Pakistan: పాకిస్తాన్లో “అజ్ఞాత వ్యక్తుల” హల్చల్.. మసూద్ అజార్ బంధువు, కీలక టెర్రరిస్టు హతం..
- పాకిస్తాన్లో "అజ్ఞాత వ్యక్తుల" హల్చల్..
- మసూద్ అజార్ బంధువు, కీలక ఉగ్రవాది హతం..
- పెషావర్లో పట్టపగలు మౌలానా ఐజాజ్ అబిద్ కాల్చివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: ఉగ్రవాదులు, ఉగ్రవాదానికి స్వర్గధామం అయిన పాకిస్తాన్లో ఇప్పుడు వారికి రక్షణ కరువైంది. ముఖ్యంగా భారత వ్యతిరేక టెర్రరిస్టులు ఇళ్లలో నుంచి బయటకు వెళ్తే మళ్లీ ఇంటికి చేరడం లేదు. ‘‘అజ్ఞాత వ్యక్తుల’’ లేదా ‘‘గుర్తు తెలియని వ్యక్తుల’’ దాడుల్లో వరసగా మరణిస్తున్నారు. సింపుల్గా బైక్పై వచ్చే వీరి, ఉగ్రవాదిని దగ్గర నుంచి కాల్చివేసి, వేగంగా అక్కడి నుంచి పారిపోతున్నారు. అసలు వీరు ఎవరనే విషయం ఇప్పటికీ పాక్ ప్రభుత్వానికి, దాని గూఢచర్య సంస్థ ఐఎస్ఐకి అస్పష్టంగా ఉంది.
Read Also: Mark Shankar: పవన్ కుమారుడికి గాయాలు.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్, రోజా..
Also Read
- Trump: ఇరాన్ సుంకాలు విధిస్తే మేమూ విధిస్తాం.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్
- US Military: అమెరికా ఆయుధ బలం తగ్గిందా? ఇరాన్ యుద్ధం తర్వాత బయటపడిన షాకింగ్ నిజాలు ఇవే!
- North Korea: మీ కుక్కల మాంసంతో సూప్ చేసుకుని తాగండి.. ఉత్తర కొరియా విచిత్ర సలహా..
- Sheikh Hasina: విద్యార్థి ఉద్యమం కాదు, రెజిమ్ ఛేంజ్ కుట్ర.. 2 ఏళ్ల తర్వాత మౌనం వీడిన షేక్ హసీనా..
తాజాగా మరో భారత వ్యతిరేక ఉగ్రవాదిని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ అధినేత, భారతదేశ శత్రువు మౌలానా మసూద్ అజార్ బంధువు మౌలానా ఐజాజ్ అబిద్ కాల్చి చంపబడ్డాడు. పాకిస్తాన్ రాడికల్ ఇస్లామిస్ట్గా ఐజాజ్ అబిద్కు పేరుంది. ఇతను జైషే మహ్మద్ కోసం కీలక రిక్రూటర్గా ఉన్నాడు. ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్లోని పిష్టాఖరా ప్రాంతంలో పట్టపగలే గుర్తుతెలియని వ్యక్తులు అబిద్ని కాల్చి చంపారు. ఇతడి సహాయకుడు ఖారీ షాహిద్ తీవ్రంగా గాయపడ్డారు.
అహ్లే-ఎ-సున్నత్ వాల్ జమాత్ (ASWJ) యొక్క ఉన్నత స్థాయి సంస్థకు అబిద్ కావాల్సిన వాడు. అంతర్జాతీయ ఖత్మ్-ఎ-నబువత్ ఉద్యమానికి ప్రాంతీయ అధిపతి గా ఇతడు పనిచేస్తు్న్నాడు. ఒక మసీదు వెలుపల జరిగిన మెరుపుదాడిలో ఇతను హతమయ్యాడు. జైషే మహ్మద్లో అబిద్ కీలక వ్యక్తిగా చలామణి అవుతున్నారు. హిందువులు, యూదులు, క్రైస్తవులపై నిత్యం వ్యతిరేకత వ్యక్తం చేసేవాడు. యువతను తన ప్రసంగాలతో రాడికలైజ్ చేసి ఉగ్రవాదులుగా మార్చేవాడు. అయితే, పాకిస్తాన్ వ్యాప్తంగా ఇస్లాంలో వివిధ గ్రూపుల మధ్య పడకపోవడం వల్లే హత్యలు జరుగుతున్నాయనే మరో ప్రచారం కూడా ఉంది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!