Iran: ఇరాన్ను కుదిపేస్తున్న మహిళ మరణం.. హిజాబ్ వేసుకోలేదని అరెస్ట్.. తరువాత మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman arrested for hijab crime.. died in iran: ఇరాన్ దేశంలో ఓ మహిళ మరణం ప్రస్తుతం ఆ దేశాన్ని కుదిపేస్తోంది. ఆడవాళ్ల దుస్తుల విషయంలో, మతాచారాలను పర్యవేక్షించే ‘ మోరాలిటీ పోలీసులు’ ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ జరిగిన తర్వాత ఆ మహిళ మరణించడంతో అక్కడ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ.. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని టెహ్రాన్ లో ఈ సంఘటన జరిగింది. అరెస్ట్ తరువాత మహిళ కోమాలోకి వెళ్లి శుక్రవారం మరణించింది. దీనిపై అంతర్జాతీయంగా పలు హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: Andhra Pradesh Crime: బ్లేడుతో ప్రియుడి మర్మాంగం కోసేసిన ప్రియురాలు.. ఎందుకంత కసి..?
Also Read
- Oil Exports: కొత్తగా పైప్లైన్లు, పోర్టు.. హార్ముజ్ బైపాస్కు గల్ఫ్ దేశాల మాస్టర్ ప్లాన్
- US-Iran War: 'ట్రంప్ను చంపేస్తాం'.. శవపేటికలో అమెరికా అధ్యక్షుడు..ఇరాన్ ప్రచారం..
- Earthquake: న్యూజిలాండ్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ
- JD Vance-Iran: జేడీ వాన్స్కు ఇరాన్ రహస్య హెచ్చరిక? అంతర్జాతీయంగా తీవ్ర కలకలం
రాజధాని టెహ్రాన్ లో మహ్సా అమిని తన కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు.. ఆ దేశంలో మహిళల డ్రెస్ కోడ్ పర్యవేక్షించే పోలీసులు ఆమెను హిజాబ్ ధరించలేదని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె కొమాలోకి వెళ్లింది.. శుక్రవారం మరణించింది. యువతి మరణానికి న్యాయం చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి తరలించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే ఆమెను పోలీస్ స్టేషన్ నుంచి ఆస్పత్రికి తీసుకువచ్చే సమయంలో ఏం జరిగిందో తెలియదనేది తెలియరావడం లేదు. సోషల్ మీడియాలో ఈ వార్త హైలెట్ కావడంతో ఆస్పత్రి ముందు పెద్ద ఎత్తున ప్రజలు చేరారు. వీరందరిని పోలీసులు చెదరగొట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. న్యాయం కావాలని డిమాండ్ చేశారు.
మహ్సా అమినీ అనుమానాస్పద మరణంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఏకపక్షంగా పోలీసులు యువతిని అరెస్ట్ చేసి ఆమె మరణానికి కారణం అయ్యారని ఆరోపించింది. ఇరాన్ లోని యూఎస్ రాయబారి రాబర్ట్ మాల్లీ కూడా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఆమె తలపై గాయాలు ఉన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అమినీ కేసుపై విచారణ ప్రారంభించాలని అంతర్గత మంత్రిని ఆదేశించారు. ఇటీవల కాలంలో ఇరాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువ అవుతున్నాయని పలు అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!