Iran: ఇరాన్ను కుదిపేస్తున్న మహిళ మరణం.. హిజాబ్ వేసుకోలేదని అరెస్ట్.. తరువాత మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman arrested for hijab crime.. died in iran: ఇరాన్ దేశంలో ఓ మహిళ మరణం ప్రస్తుతం ఆ దేశాన్ని కుదిపేస్తోంది. ఆడవాళ్ల దుస్తుల విషయంలో, మతాచారాలను పర్యవేక్షించే ‘ మోరాలిటీ పోలీసులు’ ఆమెను అరెస్ట్ చేశారు. అరెస్ట్ జరిగిన తర్వాత ఆ మహిళ మరణించడంతో అక్కడ ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. హిజాబ్ ధరించలేదని ఆరోపిస్తూ.. మహ్సా అమిని అనే 22 ఏళ్ల యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాజధాని టెహ్రాన్ లో ఈ సంఘటన జరిగింది. అరెస్ట్ తరువాత మహిళ కోమాలోకి వెళ్లి శుక్రవారం మరణించింది. దీనిపై అంతర్జాతీయంగా పలు హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Read Also: Andhra Pradesh Crime: బ్లేడుతో ప్రియుడి మర్మాంగం కోసేసిన ప్రియురాలు.. ఎందుకంత కసి..?
Also Read
- Pakistan: పాకిస్థాన్ సైన్యాన్ని వణికించిన ఉగ్రవాదులు.. సైనిక స్థావరంపై ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి!
- Donald Trump: “అమెరికా క్షీణించింది 100% నిజమే”.. జిన్పింగ్ వ్యాఖ్యలపై ట్రంప్ సంచలన పోస్ట్..!
- UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
- Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
రాజధాని టెహ్రాన్ లో మహ్సా అమిని తన కుటుంబ సభ్యులతో ఉన్నప్పుడు.. ఆ దేశంలో మహిళల డ్రెస్ కోడ్ పర్యవేక్షించే పోలీసులు ఆమెను హిజాబ్ ధరించలేదని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆమె కొమాలోకి వెళ్లింది.. శుక్రవారం మరణించింది. యువతి మరణానికి న్యాయం చేయాలని ప్రజలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని మెడికల్ ఎగ్జామినర్ కార్యాలయానికి తరలించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అయితే ఆమెను పోలీస్ స్టేషన్ నుంచి ఆస్పత్రికి తీసుకువచ్చే సమయంలో ఏం జరిగిందో తెలియదనేది తెలియరావడం లేదు. సోషల్ మీడియాలో ఈ వార్త హైలెట్ కావడంతో ఆస్పత్రి ముందు పెద్ద ఎత్తున ప్రజలు చేరారు. వీరందరిని పోలీసులు చెదరగొట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. న్యాయం కావాలని డిమాండ్ చేశారు.
మహ్సా అమినీ అనుమానాస్పద మరణంపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఏకపక్షంగా పోలీసులు యువతిని అరెస్ట్ చేసి ఆమె మరణానికి కారణం అయ్యారని ఆరోపించింది. ఇరాన్ లోని యూఎస్ రాయబారి రాబర్ట్ మాల్లీ కూడా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అయితే ఆమె తలపై గాయాలు ఉన్నట్లు అక్కడి మీడియా వెల్లడించింది. ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అమినీ కేసుపై విచారణ ప్రారంభించాలని అంతర్గత మంత్రిని ఆదేశించారు. ఇటీవల కాలంలో ఇరాన్ లో మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కువ అవుతున్నాయని పలు అంతర్జాతీయ హక్కుల సంస్థలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నాయి.
తాజావార్తలు
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
PBKS Captain Shreyas Iyer: చాలా బాధగా ఉంది.. మా విజయాన్ని ఆ ‘ఒక్కడు’ లాగేసుకున్నాడు!
-
Google Free Storage: గూగుల్ షాకింగ్ డెసిషన్.. ఫ్రీ స్టోరేజ్లో భారీ మార్పు.. కొత్త అకౌంట్లకు 5GB మాత్రమే!
-
Kerala: “ఇక కేరళలో చట్టాలను నిర్ణయించేది మేమే”.. ఊరేగింపులో రెచ్చిపోయిన ముస్లిం లీగ్ నేతలు..
-
RRB ALP Recruitment 2026: 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్.. ఈ అర్హతలుండాలి
ట్రెండింగ్
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!