Venu Goapl Reddy
Author- NTV Telugu-
Jammu Kashmir Encounter: 20 సార్లు తప్పించుకున్నాడు, ఈసారి కుక్కచావు.. జైష్ ఉగ్రవాది సైఫుల్లా అంతం..
Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్లో భద్రతా బలగాలకు కీలక విజయం దక్కింది. మోస్ట్ వాంటెంట్ జైషే మహ్మద్ ఉగ్రవాది సైఫుల్లా బలోచ్ హతమ్యాడు. కిష్త్వార్ జిల్లాలో జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో చచ్చారు. సైఫుల్లాపై రూ. 5 లక్షల రివార్డ్ ఉంది. జమ్మూ కాశ్మీర్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఇతను ఒకడు. ముగ్గురు ఉగ్రవాదులు ఒక గుడిసెలో దాక్కున్నారనే పక్కా సమాచారంతో భద్రతా బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ […] -
Donald Trump: ట్రంప్ ఇంట్లోకి ఆగంతకుడు.. కాల్చి చంపిన సెక్యూరిటీ..
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన ఫ్లోరిడాలోని మార్-ఏ-లాగో రిసార్ట్ లోకి అనధికారికంగా ప్రవేశించిన చొరబాటుదారుడిని భద్రతా సిబ్బంది కాల్చి చంపారు. మార్ ఎ లాగో ఎస్టేట్ ఆవరణలోకి అక్రమంగా ప్రవేశించిన ఒక సాయుధ వ్యక్తిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు హతమార్చారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ట్రంప్ అక్కడ లేరు. -
Akhilesh Yadav: ‘‘100 మంది ఎమ్మెల్యేలను తీసుకొచ్చి మీరే సీఎం అవ్వండి’’.. అఖిలేష్ బంపర్ ఆఫర్..
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదివారం విదేశీ పర్యటనలకు వెళ్తున్నారు. అయితే, దీనికి ముందే సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్లకు అఖిలేష్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. -
Hindus: అమెరికాలో విద్యాధికులు హిందువులే..
Hindus: అమెరికాలో అత్యధిక విద్యావంతులు హిందువులే అని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మతాలపై చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Center) ఇటీవల విడుదల చేసిన '2023-24 రిలిజియస్ ల్యాండ్స్కేప్ స్టడీ'లో అమెరికాలో వివిద మతాల విద్యాస్థాయిలపై ఆసక్తికరమైన గణాంకాలు వెల్లడయ్యాయి. -
The Kerala Story 2: ‘‘ఇలా గొడ్డు మాంసం ఎవరు తినిపిస్తారు.?’’ కేరళ స్టోరీపై అనురాగ్ కశ్యప్ విమర్శలు..
The Kerala Story 2: విడుదలకు ముందే ‘‘ది కేరళ స్టోరీ 2’’ ప్రకంపనలు సృష్టిస్తోంది. ముఖ్యంగా కేరళలో అధికార కమ్యూనిస్ట్ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సీఎం పినరయి విజయన్ కూడా మండిపడుతున్నాడు. కేరళలో మతాల మధ్య చిచ్చు పెట్టాలని ఇలాంటి సినిమాలు తీస్తున్నారని విమర్శిస్తున్నారు. కేరళను ఉగ్రవాదానికి కేంద్రంగా చూపించే ప్రయత్నాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. -
Jowar Recipes: “జొన్న గుగ్గిళ్లు” ట్రై చేయండి.. వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్కు బెస్ట్ రెసిపీ..
Jowar Recipes: ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్, వర్క్ కల్చర్ కారణంగా చాలా మంది ప్రిడయాబెటిక్, డయాబెటిక్గా మారుతున్న, కూర్చుని ఒకే చోట కదలకుండా పనిచేస్తుండటంతో చాలా మంది బరువు పెరుగుతున్నారు. ఇలాంటి వారు బరువు తగ్గడానికి, షుగర్ కంట్రోల్ కావడానికి ‘‘జొన్నలు(Jowar)’’లను ఆహారంగా తీసుకుంటుున్నారు. వైట్ రైస్ను పరిమితం చేస్తున్నారు. -
Bride Kidnapped: ఎంతకు తెగించాడు.. వధువు కిడ్నాప్, నడిరోడ్డుపై వరుడు..
Bride Kidnapped: ఒడిశాలోని బోలంగీర్ జిల్లాలో షాకింగ్ సంఘటన జరిగింది. కొత్తగా పెళ్లయిన వధువు, తన భర్తతో కలిసి అత్తారింటిక వెళ్తుంటే, తలకు గన్ గురి పెట్టి ఆమెను కిడ్నాప్ చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తి వధువు మాజీ ప్రేమికుడిగా తేలింది. బోలంగీర్ జిల్లా నివాసి, వరుడు హరిబంధు పటేల్ వివాహం కోసం కాంటమల్కు వెళ్లాడు. వివాహం ముగిసిన తర్వాత, వధూవరులు కుటుంబ సభ్యులతో కలిసి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి వాహణాన్ని […] -
Tamil Nadu: తమిళనాడులో ఉగ్ర కలకలం.. పాక్ కోసం బంగ్లాదేశీయుల గూఢచర్యం..
Tamil Nadu: దేశంలో భారీ ఉగ్రకుట్న భగ్నమైంది. తమిళనాడులో 8 మంది అనుమానితుల్ని ఢిల్లీ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది. వీరంతా లష్కరే తోయిబా మాడ్యుల్కు చెందిన వారిగా గుర్తించారు. పట్టుబడిన ఉగ్రవాదులు పాకిస్తాన్ నిఘా సంస్థ ‘‘ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ)’’ కోసం పనిచేస్తున్నట్లు, వారి తరుపున భారతదేశంలో గూఢచర్యం చేస్తున్నట్లు తేలింది. ఐఎస్ఐ, బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థల ఆదేశాల మేరకు ఉగ్రవాద దాడులకు ఈ మాడ్యుల్ ప్రణాళిక రచిస్తోంది. -
T20 World Cup Semi-Final: ఫ్యాన్స్కు ఐసీసీ షాక్.. టీమిండియా సెమీఫైనల్ ముంబైలో జరగదా.?
T20 World Cup Semi-Final: 2026 టీ 20 వరల్డ్ కప్లో సూపర్-8 మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. రెండు గ్రూపుల్లో టాప్-2లో నిలిచిన నాలుగు జట్లు సెమీ-ఫైనల్స్ చేరనున్నాయి. షెడ్యూల్ ప్రకారం, భారత్ సెమీ ఫైనల్స్కు చేరితే ఈ మ్యాచ్ ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం భారత్ తన మ్యాచ్ను కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఆడే అవకాశం కూడా ఉంది. -
PM Modi: కాంగ్రెస్ ఇప్పటికే నగ్నంగా ఉంది, చొక్కాలు విప్పడం దేనికి..
PM Modi: ఏఐ సమ్మిట్లో కాంగ్రెస్ కార్యకర్తలు చొక్కాలు విప్పి నిరసన తెలపడం సంచలనంగా మారింది. అంతర్జాతీయ వేదికపై ఇలాంటి నిరసనలు చేయడాన్ని కాంగ్రెస్ మిత్రపక్షాలైన సమాజ్వాదీ వంటి పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో దూసుకొచ్చిన నెదర్లాండ్ ఆటగాళ్లు.. టాప్ 10లో ఎవరెవరంటే..
-
CJP: నా కుటుంబానికి ప్రాణహని.. సీజేపీ నేత సౌరవ్ దాస్ సంచలన ఆరోపణలు..
-
Google Top Employer: భారత్లో టాప్-10 ఎంప్లాయర్ బ్రాండ్స్ ఇవే.. గూగుల్కు నంబర్-1 ర్యాంక్
-
RGV: ఆర్జీవీకి జేడీ షాకింగ్ ప్రశ్న.. “పిచ్చోళ్లందరినీ మీరు పెట్టుకుంటారా? లేక వాళ్లే వస్తారా?”
-
JD Chakravarthy: ఆర్జీవీకి తెలియకుండా జేడీ చేసిన పని.. కోన వెంకట్కు అలా కలిసి వచ్చిందా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!