Venu Goapl Reddy
Author- NTV Telugu-
Indians deportation: యూఎస్తో పోలిస్తే, ఈ ముస్లిం దేశమే భారతీయుల్ని ఎక్కువగా బహిష్కరించింది..
Indians deportation: భారతీయుల్ని బహిష్కరించడంలో సౌదీ అరేబియా అమెరికాను మించిపోయింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత యూఎస్ తన వీసా నిబంధనల్ని కఠినతరం చేసింది. ట్రంప్ వీసా విధానం, ఆ దేశంలో పనిచేస్తున్న భారతీయ వర్కర్లను ఇబ్బందులకు గురిచేస్తోంది. -
Digvijaya Singh: బీజేపీ-ఆర్ఎస్ఎస్పై డిగ్గీరాజా ప్రశంసలు.. కాంగ్రెస్ పరేషాన్..
Digvijaya Singh: బీజేపీ, ఆర్ఎస్ఎస్లను ఎప్పుడూ విమర్శించే కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, తాజాగా ఈ సంస్థలపై ప్రశంసలు కురిపించడం సంచలనంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సంస్కరణలు తీసుకురావాలని రాహుల్ గాంధీకి లేఖ రాసిన వారం తర్వాత కొత్త వివాదానికి తెర లేపారు. 1990ల నాటి ప్రధాని మోడీ, అద్వానీల బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ, బీజేపీ దాని సైద్ధాంతిక మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)పై ప్రశంసించారు. -
Bangladesh: బంగ్లాదేశ్ సింగర్ కచేరీపై మతోన్మాద గుంపు దాడి..
Bangladesh: బంగ్లాదేశ్ వ్యాప్తంగా మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయి. ఇప్పటికే, ఇద్దరు హిందువుల్ని అత్యంత దారుణంగా హత్యలు చేశారు. బంగ్లాదేశ్ కళాకారులు, సాంస్కృతిక చిహ్నాలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా, ఢాకాకు 120 కి.మీ దూరంలో ఉన్న ఫరీద్పూర్లో బంగ్లా ఫేమస్ సింగర్ జేమ్స్ కచేరీపై దాడికి పాల్పడ్డారు. -
Tamil Nadu Deepam Row: తమిళనాడు దీపం వివాదం.. “దర్గా” వద్ద జంతుబలి ఆపాలని పిటిషన్..
Tamil Nadu Deepam Row: తమిళనాడులోని తిరుపరంకుండ్రం సుబ్రమణ్యస్వామి ఆలయంలో దీపం వెలిగింపు వివాదం, ఆ రాష్ట్రంలో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మద్రాస్ హైకోర్టు కొండపై ఉన్న ఆలయం వద్ద దీప వెలిగించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ప్రభుత్వం దానిని పట్టించుకోలేదు. దీంతో భక్తులు బలవంతంగా కొండపైకి వెళ్లి దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయడంతో పెద్ద ఎత్తున హింస చెలరేగింది. ఇదిలా ఉంటే, ఈ వివానానికి కారణంగా ఉన్న దర్గాపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దర్గాలో […] -
Israel: “నమాజ్” చేస్తున్న పాలస్తీనా వ్యక్తిని వాహనంతో ఢీకొట్టిన ఇజ్రాయిల్ సైనికుడు..
Israel: ఆక్రమిత వెస్ట్ బ్యాంక్ ప్రాంతంలో నమాజ్ చేస్తున్న పాలస్తీనా వ్యక్తి పైకి గురువారం ఒక ఇజ్రాయిలీ సైనికుడు వాహనంతో దూసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో తమకు అందిందని ఇజ్రాయిల్ సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది. -
Pakistan: పాకిస్తాన్కు మరిన్ని చైనీస్ ఫైటర్ జెట్స్: పెంటగాన్ రిపోర్ట్..
Pakistan: పాకిస్తాన్కు చైనా తన నాలుగో తరం యుద్ధవిమానమైన J-10Cని ఇస్తోంది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం, చైనా గత ఐదేళ్లలో 20 యుద్ధవిమానాలను సరఫరా చేసిందని, ఇప్పుడు మరో 16 J-10 ఫైటర్ జెట్లను ఇవ్వబోతున్నట్లు పెంటగాన్ తాజా నివేదిక వెల్లడించింది. ఆఫ్రికా, ఆసియాలోని కొన్ని దేశాలతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో చైనా స్థావరాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని పేర్కొంది. J-10C సింగిల్ సీటర్ ఫైటర్ జెట్ కాగా, J-10S డబుల్ సీటర్, […] -
Syria: శుక్రవారం ప్రార్థనల సమయంలో మసీదులో భారీ పేలుడు.. 8 మంది మృతి..
Syria: సిరియాలో బాంబు పేలుడు ఘటన జరిగింది. శుక్రవారం ప్రార్థనల సమయంలో హోమ్స్లోనే అలవైట్ ప్రాంతంలోని మసీదులో ఈ సంఘటన జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. మైనారిటీ వర్గంపై జరిగిన ఈ దాడిలో కనీసం 8 మంది మరణించారు. ఇస్లామిస్టులు ఈ ఏడాది బషర్ అల్ అసద్ను గద్దె దింపి అధికారాన్ని చేపట్టారు. -
Makkah: మక్కా మసీదులో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. రక్షించిన వీడియో వైరల్..
Mecca: ముస్లింల పవిత్రస్థలం సౌదీ అరేబియాలోని మక్కాలో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రయత్నించిన సంఘటన వైరల్గా మారింది. మక్కాలోని మసీదు అల్-హరామ్లో ఈ ఘటన జరిగింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతున్న వ్యక్తిని అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అడ్డుకుంది. పై అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించిన వ్యక్తిని కింద ఉన్న భద్రతా సిబ్బందిలో ఒకరు రక్షించారు. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. -
Droupadi Murmu: 10 ఏళ్ల బాలుడికి రాష్ట్రపతి నుంచి “బాల పురస్కారం”.. ‘‘ఆపరేషన్ సిందూర్’’ సమయంలో ఏం చేశాడంటే..
Droupadi Murmu: 10 ఏళ్ల బాలుడు శ్రవణ్ సింగ్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం’’ దక్కింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో యుద్ధభూమిలో ఉన్న మన జవాన్లకు నీరు, పాలు, లస్సీ అందిస్తూ తన దేశభక్తిని చాటుకున్నాడు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లోని తన ఇంటికి సమీపంలో ఉన్న పాక్ సరిహద్దుల్లో మోహరించిన భారత సైన్యానికి క్రమం తప్పకుండా సేవ చేశాడు. శ్రవణ్ సింగ్ కనబరిచిన దేశభక్తికి రాష్ట్రపతి నుంచి శుక్రవారం ఈ పురస్కారం దక్కింది. -
Tata Motors: టాటా నుంచి కొత్తగా 5 ఎలక్ట్రిక్ కార్లు..
Tata Motors: టాటా మోటార్స్(Tata Motors), తన ఎలక్ట్రిక్ వాహనాల(EV) పోర్ట్ఫోలియోను మరింత బలపరుచుకోవాలని భావిస్తోంది. ఇప్పటికే, దేశంలో ఈవీ కార్ మార్కెట్లో టాటా అగ్రగామిగా ఉంది. అయితే, 2030 నాటికి మరో 5 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. భారత్లో వేగంగా ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన మార్కెట్ పెరుగుతన్న నేపథ్యంలో, అగ్రగామిగా ఉన్న టాటా తన స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని భావిస్తోంది. 2026 నుంచి టాటా నుంచి కొత్త ఈవీ కార్లు మార్కెట్లోకి రాబోతున్నాయి.
తాజావార్తలు
-
Pawan Kalyan: రేపు హైదరాబాద్కు పవన్ కల్యాణ్.. ఫిజియోథెరపీ తప్పనిసరి
-
Netanyahu-Iran: ఇరాన్కు నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్.. ఈసారి దాడి చేస్తే మాత్రం..!
-
IND vs ENG 1st ODI: అక్షర్ పటేల్ మ్యాజిక్.. 258 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్!
-
Mudragada Padmanabham Passes Away: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
-
Saudi-Houthi: పశ్చిమాసియాలో కొత్త ఘర్షణ.. సౌదీ-హౌతీ మధ్య దాడులు..పాక్ రంగంలోకి దిగుతుందా?
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!