Crime: ముస్లిం భార్య వివాదం.. తల్లిదండ్రుల్ని చంపి, మూడు ముక్కలు చేసిన కొడుకు..
- ముస్లిం మహిళతో వివాదం, తల్లిదండ్రులతో విభేదాలు..
- దారుణహత్యకు పాల్పడిన కొడుకు..
- పేరెంట్స్ను చంపి, రంపంతో కోసి హత్య..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Crime: ఒక వ్యక్తి ముస్లిం మహిళను పెళ్లి చేసుకోవడం దారుణమైన హత్యలకు దారి తీసింది. డబ్బు, భూ వివాదాలతో పాటు మతాంతర వివాహం వల్ల ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పూర్లో ఒక వ్యక్తి తన తల్లిదండ్రుల్ని క్రూరంగా హత్య చేశాడు. హత్య తర్వాత ఐదు రోజుల గాలింపు చేపట్టాక వృద్ధ దంపతుల శవాలు గురువారం దొరికాయి. సొంత కొడుకే వారిని హత్య చేసి, వారి శరీరాలను రంపంతో మూడు ముక్కలుగా కోసి, సిమెంట్ బ్యాగులో పెట్టి, స్థానికంగా ఉన్న నదిలో పారేశాడు.
నిందితుడు అంబేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కోవిడ్ మహమ్మారి సమయంలో అంబేష్ కోల్కతాలో ఒక ముస్లిం మహిళను వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మతాంతర వివాహం కావడంతో తరుచుగా అంబేష్ తల్లిదండ్రులు ఈ వివాహాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. దీని వల్ల కుటుంబంలో గొడవలు ప్రారంభయ్యాయి. ఇద్దరు విడిపోవాలని తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. అయితే, ఈ వివాదం నేపథ్యంలో విడిపోతే, తనకు భరణం చెల్లించాలని అతడి భార్య డిమాండ్ చేయడం ప్రారంభించింది. దీంతో, అంబేష్ తన తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సాయం కోరాడు. దీని తర్వాత గొడవలు మరింత ముదిరాయి.
Also Read
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Criminal Lawyer: కోర్టులో లాయర్.. బయట గంజాయి స్మగ్లర్! పుష్ప స్టైల్లో స్మగ్లింగ్..
- TG-AP THEFTS: తెలుగు రాష్ట్రాల్లో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు.. నిమిషాల్లోనే ఎలా చక్కబెట్టారంటే..!
- Cab Driver: నమ్మించి వంచించాడు.. నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ దాడి..
Read Also: Sitara – Akhanda 2 : అఖండ2లో పాత్ర కోసం సితార మొదలు సూర్య కూతురి దాకా?
గత మూడు నెలల క్రితం, అంబేష్ కోల్కతా నుంచి తిరిగి వచ్చి తల్లిదండ్రులతో ఉంటున్నాడు. అయినప్పటికీ అంబేష్, అతడి తల్లిదండ్రుల మధ్య గొడవలు మాత్రం ఆగలేదు. దీంతో డిసెంబర్ 8న తీవ్ర వాగ్వాదం తర్వాత, అంబేష్ తన తల్లి బబితా(63) తలపై ఇనుపరాడ్తో దాడి చేశాడు. అతడి తండ్రి శ్యామ్ బహదూర్(65) కేకలు వేయడానికి ప్రయత్నించగా, అంబేష్ అతడిని కూడా రాడ్తో కొట్టి తాడుతో ఉరివేసి చంపాడు. ఆ తర్వాత, మృతదేహాలను రంపంతో మూడు ముక్కలుగా కోసి ఆరు సిమెంట్ సంచుల్లో కుక్కి, కారులో వాటిని తీసుకెళ్లే గోమతి నదిలో పారేశాడు. తల్లికి చెందిన ఒక భాగాన్ని వారణాసి వైపు వెళ్తున్నప్పుడు సాయి నదిలో విసిరేశాడు.
అయితే, తన తల్లిదండ్రులు కనిపించండం లేదని, తన సోదరుడిని సంప్రదించలేకపోతున్నారని డిసెంబర్ 13న కూతురు డిసెంబర్ 13న అదృశ్యం కేసు నమోదు చేసింది. డిసెంబర్ 15న అంబేష్ ఎక్కడ ఉన్నాడో కనిపిపెట్టిన పోలీసులు, విచారించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. గజ ఈతగాళ్లు శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Janani Dialogues 2026: భారతదేశపు పునరుత్పత్తి ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు.. ‘ఒయాసిస్ అకాడమీ’ ప్రారంభం
-
Ashok Sharma: తమ్ముడి భవిష్యత్తు కోసం కెరీర్నే త్యాగం చేసిన అన్నయ్య.. టీమిండియా క్యాప్ సాధించి కన్నీటిపర్యంతమైన అశోక్ శర్మ!
-
Trump Tariffs: మళ్లీ షాకిచ్చిన ట్రంప్.. భారత్ సహా 17 దేశాలపై అమెరికా అదనపు సుంకం..
-
Redmi 17C 5G: రెడ్మీ 17C 5G భారత్ లో విడుదలకు రెడీ.. BISలో కనిపించిన బడ్జెట్ ఫోన్, 6000mAh బ్యాటరీ
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
ట్రెండింగ్
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!