Karnataka Budget: ఆధునిక “ముస్లిం లీగ్” బడ్జెట్.. కర్ణాటక బడ్జెట్పై బీజేపీ విమర్శలు..
- కర్ణాటక బడ్జెట్పై బీజేపీ విమర్శలు.. ముస్లిం లీగ్ బడ్జెట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు.. మైనారిటీ బుజ్జగింపు బడ్జెట్గా అభివర్ణన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Budget: కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్పై బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. బీజేపీ నేత జీఎస్ ప్రశాంత్ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్ని ‘‘ముస్లిం లీగ్ బడ్జెట్’’గా అభివర్ణించారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారీ కూడా ఈ బడ్జెట్ని తీవ్రంగా తప్పుపట్టారు. మైనారిటీల బుజ్జగింపు బడ్జెట్గా బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Read Also: Fighter Jet Crash: జాగ్వార్ ఫైటర్ జెట్ క్రాష్.. పైలెట్ సురక్షితం..
Also Read
బండారీ మాట్లాడుతూ.. ‘‘కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఆధునిక ముస్లిం లీగ్ బడ్జెట్ ను ఆమోదించింది. ఈ ఆధునిక ముస్లిం లీగ్ బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ ఇమామ్ ల గౌరవ వేతనాన్ని రూ.6000 కు పెంచుతోంది. వక్ఫ్ కు రూ.150 కోట్లు ఇస్తున్నారు. ఆత్మరక్షణ శిక్షణ కోసం మైనారిటీ బాలికలకు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు… మైనారిటీ ప్రయోజనాల కోసం రూ.1000 కోట్లకు పైగా ఉపయోగిస్తున్నారు… నిన్న కర్ణాటక ప్రభుత్వం హుబ్బళ్లీ అల్లర్లపై కేసులను ఉపసంహరించుకోవాలని మాట్లాడింది. కాబట్టి, కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో ముహమ్మద్ అలీ జిన్నా ప్రభుత్వాన్ని ఎలా నడిపాడో అదే విధంగా ప్రభుత్వాన్ని నడుపుతోంది. ఇది రాజ్యాంగ విలువలను వెనక్కి తీసుకుంటోంది, మైనారిటీ వర్గాల ప్రయోజనాలకు సంబంధించిన ప్రకటనలు, విధానాలను మాత్రమే అమలు చేస్తోంది.’’ అని దుయ్యబట్టారు.
మరోవైపు బడ్జెట్ కేటాయింపుల్ని కాంగ్రెస్ నేతలు సమర్థించుకుంటున్నారు. కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలపై ఎదురుదాడి చేసింది. కాంగ్రెస్ నేత రిజ్వాన్ అర్షద్ మాట్లాడుతూ..‘‘బడ్జెట్లో కొంత భాగాన్ని మైనారిటీలకు కేటాయించారు. మేము ఇంత కూడా అర్హులం కాదా..? బీజేపీ అన్ని విషయాలను హిందూ-ముస్లింలనుగానే చూస్తోంది’’ అని అన్నారు. జనాభాలో 15 శాతం మంది బడ్జెట్లో 1 శాతానికి కూడా అర్హులు కారా..? అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ మైనారిటీలను సమాజంగా చూడదని, వారు దేశ ఐక్యతను బలహీనపరచాలని అనుకుంటున్నారని, బీజేపీ దేశ వ్యతిరేకి అంటూ ఆరోపించారు.
#WATCH | Delhi: On Karnataka State Budget, BJP National Spokesperson Pradeep Bhandari says, "In Karnataka, Congress party has passed a modern Muslim League Budget. In this modern Muslim League Budget, Congress party is increasing the honorarium of Imams to Rs 6000. Waqf is being… pic.twitter.com/tAFBSlXpbb
— ANI (@ANI) March 7, 2025
- Tags
- bjp
- congress
- Karnataka Budget
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!