Raj Thackeray: ఠాక్రేలను కలపడానికి, బాలాసాహెబ్ చేయలేనిది ఫడ్నవీస్ చేశారు..
- మమ్మల్ని కలిపేందుకు బాలాసాహెబ్ చేయని పనిని ఫడ్నవీస్ చేశారు..
- 20 ఏళ్ల తర్వాత కలుసుకున్న ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Raj Thackeray: 20 ఏళ్లుగా శత్రువుగా ఉన్న బంధవులు ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఒకే వేదికను పంచుకుంటూ, తాము కలిసిపోయినట్లు ప్రకటించారు. శివసేన(యూబీటీ), మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన(ఎంఎన్ఎస్) అధ్యక్షుల కలయిక రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. బాల్ ఠాక్రే కూడా చేయలేని పనిని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేశారని రాజ్ ఠాక్రే అన్నారు. వివాదాస్పద త్రిభాష సూత్రంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ, మరాఠీ ప్రజలపై హిందీ రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన వీరిద్దరిని, హిందీ వ్యతిరేకత కలిపింది. ప్రాథమిక పాఠశాలల్లో హిందీని మూడో భాషగా తప్పనిసరి చేయాలనే నిర్ణయాన్ని ఫడ్నవీస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
‘ఆవాజ్ మరాఠీ చా’ (మరాఠీ స్వరం) విజయోత్సవ ర్యాలీని ఉద్దేశించి రాజ్ మాట్లాడుతూ..‘‘మహారాష్ట్ర రాజకీయాలు, పోరాటాల కన్నా గొప్పడది. నేడు 20 ఏళ్ల తర్వాత ఉద్ధవ్, నేను కలిసి వచ్చాము. మా ఇద్దరి కలిపేందుకు బాలాసాహెబ్ ఠాక్రే చేయలేనిది, దేవేంద్ర ఫడ్నవీస్ చేశారు.’’ అంటూ విమర్శలు గుప్పించారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) ఎన్నికలతో సహా ముంబై పౌర సంస్థకు జరిగే ఎన్నికల్లో తాము ఇద్దరం కలిసి పోటీ చేస్తామని, మేము కలిసి ఉండటానికి కలిసి వచ్చాము అని ఉద్ధవ్ అన్నారు.
Also Read
- IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
- Pralhad Joshi: ధర్మేంద్ర ప్రధాన్ వారసుడిగా ప్రహ్లాద్ జోషి.. కొత్త విద్యాశాఖ మంత్రిగా నియామకం
- Indai: దేశ చరిత్రలో రాజీనామాలు చేసిన కేంద్రమంత్రులు ఎవరంటే..!
- CJP Protest: అభిజిత్ హీరో.. సోనమ్ జీరోనా..? వాంగ్చుక్ను పట్టించుకోని సీజేపీ..
Read Also: Uddhav Thackeray: అవును మేము గుండాలమే, మా “గుండాయిజం” చూస్తూనే ఉంటారు..
చివరిసారిగా వీరిద్దరు 2005 ఎన్నికల సమయంలో ఒకే వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత రాజ్ ఠాక్రే శివసేన నుంచి బయటకు వచ్చి, 2006లో ఎంఎన్ఎస్ పార్టీని ప్రారంభించారు. ఇటీవల మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో, శివసేన(యూబీటీ)కి 20 సీట్లు రాగా, ఎంఎన్ఎస్ ఒక్కసీటు కూడా గెలవలేకుండా పోయింది. అయితే, హిందీని మూడో భాషగా చేస్తూ ఫడ్నవీస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై వ్యతిరేకత రావడంతో ఆ ఉత్తర్వులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో హిందీ భాష వీరిద్దరిని కలిపింది.
త్రిభాషా సూత్రంపై ముంబైని మహారాష్ట్ర నుంచి వేరు చేసే ప్రణాళిక చేస్తున్నారంటూ రాజ్ ఠాక్రే బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘నాకు హిందీ పట్ల ఎలాంటి వ్యతిరేకత లేదు, ఏ భాష కూడా చెడ్డది కాదు. వారు మాపై హిందీని రుద్దే ప్రయోగంతో ప్రారంభించారు. మనం దానిని వ్యతిరేకించకపోతే, వారు ముంబైని మహారాష్ట్ర నుండి వేరు చేసేవారు’’ అని ఆరోపించారు.
బీజేపీ నేత ఎల్కే అద్వానీ మిషనరీ పాఠశాలలో చదువుకున్నాడని, ఆయన హిందుత్వం గురించి ఎవరూ ఎలాంటి సందేహాలు లేవనెత్తలేదని చెప్పాడు. ‘‘మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో నేర్చుకున్నారని వారు అంటున్నారు. ఫడ్నవీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదివి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. నా తండ్రి శ్రీకాంత్ థాకరే, అంకుల్ బాలాసాహెబ్ థాకరే ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుకున్నారు. మరాఠీ పట్ల వారికున్న ప్రేమ గురించి ఎవరైనా ప్రశ్నించగలరా? రేపు నేను హిబ్రూ కూడా నేర్చుకుంటాను. మరాఠీ పట్ల నాకున్న గర్వం గురించి ఎవరైనా ప్రశ్నించగలరా?’’ అని రాజ్ ఠాక్రే అడిగారు.
తాజావార్తలు
-
OTR : రాజ్యసభ ఎంపీ గొల్ల బాబూరావు అసంతృప్తి? వైసీపీలో ప్రాధాన్యం లేదంటూ ఫీల్!
-
IMD Alert: దేశవ్యాప్తంగా భారీ వర్షాల హెచ్చరిక.. 3 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
-
CM Revanth Reddy : జెన్-జీ గెలిచింది.. మోడీ తలవంచారన్న రేవంత్!
-
OTR: కోమటిరెడ్డి బ్రదర్స్ కు తుంగతుర్తి ఎమ్మెల్యే సీరియస్ వార్నింగ్..! అసలు ఏం జరిగింది ?
-
OTR: జనగామ కాంగ్రెస్లో వర్గపోరు.. డీసీసీ vs నియోజకవర్గ ఇంచార్జ్ వార్!
ట్రెండింగ్
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!
-
3.2 అంగుళాల టచ్స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!