Saudi Arabia: 56,000 మంది పాకిస్తాన్ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ అరేబియా..
- 56,000 మంది పాకిస్తానీ బిచ్చగాళ్లను బహిష్కరించిన సౌదీ..
- పాక్ బిచ్చగాళ్లతో యూఏఈ, సౌదీ, బహ్రయిన్ ఆందోళన..
- నో -ఫ్లై లిస్ట్, వీసా నిబంధనలు ఉన్నా ఆయా దేశాల్లో భిక్షాటన..
Saudi Arabia: వీసా ఆంక్షలు, నో-ఫ్లై జాబితాలు, విదేశాల బహిష్కరణలు ఉన్నప్పటికీ కూడా పాకిస్తాన్ బిచ్చగాళ్లు మాత్రం యథేచ్చగా విదేశాల్లో భిక్షాటన చేస్తూనే ఉన్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, అజన్ బైజాన్ దేశాల్లో పాకిస్తాన్ బిచ్చగాళ్లు కనిపిస్తున్నారు. దీంతో ఆయా దేశాలు దీనిపై పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద తమ ఆందోళనల్ని వ్యక్తపరుస్తోంది. పాకిస్తాన్ను బిచ్చగాళ్ల ఎగుమతిని ఆపేయాలని హెచ్చరిస్తున్నాయి. మక్కా, మదీనా వంటి ఇస్లాం పవిత్ర స్థలాలు ఉన్న సౌదీ అరేబియా ఇటీవల తన దేశం నుంచి 56,000 మంది పాకిస్తానీయులను బహిష్కరించింది. ఈ వ్యవస్థీకృత ముఠాలు విదేశాలకు వెళ్లకుండా నిరోధించడానికి పాకిస్తాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 2025లో 66,154 మంది ప్రయాణికులను జాబితాను సిద్ధం చేసింది.
Read Also: PM Modi: ప్రధాని మోడీకి ఒమన్ అత్యున్నత పురస్కారం.. ‘‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’’ ప్రదానం..
Also Read
- Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
- Condom Prices: బెడ్రూమ్లో అమెరికా - ఇరాన్ 'వార్' సెగ! కండోమ్ ధరలకు రెక్కలు!
- Brazilian Athlete: స్విమ్ రేస్ లో ప్రముఖ బ్రెజిలియన్ అథ్లెట్ మృతి..
- Hormuz Attack: హోర్ముజ్ జలసంధిలో మళ్లీ టెన్షన్.. మూడు వాణిజ్య నౌకలపై ఇరాన్ కాల్పులు.. తృటిలో తప్పిన ప్రమాదం!
గత నెలలో, తమ దేశంలో నేర కార్యకలాపాలకు పాల్పడటం, భిక్షాటన చేస్తున్నారనే ఆందోళన నేపథ్యంలో యూఏఈ చాలా మంది పాకిస్తానీలకు వీసాలను ఆపేసింది. పాకిస్తాన్ వేలాది మంది పౌరులను ఎగ్జిట్ కంట్రోల్ లిస్ట్ (ECL) లేదా నో-ఫ్లై జాబితాలో ఉంచిన నెలల తర్వాత పాకిస్తాన్ పార్లమెంటరీ ప్యానెల్ ఈ సంఖ్యలను జాతీయ అసెంబ్లీలో విడుదల చేసింది. గతేడాది సౌదీ అరేబియా పాకిస్తాన్ యాచకులను పవిత్ర నగరాలైన మక్కా, మదీనాల్లో భిక్షాటన చేయకుండా ఉమ్రా వీసాల దుర్వినియోగాన్ని ఆపాలని కోరింది.
చాలా కాలంగా, హజ్, ఉమ్రా వీసాలను దుర్వినియోగం చేస్తూ చాలా మంది పాకిస్తానీ యాచకులు మక్కా, మదీనాల్లో అడుక్కుంటున్నారు. అక్రమ వలసలు, భిక్షాటన బృందాలు ప్రపంచవ్యాప్తంగా పాకిస్తాన్ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీశాయని పాకిస్తాన్ సరిహద్దు నియంత్రణ భద్రతా సంస్థ, ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (FIA) చీఫ్ రిఫత్ ముఖ్తార్ అన్నారు. ఈ పరిస్థితిని నియంత్రణలోకి రాకుంటే, పాకిస్తానీలు హజ్, ఉమ్రా వెళ్లే వారిపై ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. పశ్చిమాసియాలో నిర్బంధించబడిన యాచకుల్లో 90 శాతం మంది పాకిస్తాన్కు చెందిన వారే అని 2024లో విదేశీ పాకిస్తానీ కార్యదర్శి జీషన్ ఖాన్జాదా అన్నారు.
తాజావార్తలు
-
Telangana : పోలీస్ శాఖలో భారీ పదోన్నతులు.. సజ్జనార్, మహేష్ భగవత్ లకు డీజీపీ హోదా..!
-
Earthquake: గుజరాత్లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?