Jaishankar security breach: “యూకే ఉదాసీనత”.. జైశంకర్ భద్రతా ఉల్లంఘనపై భారత్ కామెంట్స్..
- జైశంకర్ భద్రతలో ఉల్లంఘన..
- యూకే ఉదాసీనంగా ఉందని భారత్ ఘాటు వ్యాఖ్యలు..
- ఖలిస్తానీలపై యూకే చర్యలు అంతంత మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jaishankar security breach: భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లండన్ పర్యటనలో భద్రతా ఉల్లంఘన జరిగింది. ఆయన ఓ కార్యక్రమం నుంచి బయటకు వచ్చి కారు ఎక్కే సమయంలో ఖలిస్తానీలు నినాదాలు చేయడంతో పాటు ఒక వ్యక్తి భద్రతా వలయాన్ని దాటుకుని జైశంకర్ సమీపంలోకి రావడం, కారుని అడ్డుకునే ప్రయత్నం చేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై యూకే ప్రకటనపై భారత్ శుక్రవారం స్పందించింది. యూకే ఉదాసీనతను ఈ ఘటన ప్రతిబింబిస్తోందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ అన్నారు.
‘‘ఈ విషయంపై యూకే విదేశాంగ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనను మేము గమనించినప్పటికీ, దాని నిజాయితీపై మా అభిప్రాయం, మునుపటి సందర్భాలలో నిందితులపై తీసుకున్న చర్యలపై ఆధారపడి ఉంటుంది’’అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ చెప్పింది.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్యకు ముందు, తర్వాత చాట్స్ డిలీట్.. సియా-చేతన్ ఫోన్లలో కీలక ఆధారాలు
- Ketan Agarwal Case: మద్యం మత్తులో సియా గోయల్.. వీడియో వైరల్
- Congress: కాంగ్రెస్లో భారీ ప్రక్షాళన.. యూపీతో సహా కీలక రాష్ట్రాల ఇన్ఛార్జ్ల మార్పు! కారణం ఇదేనా
- Monsoon: శాటిలైట్ చిత్రాల్లో షాకింగ్ దృశ్యాలు.. దేశంలో కనిపించని వర్ష మేఘాలు
Read Also: CM Revanth Reddy: డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది..
లండన్లో అంతర్జాతీయ థింక్ ట్యాంక్ చాథమ్ హౌస్లో ప్రసంగం తర్వాత జైశకంర్ వెళ్లిపోతున్న సమయంలో ఖలిస్తానీలు భారత్కి వ్యతిరేక నినాదాలు చేశారు. ‘‘ఈ సంఘటనకు పెద్ద సందర్భం ఉంది. దీన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాంటి శక్తుల బెదిరింపులకు లైసెన్సులు ఇచ్చినట్లు ఉంది. యూకేలో చట్టబద్ధమైన మా దౌత్య కార్యకలాపాలను అడ్డుకునే లక్ష్యంతో ఉన్న ఇతర ఘటనల పట్ల ఉదాసీనతను ఈ ఘటన బయటకు తెస్తుంది’’ అని ఒకింత ఘాటుగానే స్పందించింది.
అంతకుముందు, గురువారం యూకేలోని కైర్ స్టార్మర్ ప్రభుత్వం ఖలిస్తానీ తీవ్రవాదుల ప్రయత్నాలను ఖండించింది. ఇలాంటి ఘటనలు ఆమోదయోగ్యం కాదని పేర్కొంది. శాంతియుత నిరసన హక్కుని సమర్థిస్తున్నప్పటికీ, ప్రజా కార్యక్రమాలను బెదిరించడం, అంతరాయం కలిగించే ప్రయత్నాలు ఆమోదయోగ్యం కాదని యూకే విదేశాంగ కార్యాలయం తెలిపింది. భారత్ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించింది. చిన్న వేర్పాటువాద సమూహం శక్తులు ప్రజాస్వామ్య స్వేచ్ఛలను దుర్వినియోగం చేస్తున్నాయని చెప్పింది.
తాజావార్తలు
-
Astrology: జూన్ 27 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Astrology: ఈ 3 రాశులవారు ఒంటరిగా ఉండటాన్నే ఎక్కువ ఇష్టపడతారా? జ్యోతిష్యం ఏమి చెబుతోంది?
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!