Venu Goapl Reddy
Author- NTV Telugu-
Covid 19: ఇండియాలో స్వల్పంగా పెరిగిన కోవిడ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే..
Corona cases in india: దేశంలో స్వల్పంగా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. గత రెండు రోజులతో పోలిస్తే రోజూవారీ కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 6,395 మంది మహమ్మారి బారిన పడ్దారు. ఒక్క రోజులోనే 6,614 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 33 మంది తమ ప్రాణాలను కోల్పోయారు. నిన్న ఇండియాలో కేవలం 5,379 కొత్త కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. తాజాగా కేసుల సంఖ్య 6 వేలను దాటింది. -
Super-Earths: రెండు భారీ “భూ గ్రహాల”ను గుర్తించిన ఖగోళ శాస్త్రవేత్తలు
Astronomers Discovers 2 Super-Earths: అనంత విశ్వంలో భూమిలాంటి గ్రహాలను కనుక్కునేందుకు అనేక ఏళ్లుగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. భూమి లాగే నివాసయోగ్యానికి అనుకూలంగా ఉండే గ్రహాలు, భూమి లాగే హాబిటేబుల్ జోన్ లో ఉండే గ్రహాలను గుర్తించేందకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కొన్ని ఎక్సో ప్లానెట్స్ ను ఖగోళ శాస్త్రవేత్తలు గుర్తించారు. భూమిని పోలిన భారీ భూ గ్రహాలను(సూపర్ ఎర్త్) గుర్తించారు. అయితే అవి పూర్తిగా మానవ ఆవాసానికి అనుకూలంగా లేవు. అక్కడ జీవం ఉందా..? లేదా..? అని గుర్తించలేకపోయారు. -
Corona: కోవిడ్ ప్రమాదాన్ని విటమిన్-డి తగ్గించలేదు.. తాజా అధ్యయనంలో వెల్లడి
Vitamin D supplement doesn’t reduce Covid risk: కరోనా సమయంలో పెద్దలు, పిల్లలు అంతా విటమిన్ ట్యాబ్లెట్లను విరివిగా వాడారు. ముఖ్యంగా విటమిన్-సీ, విటమిన్-డి ట్యాబ్లెట్లు అవసరం లేకున్నా తెగ మింగారు. ఈ రెండు విటమిన్లు కరోనా నుంచి తమను కాపాడుతాయని భావించి చాలా మంది వీటిని తీసుకున్నారు. అవసరం లేకున్నా ముందు జాగ్రత్తగా విటమిన్ మాత్రలను వేసుకున్నారు. దీంతో ఆ సమయంలో విటమిన్ మాత్రలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒకానొక దశలో మెడికల్ షాపుల్లో, ఆస్పత్రుల్లో విటమిన్ మాత్రలు లేని పరిస్థితి… -
Home Minister Security Breach: హోం మంత్రి భద్రతా ఉల్లంఘన.. ఆంధ్రా ఎంపీ పీఏ అరెస్ట్
Home Minister Security Breach: మహారాష్ట్రలో హోం మంత్రి అమిత్ షా పర్యటన సందర్భంగా ఆయన భద్రతలో లోపం ఏర్పడింది. ఓ వ్యక్తి హోం మంత్రి భద్రతను ఉల్లంఘించాడు. మంగళవారం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాసానికి వెళ్లారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అయితే ఆ సమయంలో అనుమానాస్పదంగా వ్యవహరించిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. హోంశాఖ అధికారిగా నటిస్తూ.. నిషేధిత ప్రాంతాల్లో తిరుగుతూ అమిత్ షా దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేసినట్లు… -
Gender Equality: లింగ సమానత్వం సాధించడానికి మరో 300 ఏళ్లు.. యూఎన్ఓ నివేదిక
Gender Equality-UN Report: ప్రపంచ వ్యాప్తంగా లింగ సమానత్వం ఇంకా సాధ్యపడటం లేదు. ప్రస్తుతం ఉన్న పురోగతి రేటు ప్రకారం పూర్తిస్థాయిలో లింగ సమానత్వం సాధించడానిక మరో 300 ఏళ్లు పడుతుందని ఐక్యరాజ్యసమితి బుధవారం విడుదల చేసిన నివేదికలో హెచ్చరించింది. ప్రస్తుతం ప్రపంచంలోని సంక్షోభాలు అసమానతలను తీవ్రం చేశాయని పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పురోగతి రేటు ప్రకారం చట్టపరమైన రక్షణలో అంతరాలను, వివక్షాపూరిత చట్టాలను తొలగించేందుకు మరో 286 ఏళ్లు పడుతుందని.. అలాగే అధికారం, నాయకత్వ స్థానాల్లో మహిళా ప్రాతినిథ్యానికి మరో 140 ఏళ్లు… -
Kartavya Path: నేడు “కర్తవ్యపథ్”ను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ..
PM Modi will inaugurate Kartavya Path: ప్రధాని నరేంద్రమోదీ నేడు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వలసపాలన గుర్తులను చెరిపివేస్తూ.. రాజ్ పథ్ పేరును ‘కర్తవ్యపథ్’గా మార్చారు. నేడు ప్రధాని మోదీ చేతుల మీదుగా కర్తవ్యపథ్ ప్రారంభం కాబోతోంది. గురువారం సాయంత్రం ప్రధాని మోదీ దీన్ని ప్రారంభించున్నారు. అక్కడే ఇండియా గేట్ సమీపంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మోదీ. -
Bharat Jodo Yatra: రెండో రోజుకు చేరిన రాహుల్ పాదయాత్ర.. అగస్తీశ్వరం నుంచి ప్రారంభం
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ ‘ భారత్ జోడో యాత్ర’ తమిళనాడు కన్యాకుమారి నుంచి బుధవారం ప్రారంభం అయింది. రాహుల్ పాదయాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్ర ప్రారంభం అవ్వనుంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. రాహుల్ గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో పాటు ఛత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వెంట నడవనున్నారు. -
Karnataka hijab row: దుస్తులు ధరించే హక్కు ఉంటే.. విప్పే హక్కు కూడా ఉందా..? సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Supreme Court on Hijab Controversy: కర్ణాటక రాష్ట్రంలో హిజాబ్ వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. పాఠశాలల్లో హిజాబ్ నిషేధిస్తూ అక్కడి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ పలువురు కర్ణాటక హైకోర్టుకు వెళ్లగా.. హైకోర్టు కూడా విద్యాసంస్థల్లో తప్పకుండా యూనిఫామ్ ధరించాల్సిందే అని స్పష్టం చేసింది. దీంతో పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. -
Heavy Rains: బీ అలర్ట్.. దక్షిణాదికి భారీ వర్ష సూచన
Heavy rain forecast for southern states: భారీ వర్షాలు దక్షిణాది రాష్ట్రాలను ముంచెత్తనున్నాయి. రానున్న రోజుల్లో అన్ని సౌత్ స్టేట్స్ లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. నాలుగు రోజుల పాటు తీవ్రమైన వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. వచ్చే ఐదు రోజుల్లో ఒడిశా, మహారాష్ట్రల్లో భారీ వానలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఇదే సమయంలో వాయువ్య రాష్ట్రాల్లో కూడా వర్షాలు నమోదు అయ్యే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. -
Antibiotics: యాంటీబయాటిక్స్ను ఎక్కువగా వాడుతున్న ఇండియన్స్.. టాప్లో అజిత్రోమైసిన్
Indians Use Antibiotics Excessively, Azithromycin On Top: దేశంలో ప్రజలు యాంటీబయాటిక్స్ను ఎక్కువగా వాడుతున్నట్లు లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది. కోవిడ్ కు ముందు, కోవిడ్ సమయంలో అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ ట్యాబ్లెట్లను విస్తృతంగా వాడినట్లు స్టడీలో వెల్లడించింది. ఎక్కువగా యాంటీబయాటిక్స్ వాడటం వల్ల శరీరం, బ్యాక్టీరియాలు యాంటీబయాటిక్స్ కు లొంగకుండా తయారవుతుందని లాన్సెట్ వెల్లడించింది.
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!