Mamata Banerjee: “జి రామ్ జి” వివాదం.. బెంగాల్ స్కీమ్కు మహాత్మా గాంధీ పేరు..
- కేంద్రం, ప్రతిపక్షాల మధ్య ‘జి రామ్ జి’ చట్టం..
- ఉపాధి హామీ చట్టంలో మహాత్మా పేరు తీసేశారని ప్రతిపక్షాల ఆగ్రహం..
- బెంగాల్ పథకానికి ‘‘మహాత్మా గాంధీ’’ పేరు పెడతామన్న మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్తగా ‘‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అజీవక మిషన్ గ్రామీణ్(VB-G RAM G)’’ చట్టం, 2025ను తీసుకురావడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహాత్మా గాంధీ పేరును ఉద్దేశపూర్వకంగా బీజేపీ తొలగిస్తోందని, గాంధీ అంటే బీజేపీకి పడదని ఆరోపిస్తున్నాయి.
Read Also: Tata Motors: టాటా డిసెంబర్ ఆఫర్.. రూ. 4,999 EMIతోనే కార్ ఇంటికి తీసుకెళ్లొచ్చు..
Also Read
- Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Dk.Shivakumar: రేపు ఖర్గే, రాహుల్గాంధీతో డీకే.శివకుమార్ భేటీ.. మంత్రివర్గ కూర్పుపై చర్చ
- Kapil Sibal: భారత్లో నివసించడానికి సిగ్గుగా ఉంది.. కపిల్ సిబల్ వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడి
ఈ పేరు మార్పు వివాదం కొనసాగున్న వేళ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్రంలో అమలు చేస్తున్న ఒక పథకానికి మహాత్మా గాంధీ పేరును పెడుతున్నట్లు ప్రకటించారు. కర్మశ్రీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడానికి రాష్ట్ర క్యాబినెట్లో ఒక బిల్లును తీసుకువస్తుందని అన్నారు. గురువారం కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో మమత మాట్లాడుతూ.. ‘‘గాంధీజీ పేరు తొలగించడం నాకు తీవ్ర సిగ్గుచేటు. MGNREGA నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించే బిల్లును ప్రవేశపెట్టారు. మనం ఇప్పుడు జాతిపితను కూడా మర్చిపోతున్నామా?. అందుకే మేము మా కర్మశ్రీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాము. మేము గౌరవం తప్ప మరేమీ కోరుకోవడం లేదు. మహాత్మా గాంధీని ఎలా గౌరవించాలో కొందరికి తెలియకపోతే, నిజమైన గౌరవం అంటే ఏమిటో మేము చూపిస్తాము.’’ అని అన్నారు.
దీనికి కౌంటర్ గా పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ మరియు రాజ్యసభ ఎంపీ సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ‘‘తృణమూల్ కాంగ్రెస్ పాలనలో కూడా గతంలో గాంధీజీకి గౌరవం ఇస్తున్నట్లు నటిస్తూ కేంద్ర నిధుల నుండి డబ్బును దోచుకున్నారు. గాంధీకి రాముడంటే చాలా ఇష్టం. గాంధీజీకి సరైన గౌరవం ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీనే. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాల వల్ల గాంధీ కలలు నిజమయ్యాయి’’ అని అన్నారు.
తాజావార్తలు
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!