Mars: అంగారకుడిపై జీవ ఆనవాళ్లు కనుక్కున్న పర్సవరెన్స్ రోవర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
perseverance rover find-organic matters on mars: భూమి తర్వాత ఇతర గ్రహాలపై జీవులు ఉనికిపై దశాబ్ధాలుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. అయితే ఇప్పటివరకు 5000 పైగా ఎక్సొో ప్లానెట్లను కనుకున్నప్పటికీ.. ఇప్పటి వరకు పూర్తిస్థాయి భూమి లక్షణాలు ఉన్న గ్రహాలను మాత్రం వెలుగులోకి రాలేదు. అయితే మన సౌరవ్యవస్థలో భూమి తరువాత జీవాల నివసించేందుకు అంగారకుడిపై అనవైన వాతావరణం ఉన్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంట్లో భాగంగానే అనేక కృత్రిమ ఉపగ్రహాలను, రోవర్లను మార్స్ పైకి పంపారు.
గతేడాది ఫిబ్రవరిలో నాసా పర్సవరెన్స్ రోవర్ ని మార్స్ పైకి పంపింది. మార్స్ ఒకప్పుడు సముద్రాలు, నదులు, సరస్సులను కలిగి ఉండేదని ఇప్పటికే శాస్త్రవేత్తలు నిర్థారణకు వచ్చారు. ఇప్పటికీ అరుణ గ్రహంపైన సరస్సులు, నదీ ప్రవాహకాలకు సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. అంతకు ముందు నాసా పంపిన క్యూరియాసిటీ రోవల్, అంగారకుడిపైన గేల్ క్రేటర్ వద్ద పరిశోధనలు సాగిస్తోంది. అక్కడి నమూనాలను విశ్లేషిస్తోంది. గతేడాది పంపిన పర్సవరెన్స్ రోవర్ జెజెరో క్రేటర్ వద్ద పరిశోధనలు జరుపుతోంది.
Also Read
- Iran-Israel Tensions: మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్పై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు..
- Philippines Earthquake: ఫిలిప్పీన్స్లో 7.8 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
Read Also: SCO Summit: మోదీ, జిన్ పింగ్ మధ్య నో స్మైల్, నో షేక్ హ్యాండ్.. పక్కపక్కన ఉన్నా పట్టించుకోలేదు.
ఇదిలా ఉంటే పర్సవరెన్స్ జీవానికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించినట్లు తెలుస్తోంది. జెజెరో బిలం వద్ద రోవర్ పురాతన నది డెల్టా నుండి నాలుగు నమూనాలను సేకరించింది, ఇది పురాతన సూక్ష్మజీవుల జీవితానికి సంబంధించిన ఆనవాళ్లు కనుక్కునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో సేంద్రీయ రసాయన పదార్ధాలను పర్సవరెన్స్ రోవర్ గుర్తించింది. సేంద్రీయ అణువులు ప్రధానంగా కార్బన్తో తయారు చేయబడిన అనేక రకాల సమ్మేళనాలను కలిగి ఉన్నాయని.. సాధారణంగా హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
మార్స్ పై ఉన్న జెజిరో క్రేటర్ వద్ద ఇసుకరాయి, రాతి శిలలు, బురద రాయిపై పర్సవరెన్స్ పరిశోధనలు చేస్తోంంది. ఇందులో సేంద్రీయ రసాయన పదార్థాలు ఉన్నట్లు నాసా శాస్త్రవేత్త కెన్ ఫార్లే వెల్లడించారు. అయితే ఇది మాత్రమే జీవాల ఉనికికి సంబంధించిన స్పష్టతను పూర్తిగా ఇవ్వలేదని.. ఈ నమూనాలను భూమిపైకి తీసుకువచ్చినప్పుడు మాత్రమే అధ్యయనం చేయవచ్చని.. ఆ తరువాతే ఓ అంచనాకు రావచ్చని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
-
SIP Rules: SIP చేస్తున్నవారిలో చాలామంది పట్టించుకోని కీలక విషయాలు.. దీర్ఘకాలంలో భారీ ప్రభావం!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
ట్రెండింగ్
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.