Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Indian Railways Announces Fare Hike From Dec 26 Check New Train Ticket Prices

Railway fare hike: రైలు ప్రయాణికులకు షాక్.. పెరిగిన రైల్వే ఛార్జీలు..

Published Date :December 21, 2025 , 1:17 pm
By Venu Goapl Reddy
  • రైలు ప్రయాణికులకు షాక్..
  • పెరిగిన రైల్వే ఛార్జీలు..
  • స్వల్పదూరాల ప్రయాణికులకు ఊరట..
  • 215కి.మీ కన్నా దూరంగా ప్రయాణించే వారిపై ప్రభావం..
  • పెరిగిన ఛార్జీలు కూడా స్వల్పమే..
Railway fare hike: రైలు ప్రయాణికులకు షాక్.. పెరిగిన రైల్వే ఛార్జీలు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Railway fare hike: రైలు ప్రయాణికులకు షాకింగ్ న్యూస్. డిసెంబర్ 26, 2025 నుంచి ప్రయాణికుల రైలు ఛార్జీలు పెంచుతున్నట్లు ఇండియన్ రైల్వేస్ ప్రకటించింది. అయితే, ఈ ఛార్జీల పెంపు వల్ల ప్రధానంగా సుదూర ప్రయాణికులపై ప్రభావం పడనుంది. అయితే, రోజూవారీ ప్రయాణికులు, స్వల్ప దూరాలు ప్రయాణించే ప్రయాణికులకు ప్రభావం ఉండదు. పెరుగుతున్న ఇంధన, నిర్వహణ, ఆపరేషనల్ ఖర్చులను నిర్వహించడానికి, చాలా మందికి రైలు ప్రయాణాన్ని అందుబాటులో ఉంచడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.

రోజూవారీ ప్రయాణికులపై భారం పడకుండా ఛార్జీలను పెంచింది. సబర్బన్ రైళ్లు, నెలవారీ సీజన్ టిక్కెట్ల ఛార్జీల్లో ఎలాంటి పెరుగుదల ఉండదని రైల్వే ప్రకటించింది. ఈ చర్య వల్ల రోజూవారీ ప్రయాణం కోసం స్థానిక రైళ్లపై ఆధారపడే లక్షలాది మంది ప్రయాణికులకు ఉపశమనం కలిగిస్తుంది. 215 కిలోమీటర్ల (కి.మీ.) దూరం వరకు జనరల్ క్లాస్ టిక్కెట్ల ధరలో ఎలాంటి మార్పు ఉండదు. మునుపటి ఛార్జీలే వీరికి వర్తిస్తాయి. తక్కువ దూరం ప్రయాణించే వారిపై ఛార్జీల భారం పడకుండా రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది.

సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారిపై ఛార్జీల పెంపు ప్రభావం చూపనుంది.

* జనరల్ క్లాస్‌లో ( 215 కి.మీ దాటి ప్రయాణిస్తే), కిలోమీటర్‌కు 1 పైసా ఛార్జీ పెరుగుతుంది.
* మెయిల్, ఎక్స్‌ప్రెస్ నాన్ ఏసీ రైళ్ల ఛార్జీలు కిలోమీటర్‌కు 2 పైసలు పెరుగుతుంది.
* ఏసీ (అన్ని క్లాసులు)ల ఛార్జీ కిలోమీటర్‌కు 2 పైసలు పెరుగుతుంది.

దీని అర్థం ఏంటంటే, కొత్త ధరలు అమలులోకి వచ్చిన తర్వాత నాన్-ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లలో 500 కి.మీ. ప్రయాణానికి రూ. 10 అదనంగా ఖర్చు అవుతుంది. ఈ పెరుగుదల సుదూర ప్రాంతాల ప్రయాణికులకు కూడా కొన్ని రూపాయలు మాత్రమే పెరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. తాజా ఛార్జీల పెంపు ద్వారా రైల్వేల ఆదాయం ఏటా రూ. 600 కోట్లు పెరుగుతుంది. రైల్వేలు తమ మానవశక్తి ఖర్చు రూ.1,15,000 కోట్లకు, పెన్షన్ ఖర్చు రూ.60,000 కోట్లకు పెరిగిందని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్యకలాపాల ఖర్చు రూ.2,63,000 కోట్లకు పెరిగింది. ఈ మానవశక్తి ఖర్చు పెరుగుదలను తీర్చడానికి, కార్గో లోడింగ్ మరియు ప్రయాణీకుల ఛార్జీల పెంపును పెంచడంపై దృష్టి సారించినట్లు రైల్వేలు తెలిపాయి.

గతంలో, జూలైలో రైల్వేలు ఛార్జీలనను పెరిగాయి. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో నాన్ ఏసీ తరగతి ఛార్జీలను కి.మీకి 1 పైసా పెంచారు. ఎయిర్ కండిషన్డ్ క్లాసులో ప్రయాణ ఛార్జీలు కి.మీకి 2 పైసలు పెంచారు. దీనికి ముందు, జనవరి 1, 2020న రైలు ఛార్జీలు పెరిగాయి. ఆ సమయంలో ఆర్డినరీ, మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సెకండ్ క్లాస్ ఛార్జీలు వరసగా 1 పైస/కి.మీ. మరియు 2 పైసలు/కి.మీ.కు పెరిగాయి. స్లీపర్ క్లాస్, ఏసీ క్లాస్ ఛార్జీలు వరసగా 2 పైసలు/కి.మీ, 4 పైసలు/కి.మీ పెరిగాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • AC train fare hike
  • Indian Railways
  • Indian Railways fare hike
  • mail express fare increase
  • railway fare update

తాజావార్తలు

  • Wired Earphones: ఓల్డ్ ఈజ్ గోల్డ్.. మళ్లీ వైర్డ్ ఇయర్ ఫోన్స్‌కు పెరుగుతున్న డిమాండ్.. కారణం ఇదే..

  • Artemis II: చంద్రుని అదృశ్య భాగాన్ని తొలిసారిగా చూడనున్న నలుగురు వ్యోమగాములు.. అపోలో 17 తర్వాత తొలి మానవసహిత యాత్ర

  • Vastu Tips: వేసవిలో మట్టి కుండ తీసుకున్నారా..? మీ అదృష్టం మారలంటే ఇంట్లో ఈ దిశలో పెట్టండి..!

  • IT Employees: ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలకు ‘షేరింగ్’ తోనే చెక్.. మాదాపూర్ పోలీసుల సర్వేలో ఆసక్తికర అంశాలు

  • Condom: కండోమ్ రంగు మారితే.. వ్యాధి ఉన్నట్లే.. కొత్త టెక్నాలజీ వచ్చేసింది..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions