Rajasthan: దళిత ఎమ్మెల్యే వచ్చాడని ఆలయ “శుద్ధి”.. వివాదస్పద నేతని సస్పెండ్ చేసిన బీజేపీ..
- రాజస్థాన్ వివాదాస్పద నేత జ్ఞాన్దేవ్ అహుజా సస్పెండ్ చేసిన బీజేపీ..
- దళిత ఎమ్మెల్యే వచ్చినందుకు, ఆలయాన్ని ‘‘శుద్ధి’’ చేసిన అహుజా..
Rajasthan: రాజస్థాన్కి చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత జ్ఞాన్దేవ్ అహుజాను పార్టీ నుండి సస్పెండ్ చేసి షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఇటీవల అల్వార్లోని ఒక ఆలయాన్ని కాంగ్రెస్కి చెందిన దళిత ఎమ్మెల్యే సందర్శించారు. దీని తర్వాత, అహుజా గంగా జలంలో ఆలయాన్ని ‘‘శుద్ధి’’ చేయడం వివాదాస్పదమైంది. కాంగ్రెస్ నేత టికారం జుల్లీ ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరైన తర్వాత అహుజా ఈ చర్యకు పాల్పడ్డాడు. దళిత ఓటర్లు కీలక పాత్ర పోషించే తూర్పు రాజస్థాన్లో అహుజా ఈ కార్యక్రమానికి పాల్పడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రాష్ట్ర బీజేపీ యూనిట్ అతడికి నోటీసులు పంపింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. ఒక వేళ విఫలం అయితే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించింది. ‘‘పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నప్పుడు మీరు కులం, లింగం, మతం ఆధారంగా వివక్ష చూపనని ప్రమాణం చేశారు. కానీ టికారం జుల్లీ సందర్శనను నిరసిస్తూ గంగజలం చల్లారు. మీ చర్య వల్ల పార్టీ ప్రతిష్ఠ దిగజారింది. ఇది క్రమశిక్షణా రాహిత్యం.’’ అని బీజేపీ తన నోటీసుల్లో పేర్కొంది.
Also Read
- Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
- Bengal exit polls: బీజేపీ వైపు నాలుగు, టీఎంసీ వైపు రెండు.. ఎగ్జిట్ పోల్స్తో ఉత్కంఠ..
- TM Exit Poll: తమిళనాడు సీఎంగా విజయ్.. సంచలనం స్పష్టిస్తున్న సర్వే..
- Measles Outbreak : బంగ్లాదేశ్ లో విజృంభిస్తున్న మీజిల్స్ మహమ్మారి..భారత్ కి ముప్పు తప్పదా ?
Read Also: LSG Vs KKR: కేకేఆర్ ఈడెన్లో విజయం పరంపర కొనసాగిస్తుందా? మొదట బ్యాటింగ్ చేయనున్న ఎల్ఎస్జి
రాజస్థాన్లోని అల్వార్లోని ఒక ఆలయం ఆదివారం రామనవమి నాడు కార్యక్రమం జరిగింది. దీనికి రాజస్థాన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత టికారం జుల్లీ హాజరయ్యారు. దళితుడైన టికారం జుల్లీ హాజరుకావడంతో ఆలయం అపవిత్రమైందని, తర్వాత రోజు గంగా జలంతో అహుజా ఆలయాన్ని శుద్ధి చేయడం వివాదాస్పదమైంది. ఈ వీడియో వైరల్ కావడంతో, కాంగ్రెస్ బీజేపీ టార్గెట్గా తీవ్ర విమర్శలు చేసింది. దేవుళ్లు బీజేపీ నాయకులకే చెందుతారా..? అని కాంగ్రెస్ ప్రశ్నించింది.
2013 నుండి 2018 వరకు రామ్గఢ్ ఎమ్మెల్యేగా పనిచేసిన జ్ఞాన్దేవ్ అహుజా వివాదాలకు కొత్తేమీ కాదు. 2016లో JNUలో జరిగిన “జాతి వ్యతిరేక” నినాదాల వివాదంలో ఆయన తొలిసారిగా వార్తల్లో నిలిచారు. JNU క్యాంపస్లో ప్రతిరోజూ 3,000 కండోమ్లు, 2,000 మద్యం సీసాలు దొరుకుతాయని ఆయన ఆరోపించడం సంచలనమైంది. 2017లో గోరక్షకులు పెహ్లూ ఖాన్ అనే పాడి రైతును హత్య చేయడాన్ని కూడా ఆయన సమర్థించారు.
తాజావార్తలు
-
Suvendu adhikari: 180 గెలుస్తున్నాం.. మమతా బెనర్జీ ఇక రెస్ట్ తీసుకో..
-
Weight Loss Mistakes: బాబోయ్ బరువు తగ్గడానికి ఈ పని మాత్రం చస్తే చేయకండి..!
-
MI vs SRH: సెంచరీతో రఫ్ఫాడించిన ‘ర్యాన్ రికెల్టన్’.. SRH ముందు భారీ టార్గెట్.!
-
TRS: టీఆర్ఎస్ పార్టీలోకి 50 మంది చేరిక.. ఎక్కడంటే..
-
Hyderabad Metro : తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలోకి హైదరాబాద్ మెట్రో
ట్రెండింగ్
-
Raw Mango Tomato Roti Pachadi: వేడివేడి అన్నానికి సూపర్ కాంబో “మామిడికాయ టమాటా రోటి పచ్చడి”.!
-
Open AI Financial Crisis : ఆర్థిక సంక్షోభంలో చాట్ జీపీటీ.?
-
Viral Wedding: పెళ్లి పీటలపై ఊహించని ట్విస్ట్.. వధువు ముందు వింత షరతు పెట్టిన పెళ్లి కొడుకు.. షాక్లో బంధువులు!
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?