగ్ పై బ్యాన్ ఎత్తివేసిన FWICE
-
Smartphone Under 10,000: రూ. 10000 లోపు బెస్ట్ స్మార్ట్ఫోన్స్.. భారీ బ్యాటరీలు, 50MP కెమెరాలు 90Hz డిస్ప్లేలతో..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
ట్రెండింగ్
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!