PM Modi: భారతదేశ చరిత్రలోనే ‘‘సిందూర్’’ విజయవంతమైన యాంటీ-టెర్రర్ ఆపరేషన్..
- సిందూర్ భారత చరిత్రలోనే సక్సెస్పుల్ ఆపరేషన్..
- మరోసారి దాడి చేస్తే మళ్లీ మూల్యం చెల్లించుకుంటారు..
- ఉగ్రవాదులు, పాకిస్తాన్కి ప్రధాని మోడీ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: పాకిస్తాన్ లోని ఉగ్రవాదులు భారతదేశ ‘‘నారీ శక్తి’’ని తక్కువగా అంచనా వేసి తమ వినాశనాన్ని కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిలో మహిళల ముందే భర్తల్ని ఉగ్రవాదులు చంపారు. ఈ సంఘటనలో లష్కరే తోయిబా ఉగ్రవాదులు 26 మందిని బలి తీసుకున్నారు. ఉగ్రవాదంపై భారతదేశ చరిత్రలోనే ఆపరేషన్ సిందూర్ అతిపెద్ద విజయవంతమైన చర్యగా ప్రధాని ప్రకటించారు.
Read Also: Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ నష్టాలపై తొలిసారి స్పందించిన సీడీఎస్.. ఏం చెప్పారంటే..
Also Read
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- PM Modi: ప్రధాని మోడీని కలిసిన స్కూల్ ఫ్రెండ్ అస్గర్ అలీ.. బీజేపీ ఎమ్మెల్యేపై ఫిర్యాదు..
- Maharashtra: జాయింట్ వీల్లో చిక్కుకున్న మహిళ జడ.. జట్టుతో సహా తల చర్మం ఊడి తీవ్ర గాయం..
- Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం..
“పహల్గామ్లో, ఉగ్రవాదులు కేవలం రక్తం చిందించలేదు, వారు మన సంస్కృతిపై దాడి చేశారు. వారు మన సమాజాన్ని విభజించడానికి ప్రయత్నించారు. ఉగ్రవాదులు భారతదేశ నారీ శక్తిని సవాలు చేశారు. ఈ సవాలు ఉగ్రవాదులకు, వారి స్పాన్సర్లకు శాపంగా మారింది” అని రాణి అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా భోపాల్లో జరిగిన ‘మహిళా సశక్తికరణ్ మహా సమ్మేళనం’లో పాల్గొన్న ప్రధాని మోదీ అన్నారు.
భారత సైన్యం ఉగ్రవాద స్థావరాలను నాశనం చేసి పాకిస్తాన్ని ఆశ్చర్యపరిచిందని ప్రధాని మోడీ అన్నారు. పాకిస్తాన్లోకి వందల కి.మీ చొచ్చుకెళ్లి మరీ వారి శిబిరాలను నాశనం చేశామని చెప్పారు. భారత్పై మళ్లీ ఉగ్రదాడి జరిగితే పాకిస్తాన్, దాని ఉగ్రవాదులు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉగ్రవాదుల్ని వారి ఇళ్లలోకి దూరి మరీ చంసేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
-
UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
-
TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?