Saudi Arabia: 56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా..
- 56,000 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ..
- పాక్ బిచ్చగాళ్లతో యూఏఈ, సౌదీ, బహ్రయిన్ ఆందోళన..
- నో -ఫ్లై లిస్ట్, వీసా నిబంధనలు ఉన్నా ఆయా దేశాల్లో భిక్షాటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia: వీసా ఆంక్షలు, నో-ఫ్లై జాబితాలు, విదేశాల బహిష్కరణలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్లు మాత్రం యథేచ్చగా విదేశాల్లో భిక్షాటన చేస్తూనే ఉన్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, అజన్ బైజాన్ దేశాల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయా దేశాలు దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద తమ ఆందోళనల్ని వ్యక్తపరుస్తోంది. పాకిస్తాన్ను బిచ్చగాళ్ల ఎగుమతిని ఆపేయాలని హెచ్చరిస్తున్నాయి. మక్కా, మదీనా వంటి ఇస్లాం పవిత్ర స్థలాలు ఉన్న సౌదీ అరేబియా ఇటీవల తన దేశం నుంచి 56,000 మంది పాకిస్తానీయులను బహిష్కరించింది. ఈ వ్యవస్థీకృత ముఠాలు విదేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2025లో 66,154 మంది ప్రయాణికులను జాబితాను సిద్ధం చేసింది.
Read Also: PM Modi: ప్రధాని మోడీకి ఒమన్ అత్యున్నత పురస్కారం.. ‘‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ ప్రదానం..
Also Read
- Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
గత నెలలో, తమ దేశంలో నేర కార్యకలాపాలకు పాల్పడటం, భిక్షాటన చేస్తున్నారనే ఆందోళన నేపథ్యంలో యూఏఈ చాలా మంది పాకిస్తానీలకు వీసాలను ఆపేసింది. పాకిస్తాన్ వేలాది మంది పౌరులను ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ (ECL) లేదా నో-ఫ్లై జాబితాలో ఉంచిన నెలల తర్వాత పాకిస్తాన్ పార్లమెంటరీ ప్యానెల్ ఈ సంఖ్యలను జాతీయ అసెంబ్లీలో విడుదల చేసింది. గతేడాది సౌదీ అరేబియా పాకిస్తాన్ యాచకులను పవిత్ర నగరాలైన మక్కా, మదీనాల్లో భిక్షాటన చేయకుండా ఉమ్రా వీసాల దుర్వినియోగాన్ని ఆపాలని కోరింది.
చాలా కాలంగా, హజ్, ఉమ్రా వీసాలను దుర్వినియోగం చేస్తూ చాలా మంది పాకిస్తానీ యాచకులు మక్కా, మదీనాల్లో అడుక్కుంటున్నారు. అక్రమ వలసలు, భిక్షాటన బృందాలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయని పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ భద్రతా సంస్థ, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) చీఫ్ రిఫత్ ముఖ్తార్ అన్నారు. ఈ పరిస్థితిని నియంత్రణలోకి రాకుంటే, పాకిస్తానీలు హజ్, ఉమ్రా వెళ్లే వారిపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. పశ్చిమాసియాలో నిర్బంధించబడిన యాచకుల్లో 90 శాతం మంది పాకిస్తాన్కు చెందిన వారే అని 2024లో విదేశీ పాకిస్తానీ కార్యదర్శి జీషన్ ఖాన్జాదా అన్నారు.
తాజావార్తలు
-
Bermuda Triangle Mystery: బెర్ముడా రహస్యాన్ని ఛేదించిన శాస్త్రవేత్తలు.. అక్కడ ఏముందంటే..
-
Virat Kohli: కెప్టెన్గా కాదు.. స్నేహితుడిగా జట్టును నడిపించా.!
-
CNG Prices Hike: మరో బిగ్ షాక్.. సీఎన్జీ ధరలు భారీగా పెంపు..
-
Hyderabad Petrol Price: భాగ్యనగరంలో పెట్రోల్ మంట.. దేశంలోనే హైదరాబాద్లో అత్యధిక పెట్రోల్ ధర!
-
RBI Cancels 150 NFBC License: 150 ఎన్బిఎఫ్సి కంపెనీల ఆర్బీఐ కొరఢా.. లైసెన్సులు రద్దు
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!