Pakistan-Russia: భారత్కు షాక్.. పాకిస్తాన్-రష్యా మధ్య కీలక ఒప్పందం..
- పాకిస్తాన్-రష్యా మధ్య కీలక ఒప్పందం..
- సెంట్రల్ ఆసియా, రష్యాలను పాక్తో అనుసంధానించేలా రోడ్డు, రైలు మార్గాలు..
- ఇటీవల ఎస్సీఓ సమావేశంలో ఇరు దేశాల మధ్య ఒప్పందం..
- ఇప్పటికే పాక్ గుండా భారీ ప్రాజెక్టుని చేపట్టిన చైనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan-Russia: భారత మిత్రదేశం రష్యా, శత్రుదేశం పాకిస్తాన్ మధ్య ఒక కీలక ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. పాకిస్తాన్ని మధ్య ఆసియా దేశాల మీదుగా, రష్యాతో అనుసంధానించేలా భారీ రోడ్డు, రైలు మార్గాలు నిర్మించేందుకు రెండు దేశాలు సహకరించుకోవడానికి అంగీకరించినట్లు శుక్రవారం పాక్ మీడియా తెలిపింది. సెంట్రల్ ఆసియాలోని కజకిస్తాన్, కిర్గిజ్స్తాన్ వంటి దేశాలను ఈ మార్గం ద్వారా అనుసంధానించనున్నారు. భూపరివేష్టిత దేశాలుగా ఉన్న మధ్య ఆసియా దేశాలకు ఓడరేవులను అందించే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
ఇటీవల, చైనాలోని టియాంజిన్ లో జరిగిన షాంఘై సహకార సంస్థ (SCO) మంత్రివర్గ సమావేశం సందర్భంగా పాకిస్తాన్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ మంత్రి అబ్దుల్ అలీమ్ ఖాన్, రష్యా ఉప రవాణా మంత్రి ఆండ్రీ సెర్గెవిచ్ నికితిన్ మధ్య జరిగిన సమావేశంలో ఈ ఒప్పందం కుదిరింది. మధ్య ఆసియా, రష్యా మధ్య వాణిజ్యానికి వ్యూహాత్మక రవాణా కేంద్రంగా పాకిస్తాన్ మారబోతోంది. దీని ద్వారా ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణ, లాజిస్టిక్ కనెక్టివిటీ పెంచుతుందని భావిస్తున్నారు. పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ గత నెలలో ఉజ్బెకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ (UAP) రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి అంగీకరించాయి. ఇప్పుడు, ఈ ఒప్పందం రూపుదాల్చబోతోంది.
Also Read
- Flight Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
- 19th BRICS Summit in China: 19వ BRICS సమ్మిట్ చైనాలో.. అధ్యక్షుడు జిన్పింగ్ ప్రకటన
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
Read Also: Kakinada Crime: తన చెల్లిని ప్రేమిస్తున్నాడని కోపం.. పార్టీ అని పిలిచి చంపి పాతిపెట్టిన అన్న..
ఇప్పటికే, పాకిస్తాన్-చైనా మధ్య ‘‘చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపెక్)’’ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. ఇది చైనాలోని జిన్జియాంగ్ ప్రావిన్సును పాకిస్తాన్లోని గ్వాదర్ పోర్టులో కనెక్ట్ చేస్తుంది. దీంతో, పాకిస్తాన్ నుంచి నేరుగా రోడ్డు,రైలు మార్గాల ద్వారా అరేబియా సముద్రంలోకి చైనాకు మార్గం ఏర్పడుతుంది. మలక్కా జలసంధిపై ఎక్కువగా ఆధారపడకూడదని చైనా సిపెక్ ప్రాజెక్టును చేపట్టింది. ఉద్రిక్త సమయాల్లో భారత్ ఈ మార్గాన్ని బ్లాక్ చేసే అవకాశం ఉంటడంతో చైనా భారీగా ఖర్చు చేసి సీపెక్ని నిర్మిస్తోంది.
ఈ ప్రాజెక్టుల వల్ల పాకిస్తాన్ ఆర్థికంగా ఎంతోకొంత బలపడే అవకాశం ఉంది. ఇప్పటికే, ఆర్థిక సంక్షోభంలో కూడా పాకిస్తాన్, భారత్ పైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. ఇప్పుడు, భారత మిత్రదేశమైన రష్యాతో పాకిస్తాన్ చెలిమి మనకు ఇబ్బందిగా మారే అవకాశం కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్ బలపడితే అది ప్రత్యక్షంగా, పరోక్షంగా భారత్ని ఇరుకునపెట్టే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్పింగ్ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!