Mamata Banerjee: “జి రామ్ జి” వివాదం.. బెంగాల్ స్కీమ్కు మహాత్మా గాంధీ పేరు..
- కేంద్రం, ప్రతిపక్షాల మధ్య ‘జి రామ్ జి’ చట్టం..
- ఉపాధి హామీ చట్టంలో మహాత్మా పేరు తీసేశారని ప్రతిపక్షాల ఆగ్రహం..
- బెంగాల్ పథకానికి ‘‘మహాత్మా గాంధీ’’ పేరు పెడతామన్న మమతా బెనర్జీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) స్థానంలో కేంద్రం కొత్తగా ‘‘వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అజీవక మిషన్ గ్రామీణ్(VB-G RAM G)’’ చట్టం, 2025ను తీసుకురావడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మహాత్మా గాంధీ పేరును ఉద్దేశపూర్వకంగా బీజేపీ తొలగిస్తోందని, గాంధీ అంటే బీజేపీకి పడదని ఆరోపిస్తున్నాయి.
Read Also: Tata Motors: టాటా డిసెంబర్ ఆఫర్.. రూ. 4,999 EMIతోనే కార్ ఇంటికి తీసుకెళ్లొచ్చు..
Also Read
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
- TMC: సొంత డబ్బులతో విమానం కొని, దానికే అద్దె చెల్లించారు.. తృణమూల్ స్కాంతో ఈడీ షాక్..
ఈ పేరు మార్పు వివాదం కొనసాగున్న వేళ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాష్ట్రంలో అమలు చేస్తున్న ఒక పథకానికి మహాత్మా గాంధీ పేరును పెడుతున్నట్లు ప్రకటించారు. కర్మశ్రీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టడానికి రాష్ట్ర క్యాబినెట్లో ఒక బిల్లును తీసుకువస్తుందని అన్నారు. గురువారం కోల్కతాలో జరిగిన ఒక కార్యక్రమంలో మమత మాట్లాడుతూ.. ‘‘గాంధీజీ పేరు తొలగించడం నాకు తీవ్ర సిగ్గుచేటు. MGNREGA నుండి మహాత్మా గాంధీ పేరును తొలగించే బిల్లును ప్రవేశపెట్టారు. మనం ఇప్పుడు జాతిపితను కూడా మర్చిపోతున్నామా?. అందుకే మేము మా కర్మశ్రీ పథకానికి మహాత్మా గాంధీ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాము. మేము గౌరవం తప్ప మరేమీ కోరుకోవడం లేదు. మహాత్మా గాంధీని ఎలా గౌరవించాలో కొందరికి తెలియకపోతే, నిజమైన గౌరవం అంటే ఏమిటో మేము చూపిస్తాము.’’ అని అన్నారు.
దీనికి కౌంటర్ గా పశ్చిమ బెంగాల్ బీజేపీ చీఫ్ మరియు రాజ్యసభ ఎంపీ సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. ‘‘తృణమూల్ కాంగ్రెస్ పాలనలో కూడా గతంలో గాంధీజీకి గౌరవం ఇస్తున్నట్లు నటిస్తూ కేంద్ర నిధుల నుండి డబ్బును దోచుకున్నారు. గాంధీకి రాముడంటే చాలా ఇష్టం. గాంధీజీకి సరైన గౌరవం ఇచ్చింది ఎవరైనా ఉన్నారంటే అది బీజేపీనే. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రయత్నాల వల్ల గాంధీ కలలు నిజమయ్యాయి’’ అని అన్నారు.
తాజావార్తలు
-
BSNL Mobile: కాల్స్ చేసుకోవడానికి సిగ్నల్స్ అవసరమే లేదు.. అద్భుత ఫోన్ లాంచ్ చేసిన BSNL..
-
CM Revanth Reddy: యువతకు సీఎం సంచలన ఆఫర్.. క్రీడా విజేతలకు ఉద్యోగాల గ్యారెంటీ
-
Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
-
US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
-
Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!