PM Narendra Modi: ఇది యుద్ధానికి సమయం కాదు మిత్రమా.. పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi holds bilateral talks with Russian President Putin: ఉజ్జెకిస్తాన్ లో జరుతున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సిఓ) సమావేశంలో పాల్గొనేందుకు సమర్ కండ్ వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. రష్యా, ఉక్రెయిన్ ప్రారంభం అయినప్పటి నుంచి రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ తో తొలిసారిగా సమావేశం అయ్యారు. ఇరు దేశాల కూడా ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుకున్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది యుద్ధాల యుగం కాదని ఆయన పుతిన్ తో అన్నారు. ప్రస్తుతం యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఆహారం, ఎరువులు, ఇంధన సంక్షోభాన్ని పెంచిందని పుతిన్ తో అన్నారు. ఇది యుద్ధానికి సమయం కాదని పుతిన్ తో మోదీ వ్యాఖ్యానించారు. ఇది వరకు ఈ విషయం గురించి మీతో ఫోన్లో మాట్లాడానని గుర్తు చేశారు. ఈ సమావేశానికి ముందు టర్కీ అధ్యక్షుడు తయ్యప్ ఎర్డోగన్ తో ప్రధాని మోదీ సమావేశం అయ్యారు. ఇండియా-టర్కీ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా పెంచుకునే అంశాలపై ఇరు దేశాల నేతలు చర్చించారు.
Read Also: Mars: అంగారకుడిపై జీవ ఆనవాళ్లు కనుక్కున్న పర్సవరెన్స్ రోవర్
Also Read
- PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
- Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
- CM YOGI: ‘‘రోడ్లున్నది నమాజ్ చేయడానికి కాదు’’.. యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
- Lakshadweep: ప్రధాని మోడీ "కుర్చీ మడత పెడితే" ఎలా ఉంటుందో తెలుసా.. లక్షదీవులే సాక్ష్యం..
భారత్-రష్యా దశాబ్ధాలుగా ఒకరితో ఒకరు ఉన్నారని.. ఆహారం, ఇంధనం, భద్రత, ఎరువుల సమస్యలను పరిష్కరించడానికి మార్గాలను కనుక్కోవాలని ఇరు దేశాధినేతలు భావించారు. ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను తరలించడానికి రష్యా, ఉక్రెయిన్ దేశాలు సహకరించాయని.. అందుకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నానని మోదీ, పుతిన్ తో అన్నారు. ఉక్రెయిన్-రష్యా సంఘర్షణ గురించి నాకు తెలుసని.. వీటన్నింటిని త్వరలో ముగించాలని కోరుకుంటున్నట్లు.. అక్కడ ఏం జరుగుతుందో మీకు తెలియజేస్తామని ప్రధాని మోదీతో రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు.
వచ్చే ఏడాది 2023లో ఎస్సిఓకు భారత్ నాయకత్వం వహించబోతోంది. వచ్చే ఏడాది ఈ సంస్థ శిఖరాగ్ర సమావేశాలు ఇండియాలో జరగనున్నాయి. షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ చైనా, రష్యా, భారత్, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్ స్తాన్, తుర్కమెనిస్తాన్, కజకిస్తాన్ సభ్య దేశాలుగా ఉన్నాయి. వీటిలో పాటు నాలుగు పరిశీలహోదా దేశాలుగా ఆఫ్ఘనిస్తాన్, బెలారస్, మంగోలియా, ఇరాన్ దేశాలు ఉన్నాయి. ఆరు దేశాలు ఆర్మేనియా, అజర్ బైజాన్, టర్కీ, కంబోడియా, శ్రీలంక, నేపాల్ దేశాలు డైలాగ్ పార్ట్నర్స్ గా ఉన్నాయి.
తాజావార్తలు
-
IPL: ‘నన్ను అస్సలు పట్టించుకోలేదు’.. కేకేఆర్పై బంగ్లాదేశ్ స్టార్ లిటన్ దాస్ సంచలన వ్యాఖ్యలు..
-
Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
-
Pakistan-Saudi Arabia: సౌదీ అరేబియా రక్షణకు పాకిస్తాన్ కిరాయి సైన్యం..
-
PM Modi: నార్వే ప్రధానితో మోడీ భేటీ.. ఇరు దేశాల సంబంధాలపై చర్చ
-
Viral Video: మూగజీవాల చెంతన మిగిలిన గుండెకోత.. ఏనుగుల కొట్లాటలో ప్రాణాలు కోల్పోయిన మహిళ..
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!