Venu Goapl Reddy
Author- NTV Telugu-
Trinamool MLA: ‘‘శ్రీరాముడు ముస్లిం, హిందువు కాదు’’.. టీఎంసీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..
Trinamool MLA: తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మిత్రా ‘శ్రీరాముడు’ గురించి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘‘శ్రీరాముడు హిందువు కాదు, ముస్లిం’’ అని ఆయన చేసిన కామెంట్స్పై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. బీజేపీ నేత ప్రదీప్ భండారి ఎక్స్లో ఈ వ్యాఖ్యలకు చెందిన వీడియోను ఎక్స్లో షేర్ చేశారు. -
Mamata Banerjee: “జి రామ్ జి” వివాదం.. బెంగాల్ స్కీమ్కు మహాత్మా గాంధీ పేరు..
Mamata Banerjee: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్తగా ‘‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అజీవక మిషన్ గ్రామీణ్(VB-G RAM G)’’ చట్టం, 2025ను తీసుకురావడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహాత్మా గాంధీ పేరును ఉద్దేశపూర్వకంగా బీజేపీ తొలగిస్తోందని, గాంధీ అంటే బీజేపీకి పడదని ఆరోపిస్తున్నాయి. -
Tata Motors: టాటా డిసెంబర్ ఆఫర్.. రూ. 4,999 EMIతోనే కార్ ఇంటికి తీసుకెళ్లొచ్చు..
Tata Motors: టాటా ఇయర్ ఎండ్ తన సేల్స్ పెంచుకునేందుకు డిసెంబర్ నెలలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. ఈ ఆఫర్లను ICE (పెట్రోల్–డీజిల్), EV (ఎలక్ట్రిక్) మోడళ్లన్నిటికీ వర్తిస్తున్నట్లు చెప్పింది. ఈ స్కీమ్ డిసెంబర్ 31,2025 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. కస్టమర్లు ఎంపిక చేసిన టాటా కార్లను నెలకు రూ. 4999 నుంచి ప్రారంభమయ్యే నెలవారీ EMIతో ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఎంట్రీ లెవల్ టియాగో నెలకు రూ. 4999 నుంచి EMIతో అందుబాటులో ఉంది. టిగోర్, […] -
Saudi Arabia: 56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా..
Saudi Arabia: వీసా ఆంక్షలు, నో-ఫ్లై జాబితాలు, విదేశాల బహిష్కరణలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్లు మాత్రం యథేచ్చగా విదేశాల్లో భిక్షాటన చేస్తూనే ఉన్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, అజన్ బైజాన్ దేశాల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయా దేశాలు దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద తమ ఆందోళనల్ని వ్యక్తపరుస్తోంది. -
Javed Akhtar: “హిజాబ్ వివాదం”.. సీఎం నితీష్ బేషరతుగా క్షమాపణ చెప్పాలి..
Javed Akhtar: బీహార్లో ఒక కార్యక్రమంలో ఆయుష్ వైద్యులకు నియామక పత్రాలను అందిస్తూ, సీఎం నితీష్ కుమార్ ఒక ముస్లిం యువతి ‘‘హిజాబ్’’ను లాగడం వివాదాస్పదం అయింది. దీనిపై రాజకీయ రచ్చ మొదలైంది. ప్రముఖ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ కూడా ఈ వివాదంపై సీఎం నితీష్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. -
PM Modi: ప్రధాని మోడీకి ఒమన్ అత్యున్నత పురస్కారం.. ‘‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ ప్రదానం..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీకి ఒమన్ తన దేశ అత్యున్నత గౌరవాన్ని ప్రధానం చేసింది. భారత్-ఒమన్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రధాని మోడీ చేసిన కృషికి గానూ గురువారం ఒమన్ సుల్తానేట్ ప్రత్యేకమైన పౌర పురస్కారం ‘‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ను సుల్తాన్ హైతం బిన్ తారిక్ ప్రదానం చేశారు. జోర్డాన్, ఇథియోపియాతో సహా మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరి దేశం ఒమన్లో ప్రధాని మోడీ రెండు రోజులు పర్యటిస్తున్నారు. Read Also: […] -
Dhurandhar: పాక్లో “ధురంధర్” బ్యాన్.. కానీ, వైరల్ సాంగ్తో చిన్న భుట్టో ఎంట్రీ..
Dhurandhar: బాలీవుడ్ మూవీ ‘‘ధురంధర్’’ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను సాధిస్తోంది. ఇన్నాళ్లు బాలీవుడ్లో ఉన్న ప్రో-పాకిస్తాన్ నారెటివ్ను పటాపంచలు చేసిందని పలువురు క్రిటిక్స్ విశ్లేషిస్తున్నారు. పాకిస్తాన్ అసలు రూపాన్ని ఈ సినిమా చూపించిందని చెబుతున్నారు. -
Crime: ముస్లిం భార్య వివాదం.. తల్లిదండ్రుల్ని చంపి, మూడు ముక్కలు చేసిన కొడుకు..
Crime: ఒక వ్యక్తి ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవడం దారుణమైన హత్యలకు దారి తీసింది. డబ్బు, భూ వివాదాలతో పాటు మతాంతర వివాహం వల్ల ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పూర్లో ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల్ని క్రూరంగా హత్య చేశాడు. హత్య తర్వాత ఐదు రోజుల గాలింపు చేపట్టాక వృద్ధ దంపతుల శవాలు గురువారం దొరికాయి. సొంత కొడుకే వారిని హత్య చేసి, వారి శరీరాలను రంపంతో మూడు ముక్కలుగా కోసి, సిమెంట్ బ్యాగులో పెట్టి, స్థానికంగా ఉన్న నదిలో పారేశాడు. -
Rent Crime: ‘అద్దె’ అడిగినందుకు ఓనర్ దారుణహత్య..
Rent Crime: ఇంటికి అద్దె చెల్లించాలని అడిగినందుకు ఒక ఓనర్ ప్రాణాలు కోల్పోయింది. రెంట్కు ఉంటున్న భార్యభర్తలు యజమానిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన ఢిల్లీకి సమీపంలో ఉన్న ఘజియాబాద్లో జరిగింది. హత్యకు పాల్పడిన దంపతులను అరెస్ట్ చేశారు. యజమానులు దీప్శిఖా శర్మ(48) మృతదేహం అద్దె ఫ్లాట్లోని ఒక సూట్కేసులో లభించింది, దీని తర్వాత నిందితులు అజయ్ గుప్తా, ఆకృతి గుప్తాలను అదుపులోకి తీసుకున్నారు. -
Taliban: భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘాన్ తాలిబాన్లు, ఇక పాకిస్తాన్ ఎండిపోవాల్సిందే..
Taliban: పాకిస్తాన్కు వచ్చే కొన్నేళ్లలో తాగడానికి, వ్యవసాయానికి నీరు కష్టమే అని తెలుస్తోంది. ఇప్పటికే, పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ ‘‘సింధూ జల ఒప్పందం’’ను నిలిపేసింది. పాకిస్తాన్కు ముఖ్యంగా, పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో సింధూ, దాని ఉప నదులే ప్రజల జీవితాలకు ఆధారం. ఇప్పుడు, భారత్ చూపిన దారిలోనే ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు నడుస్తున్నారు. ఆఫ్ఘాన్ నుంచి పాక్లోకి వెళ్లే నదుల నీటిని సరిహద్దు దాటనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!