SCO Summit: మోదీ, జిన్ పింగ్ మధ్య నో స్మైల్, నో షేక్ హ్యాండ్.. పక్కపక్కన ఉన్నా పట్టించుకోలేదు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SCO Summit: ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్ వేదికగా షాంఘై సహకార సంస్థ(ఎస్ సీ ఓ) శిఖరాగ్ర సమావేశం జరుగుతోంది. అయితే ప్రపంచ అగ్ర రాజ్యాలైన చైనా, ఇండియా, రష్యా దేశాధినేతలు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. సభ్య దేశాల మధ్య సహాయసహకరాల, వాణిజ్యం, ఉగ్రవాద నిర్మూలన వంటి అంశాలు చర్చకు రానున్నాయి. అయితే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య సమావేశం ఉంటుందా..? లేదా..? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఇరు నేతల మధ్య సమావేశం ఉంటుందని కానీ..ఉండదని కానీ భారత విదేశాంగ శాఖ ఏది చెప్పలేదు. రష్యా అధ్యక్షుడు పుతిన్ తో మాత్రం ప్రధాని నరేంద్రమోదీ సమావేశం ఉండనుంది.
అయితే 2020లో గాల్వాన్ ఘర్షణ తర్వాత తొలిసారిగా భారత్, చైనా దేశాలు ఒకే వేదికను పంచుకుంటున్నాయి. అయితే వీరిద్దరి మధ్య సమావేశంపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో మాత్రం ఇరు నేతలు దూరం దూరంగా ఉంటున్నారు. ప్రధాని మోదీ గురువారం సాయంత్రం డిన్న మీటింగ్ కు దూరమయ్యారు. శుక్రవారం ఉదయం సమర్ కండ్ చేరుకున్నారు. అయితే ఫోటో- ఆప్ సమయంలో ఇరు నేతలు పక్కపక్కనే ఉన్నా కూడా పెద్దగా మాట్లాడుకోలేదు. కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ.. చిరునవ్వులతో పలకరించుకోవడం కానీ చేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, పాకిస్తాన్ పీఎం షహజాబ్ షరీఫ్ తో పాటు టర్కీ, కజకిస్తాన్, తర్క్ మెనిస్తాన్, కిర్గజ్ స్తాన్ మొదలగు దేశాల నేతలు హాజరయ్యారు.
Also Read
- Middle East Tensions: మిడిల్ ఈస్ట్లో మరో భీకర యుద్ధానికి స్క్రిప్ట్.. ఇజ్రాయెల్ లక్ష్యంగా ఇరాన్ ‘షాడో వార్’!
- Giorgia Meloni: మెలోని ఢిల్లీలో పోటీ చేస్తే లక్షల ఓట్లు గ్యారెంటీ..
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Pakistan: సైనికుల జీతాలు 25% పెంచిన పాక్.. సిందూర్ దెబ్బకు పరిహారమా?
Read Also: Gautham Vasudev Menon: చైతన్య- సమంతను మళ్లీ కలుపుతాడట..?
అయితే వచ్చే ఏడాది భారత్ లో జరిగే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశానికి చైనా మద్దతు ఇస్తుందని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. 2020లో లడఖ్ స్టాండప్ తరువాత చైనా, ఇండియా దేశాధినేతలు కలుసుకోవడం ఇదే మొదటిసారి. ప్రధాని మోదీ, పుతిన్ తో సమావేశం కానున్నారు. వీరి మధ్య వాణిజ్యం, రష్యా నుంచి ఎరువుల దిగుమతి, ఆహార సరఫరా వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. దీంతో పాటు ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోవ్, ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.
కోవిడ్19 మహమ్మారి, ఉక్రెయిన్ యుద్దం కారణంగా ఆహారం, ఇంధన కొరతను అధిగమించేందుకు ప్రాంతీయంగా మెరుగైన కెన్టివిటీపై దృష్టిపెట్టాలని భారత ప్రధాని మోదీ ప్రసంగించారు. భారతదేశాన్ని తయారీ కేంద్రంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని.. ప్రతీ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తున్నామని.. దేశంలో 70 వేలక కన్నా ఎక్కువ స్టార్టప్స్, 100 యునికార్న్లు ఉన్నాయి అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
-
Oppo Reno 16 Series: ఒప్పో రెనో 16 సిరీస్ రిలీజ్.. 7000mAh బ్యాటరీ, 50MP కెమెరా, కొత్త మ్యాగ్నెటిక్ డిస్ప్లే
-
Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
-
Bank Fraud: భారీ బ్యాంకు మోసం.. రూ.3.66 కోట్ల ఇన్సూరెన్స్ పాలసీలను అటాచ్ చేసిన ఈడీ.!
-
Samantha: సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!