Shahid Afridi: “కేరళ కమ్యూనిటీ” ఈవెంట్కి అతిథిగా షాహిద్ అఫ్రిది.. ‘‘సిగ్గు లేదు’’ అని నెటిజన్లు ఫైర్..
- కేరళ కమ్యూనిటీ కార్యక్రమానికి షాహిద్ అఫ్రిది..
- భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య అఫ్రిదిని స్వాగతించడంపై వివాదం..
- దుబాయ్లో కేరళ కార్యక్రమానికి రావడంపై నెటిజన్ల ఫైర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahid Afridi: దుబాయ్లో కేరళ గ్రూప్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి అతిథులుగా పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్ రావడం తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. దుబాయ్లోని కేరళ కమ్యూనిటీపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత వ్యతిరేకి అయిన షాహిద్ అఫ్రిదిని ఆహ్వానించడంపై భారత సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కొచ్చిన్ యూనివర్సిటీ బి.టెక్ పూర్వ విద్యార్థుల సంఘం (CUBAA) గత వారం పాకిస్తాన్ అసోసియేషన్ దుబాయ్ (PAD)లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే, దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో CUBAA ఒక ప్రకటన విడుదల చేసింది, పాకిస్తానీ క్రికెటర్లు ఆహ్వానం లేకుండానే ఆ కార్యక్రమానికి హాజరయ్యారని, అదే వేదికలో వేరే కార్యక్రమానికి హాజరవుతున్నారని పేర్కొంది.
దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్గా మారింది. వీడియోలో షాహిద్ అఫ్రిది, ఉమర్ గుల్ని కేరళ కమ్యూనిటీ సాదరంగా ఆహ్వానించడం చూడవచ్చు. అఫ్రిది వేదికపైకి వచ్చినప్పుడు కింద ఉన్న వారు ‘‘ బూమ్ బూమ్’’ అని నినాదాలు చేశారు. అయితే, దీనికి ప్రతిస్పందనగా అఫ్రిది ‘‘హోగయా బూమ్ బూమ్’’ అని ప్రతిస్పందించాడు. తాను కేరళ ఫుడ్కి పెద్ద అభిమాని అని చెప్పడం వినవచ్చు.
Also Read
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
- India-UK: అమల్లోకి భారత్-యూకే ఒప్పందం.. ఏవేవి ధరలు తగ్గాయంటే..!
- Bengal: బెంగాల్ రాజకీయాల్లో కొత్త చర్చ! మమతకు కాంగ్రెస్ ఆహ్వానం
- USA: "నువ్వు ముస్లింవా?" అని భారతీయుడిపై 15 సార్లు కత్తితో దాడి..
Read Also: APPSC Scam: ఏపీపీఎస్సీ గ్రూపు 1 కేసు.. రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులుకు అస్వస్థ..!
అయితే, భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు ఉన్న సమయంలో భారత ఆర్మీని కించపరిచేలా వ్యాఖ్యానించిన అఫ్రిది వంటి వ్యక్తిని కార్యక్రమానికి ఆహ్వానించడం ఏంటని భారత నెటిజన్లు ఎస్ఎంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఇది సిగ్గులేని తనం’’ అని విమర్శించారు. ఈ కార్యక్రమానికి హాజరైన భారతీయులపై ఎన్ఐఏ విచారణ జరపాలని, వారి పౌరసత్వాన్ని రద్దు చేయాలని మరొకరు డిమాండ్ చేశారు. భారత్పై విషం చిమ్మే ఆఫ్రిది వంటి వ్యక్తిని కార్యక్రమానికి ఆహ్వానించడం ఏంటని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరు నిజంగా కేరళ 100 శాతం అక్షరాస్యత కలిగిన రాష్ట్రమా..? అని ప్రశ్నిస్తున్నారు.
పహల్గామ్ టెర్రర్ అటాక్పై అఫ్రిది నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ‘‘కాశ్మీర్లో 8 లక్షల మంది భారత సైన్యం ఉన్న ఉగ్రవాద దాడిని ఆపలేదని, వారంతా అసమర్థులు’’ అంటూ అఫ్రిది భారత్పై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇదే కాకుండా, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్పై పాక్ ఆర్మీ విజయం సాధించిందని పెద్ద ఎత్తున విక్టరీ ర్యాలీలు నిర్వహించాడు.
What a shame!! – Desperate Keralites welcome this Anti-India Paki with 'Boom Boom' at an event in Dubai, especially after Pahalgam terror attack and his venomous stand against India pic.twitter.com/F8Fuigxu4s
— Megh Updates 🚨™ (@MeghUpdates) May 30, 2025
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ బీజేపీలో ‘నో సింగిల్స్.. ఓన్లీ మింగిల్స్’
-
NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
-
Off The Record: విజయశాంతి తీరుపై తెలంగాణ పీసీసీ సీరియస్ గా ఉందా..?
-
Vaibhav Sooryavanshi: ఈసారి కొట్టాల్సిందే..! హనుమంతుడి ఆశీస్సులు తీసుకొని నెట్స్లోకి వైభవ్
-
OTR: కూటమి సర్కార్కే షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో REDMI Note 17 Pro లాంచ్..!