Pakistan-Russia: భారత్కు షాక్.. పాకిస్తాన్-రష్యా మధ్య కీలక ఒప్పందం..
- పాకిస్తాన్-రష్యా మధ్య కీలక ఒప్పందం..
- సెంట్రల్ ఆసియా, రష్యాలను పాక్తో అనుసంధానించేలా రోడ్డు, రైలు మార్గాలు..
- ఇటీవల ఎస్సీఓ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం..
- ఇప్పటికే పాక్ గుండా భారీ ప్రాజెక్టుని చేపట్టిన చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Russia: భారత మిత్రదేశం రష్యా, శత్రుదేశం పాకిస్తాన్ మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ని మధ్య ఆసియా దేశాల మీదుగా, రష్యాతో అనుసంధానించేలా భారీ రోడ్డు, రైలు మార్గాలు నిర్మించేందుకు రెండు దేశాలు సహకరించుకోవడానికి అంగీకరించినట్లు శుక్రవారం పాక్ మీడియా తెలిపింది. సెంట్రల్ ఆసియాలోని కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్ వంటి దేశాలను ఈ మార్గం ద్వారా అనుసంధానించనున్నారు. భూపరివేష్టిత దేశాలుగా ఉన్న మధ్య ఆసియా దేశాలకు ఓడరేవులను అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
ఇటీవల, చైనాలోని టియాంజిన్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) మంత్రివర్గ సమావేశం సందర్భంగా పాకిస్తాన్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ మంత్రి అబ్దుల్ అలీమ్ ఖాన్, రష్యా ఉప రవాణా మంత్రి ఆండ్రీ సెర్గెవిచ్ నికితిన్ మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. మధ్య ఆసియా, రష్యా మధ్య వాణిజ్యానికి వ్యూహాత్మక రవాణా కేంద్రంగా పాకిస్తాన్ మారబోతోంది. దీని ద్వారా ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణ, లాజిస్టిక్ కనెక్టివిటీ పెంచుతుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ గత నెలలో ఉజ్బెకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ (UAP) రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. ఇప్పుడు, ఈ ఒప్పందం రూపుదాల్చబోతోంది.
Also Read
- Trump China Visit: చైనా భయంతో అమెరికాకు రాగానే వాటిని చెత్తబుట్టల్లో పడేసిన ట్రంప్ సిబ్బంది.. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే!
- Pakistan: అజ్ఞాత వ్యక్తుల చేతిలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం..
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
- PM Modi: అబుదాబిలో మోడీకి ప్రత్యేక గౌరవం.. ఎఫ్-16 యుద్ధ విమానాలతో రక్షణ
Read Also: Kakinada Crime: తన చెల్లిని ప్రేమిస్తున్నాడని కోపం.. పార్టీ అని పిలిచి చంపి పాతిపెట్టిన అన్న..
ఇప్పటికే, పాకిస్తాన్-చైనా మధ్య ‘‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)’’ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఇది చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సును పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టులో కనెక్ట్ చేస్తుంది. దీంతో, పాకిస్తాన్ నుంచి నేరుగా రోడ్డు,రైలు మార్గాల ద్వారా అరేబియా సముద్రంలోకి చైనాకు మార్గం ఏర్పడుతుంది. మలక్కా జలసంధిపై ఎక్కువగా ఆధారపడకూడదని చైనా సిపెక్ ప్రాజెక్టును చేపట్టింది. ఉద్రిక్త సమయాల్లో భారత్ ఈ మార్గాన్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటడంతో చైనా భారీగా ఖర్చు చేసి సీపెక్ని నిర్మిస్తోంది.
ఈ ప్రాజెక్టుల వల్ల పాకిస్తాన్ ఆర్థికంగా ఎంతోకొంత బలపడే అవకాశం ఉంది. ఇప్పటికే, ఆర్థిక సంక్షోభంలో కూడా పాకిస్తాన్, భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. ఇప్పుడు, భారత మిత్రదేశమైన రష్యాతో పాకిస్తాన్ చెలిమి మనకు ఇబ్బందిగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్ బలపడితే అది ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత్ని ఇరుకునపెట్టే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..