Ukraine Returned Medical Students: వైద్య విద్యార్థులకు సుప్రీంకోర్టులో ఊరట.. కేంద్రానికి కీలక ఆదేశాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court Seeks Portal To Assist Ukraine Returned medical Students: రష్యా, ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ దేశంలో వైద్యవిద్యను అభ్యసిస్తున్న దాదాపుగా 20 వేల మంది భారతదేశానికి తిరిగివచ్చారు. అయితే తాము తమ విద్యను భారత్ తో కొనసాగించే విధంగా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని పలువురు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శుక్రవారం రోజున న్యాయమూర్తులు హేమంత్ గుప్తా, సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన విద్యార్థుల చదువు కొనసాగించే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలని సుప్రీంకోర్టు కేంద్రానికి సూచించింది. వారి విద్యకు సంబంధించి విదేశీ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన వివరాలతో ఓ పోర్టల్ ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 23కు వాయిదా వేసింది.
Read Also: World Bank: వచ్చే ఏడాది ప్రపంచానికి “ఆర్థిక మాంద్యం” తప్పకపోవచ్చు.. వరల్డ్ బ్యాంక్ హెచ్చరిక
Also Read
- Nepal: నేపాల్ భారత భూభాగాలను ఆక్రమించుకుంది.. బాలెన్ షా సంచలన వ్యాఖ్యలు..
- Indian Railways: రేపటి నుంచి రైల్వే కొత్త రూల్స్.. వెయిటింగ్ టికెట్లు, అడ్వాన్స్ బుకింగ్లలో కీలక మార్పులు
- UP Encounter: సూర్య హత్య, అసద్ ఎన్కౌంటర్.. యోగి సర్కార్పై ఎస్పీ విమర్శలు..
- West Bengal: మమతకు భారీ షాక్.. 80 మందిలో 20 మంది ఎమ్మెల్యేలే హాజరు!
విద్యార్థులు నష్టపోకుండా.. కేంద్రప్రభుత్వ, విదేశీ మంత్రిత్వ శాఖ విదేశాలతో సంప్రదింపులు జరపాలని.. వైద్యవిద్యార్థులు తమ విద్యను పూర్తి చేయడానికి కేంద్రమే చర్యలు తీసుకోవాలని సూచించింది. ఉక్రెయిన్ భాష, సిలబస్ కు సరిపోయే విధంగా విద్యార్థులకు ప్రత్నామ్నాయ ఏర్పాట్లను చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు నిర్ణయంతో 20,000 మంది వైద్యవిద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. విద్యార్థులు చుట్టు పక్క దేశాలను వెతుక్కొవాల్సిన పని లేకుండా కేంద్రమే చర్యలు తీసుకుంటే మంచిదని సూచించింది. అకడమిక్ మొబిలిటీ ప్రోగ్రాం కింద ఇతర దేశాల కళాశాల్లో చేరే విధంగా అవకాశం కల్పించాలని సూచించింది. ఫీజులు, సీట్ల వివరాలు, అందుబాటులో ఉండే విధంగా పోర్టల్ ఏర్పాటు చేసిన విద్యార్థులు కావాల్సిన కాలేజ్ ఎంచుకునేలా బదిలీ ఆప్షన్ ఇవ్వాలని కేంద్రానికి సూచించింది.
అయితే ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఇండియాలో అడ్మిషన్లు కల్పించడం చట్టపరంగా సాధ్యంకాదని కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్ ఎగ్జామ్ క్లియర్ చేయకపోవడంతోనే వారంతా ఉక్రెయిన్ లో మెడిసిన్ విద్యను అభ్యసించేందుకు వెళ్లారని అఫిడవిట్ లో పేర్కొంది. దీంతో ఇండియాలో విద్యను కొనసాగించే వీలు లేదని తెలిపింది. కేంద్రం తరుపున ఈ రోజు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలను వినిపించారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఒకే ఒక్కడు.. బోలెడు రికార్డులు.. క్యూ కట్టిన అవార్డ్స్ ఇవే.!
-
Commercial LPG Price Hike: గ్యాస్ ధరల మంటలు .. భారీగా పెరిగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలు
-
RCB Champion: ఐపీఎల్ ఫైనల్లో విరాట్ కోహ్లీ విశ్వరూపం.. రెండో సారి కప్ అందుకున్న RCB..
-
Vaibhav Sooryavanshi: కోహ్లీ, గిల్, యశస్వి జైస్వాల్ను వెనక్కి నెట్టిన వైభవ్ సూర్యవంశీ.. 15 ఏళ్ల వయస్సులోనే అరుదైన రికార్డు..
-
Virat Kohli: ఆకాశమే హద్దుగా చెలరేగిన విరాట్ కోహ్లీ.. 19 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డు సాధించిన కింగ్..
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!