Rajasthan: దళిత ఎమ్మెల్యే వచ్చాడని ఆలయ “శుద్ధి”.. వివాదస్పద నేతని సస్పెండ్ చేసిన బీజేపీ..
- రాజస్థాన్ వివాదాస్పద నేత జ్ఞాన్దేవ్ అహుజా సస్పెండ్ చేసిన బీజేపీ..
- దళిత ఎమ్మెల్యే వచ్చినందుకు, ఆలయాన్ని ‘‘శుద్ధి’’ చేసిన అహుజా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్కి చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత జ్ఞాన్దేవ్ అహుజాను పార్టీ నుండి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల అల్వార్లోని ఒక ఆలయాన్ని కాంగ్రెస్కి చెందిన దళిత ఎమ్మెల్యే సందర్శించారు. దీని తర్వాత, అహుజా గంగా జలంలో ఆలయాన్ని ‘‘శుద్ధి’’ చేయడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ నేత టికారం జుల్లీ ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన తర్వాత అహుజా ఈ చర్యకు పాల్పడ్డాడు. దళిత ఓటర్లు కీలక పాత్ర పోషించే తూర్పు రాజస్థాన్లో అహుజా ఈ కార్యక్రమానికి పాల్పడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్ర బీజేపీ యూనిట్ అతడికి నోటీసులు పంపింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఒక వేళ విఫలం అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించింది. ‘‘పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నప్పుడు మీరు కులం, లింగం, మతం ఆధారంగా వివక్ష చూపనని ప్రమాణం చేశారు. కానీ టికారం జుల్లీ సందర్శనను నిరసిస్తూ గంగజలం చల్లారు. మీ చర్య వల్ల పార్టీ ప్రతిష్ఠ దిగజారింది. ఇది క్రమశిక్షణా రాహిత్యం.’’ అని బీజేపీ తన నోటీసుల్లో పేర్కొంది.
Also Read
- Mahua Moitra: మహువా మోయిత్రా కారుపై ఎగ్ అటాక్.. సుప్రీంకోర్టు జడ్జిపై సెటైర్లు..
- UP Elections: రంగంలోకి RSS.. BJPతో కలిసి యూపీలో వ్యూహాత్మక కసరత్తు
- Digital Payments: యూపీఐ ఛార్జీల నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకుంటుందా? ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది!
- XI Jinping: జిన్పింగ్కు ఇస్కీమిక్ స్ట్రోక్.. బ్రిక్స్ నుంచి నేరుగా హాస్పిటల్కు.?
Read Also: LSG Vs KKR: కేకేఆర్ ఈడెన్లో విజయం పరంపర కొనసాగిస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న ఎల్ఎస్జి
రాజస్థాన్లోని అల్వార్లోని ఒక ఆలయం ఆదివారం రామనవమి నాడు కార్యక్రమం జరిగింది. దీనికి రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత టికారం జుల్లీ హాజరయ్యారు. దళితుడైన టికారం జుల్లీ హాజరుకావడంతో ఆలయం అపవిత్రమైందని, తర్వాత రోజు గంగా జలంతో అహుజా ఆలయాన్ని శుద్ధి చేయడం వివాదాస్పదమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో, కాంగ్రెస్ బీజేపీ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేసింది. దేవుళ్లు బీజేపీ నాయకులకే చెందుతారా..? అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
2013 నుండి 2018 వరకు రామ్గఢ్ ఎమ్మెల్యేగా పనిచేసిన జ్ఞాన్దేవ్ అహుజా వివాదాలకు కొత్తేమీ కాదు. 2016లో JNUలో జరిగిన “జాతి వ్యతిరేక” నినాదాల వివాదంలో ఆయన తొలిసారిగా వార్తల్లో నిలిచారు. JNU క్యాంపస్లో ప్రతిరోజూ 3,000 కండోమ్లు, 2,000 మద్యం సీసాలు దొరుకుతాయని ఆయన ఆరోపించడం సంచలనమైంది. 2017లో గోరక్షకులు పెహ్లూ ఖాన్ అనే పాడి రైతును హత్య చేయడాన్ని కూడా ఆయన సమర్థించారు.
తాజావార్తలు
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్లో ఉండగానే ఇంత సడెన్గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!