Road accident in odisha: ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఝార్సుగూడ-సంబల్ పూర్ బిజూ ఎక్స్ప్రెస్వేపై శుక్రవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఝార్సుగూడ పవర్ హౌజ్ చర్ సమీపంలో బొగ్గు లారీ, బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించారు. మరో 20 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో చాలా మంది పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Woman arrested for hijab crime.. died in iran: ఇరాన్ దేశంలో ఓ మహిళ మరణం ప్రస్తుతం ఆ దేశాన్ని కుదిపేస్తోంది. ఆడవాళ్ల దుస్తుల విషయంలో, మతాచారాలను పర్యవేక్షించే ‘ మోరాలిటీ పోలీసులు’ ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ జరిగిన తర్వాత ఆ మహిళ మరణించడంతో అక్కడ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.
Supreme Court Seeks Portal To Assist Ukraine Returned medical Students: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న దాదాపుగా 20 వేల మంది భారతదేశానికి తిరిగివచ్చారు. అయితే తాము తమ విద్యను భారత్ తో కొనసాగించే విధంగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం రోజున న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల చదువు కొనసాగించే విధంగా ప్రత్యామ్నాయ…
World could face recession next year - World Bank report: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఆర్థిక మందగమనం కనిపిస్తోంది. చాలా దేశాల ఆర్థిక పరిస్థితి చాలా వరకు క్షీణిస్తోంది. ఇప్పటికే శ్రీలంక దివాళా తీయగా.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనా వంటి దేశాల్లో కూడా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్న కేంద్ర బ్యాంకులు తమ ద్రవ్య విధానాన్ని కఠినతరం చేస్తున్నాయి.. దీంతో వచ్చే ఏడాది ప్రపంచం ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవచ్చని ప్రపంచ బ్యాంక్ నివేదికి వెల్లడించింది.…
Saudi Man Marries 53 Times In 43 Years: ఇక వ్యక్తి ఒకసారి, మహా అయితే మూడు వివాహాలు చేసుకోవడం చూస్తుంటాం. అయితే సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం ఏకంగా 53 సార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 43 ఏళ్లలో 53 సార్లు వేర్వేరు యువతులను వివాహం చేసుకున్నాడని గల్ఫ్ న్యూస్ వెల్లడించింది. అయితే అతను మాత్రం వ్యక్తిగత ఆనందం కోసం పెళ్లి చేసుకోలేదని.. వివాహబంధంలో స్థిరత్వం కోసం ఇన్ని పెళ్లిళ్లు చేసుకున్నానని చెబుతున్నారుడు. అతనికి ఓ బిరుదు కూడా ఇచ్చారు.…
PM Modi holds bilateral talks with Russian President Putin: ఉజ్జెకిస్తాన్ లో జరుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సిఓ) సమావేశంలో పాల్గొనేందుకు సమర్ కండ్ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. రష్యా, ఉక్రెయిన్ ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తో తొలిసారిగా సమావేశం అయ్యారు. ఇరు దేశాల కూడా ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది యుద్ధాల యుగం కాదని ఆయన పుతిన్ తో అన్నారు.
perseverance rover find-organic matters on mars: భూమి తర్వాత ఇతర గ్రహాలపై జీవులు ఉనికిపై దశాబ్ధాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకు 5000 పైగా ఎక్సొో ప్లానెట్లను కనుకున్నప్పటికీ.. ఇప్పటి వరకు పూర్తిస్థాయి భూమి లక్షణాలు ఉన్న గ్రహాలను మాత్రం వెలుగులోకి రాలేదు. అయితే మన సౌరవ్యవస్థలో భూమి తరువాత జీవాల నివసించేందుకు అంగారకుడిపై అనవైన వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే అనేక కృత్రిమ ఉపగ్రహాలను, రోవర్లను మార్స్ పైకి పంపారు.
Ozone Depletion: భూమిపై వాతావరణం వేగంగా మారుతోంది. పెరుగుతున్న కాలుష్యం, ఉష్ణోగ్రతల కారణంగా కాలాల్లో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మానవుల అభివృద్ధి భూమిని రక్షించే ఓజోన్ లేయర్ ను దెబ్బతీస్తోంది. ఇప్పటికే క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల ఓజోన్ లేయర్ క్షీణిస్తోంది. అయితే తాజాగా మరో మూలకం ఓజోన్ పొరను దెబ్బతీస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. అంతర్జాతీయ పరిశోధకులు బృందం ఆర్కిటిక్ ప్రాంతంలో పరిశోధన చేస్తున్న సమయంలో ఈ కొత్తగా అయోడిన్ మూలకం కూడా ఓజోన్ పొరను దెబ్బతీస్తుందని తేలింది.
Massive Fire At Skyscraper in Changsha city: చైనాలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. సెంట్రల్ చైనా నగరం చాంగ్షా శుక్రవారం అగ్ని ప్రమాదం జరిగింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికమ్యూనికేషన్ కంపెనీ చైనా టెలికాం కార్యాలయం ఉన్న 42 అంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో భవనంలోని 12కు పైగా అంతస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. అయితే వెంటనే అగ్నిమాపక అధికారులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.…
SCO Summit: ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ వేదికగా షాంఘై సహకార సంస్థ(ఎస్ సీ ఓ) శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. అయితే ప్రపంచ అగ్ర రాజ్యాలైన చైనా, ఇండియా, రష్యా దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సభ్య దేశాల మధ్య సహాయసహకరాల, వాణిజ్యం, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలు చర్చకు వచ్చాయి. అయితే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య సమావేశం ఉంటుందా..? లేదా..? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇరు నేతల మధ్య సమావేశాన్ని భారత విదేశాంగ శాఖ ఉంటుందని…