Mamata Banerjee: శ్రీరామ నవమిని జరుపుకోండి.. కానీ ముస్లిం ఏరియాలకు దూరంగా ఉండండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీరామ నవమిని జరుపుకునే భక్తులు దయచేసి ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు. రామ నవమి ఊరేగింపులను శాంతియుతంగా జరుపుకోవాలని ఆమె అభ్యర్థించారు. రంజాన్ జరుగుతున్నందున ముస్లిం ప్రాంతాలకు దూరంగా ఉండాలని, శాంతియుతంగా పండగ జరుపుకోవాలని, హింసను సృష్టించవద్దని కోరారు. ఊరేగింపుల్లో కత్తుల, చాకులతో వస్తామని కొందరు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని, అయితే ఇది క్రిమినల్ నేరం అని మర్చిపోవద్దని, కోర్టులు మిమ్మల్ని విడిచిపెట్టవని హెచ్చరించారు.
Read Also: Rahul Gandhi: రాహుల్ గాంధీపై జర్మనీ వ్యాఖ్యలు.. కాంగ్రెస్పై కేంద్రమంత్రుల విమర్శలు..
Also Read
- Terror Modules: జంతర్ మంతర్ నిరసనల్లో టెర్రరిస్ట్లు.. 9 మంది పాకిస్థాన్ ఐఎస్ఐ ఉగ్రవాదులు అరెస్ట్
- Udhayanidhi Stalin: తంబీ..ఇంతలా దిగజారాలా? ఉదయనిధి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడా..?
- Liquor Ban: ఏంటి! ఇన్ని రోజులు "బ్రాండెడ్ విషం" తాగారా? ఓల్డ్ మాంక్, రాయల్ ఛాలెంజ్ సహా ఈ బ్రాండ్ల గుట్టు రట్టు..
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
కేంద్రంలోని బీజేపీ సర్కార్ కు వ్యతిరేకంగా త్రుణమూల్ కాంగ్రెస్ నిర్వహిస్తున్న రెండు రోజుల ధర్నాలో మమతా బెనర్జీ పాల్గొన్నారు. బీజేపీ సమాఖ్య వ్యవస్థను నాశనం చేస్తోందని విమర్శించారు. బీజేపీయేతర రాష్ట్రాలను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. మన జీఎస్టీ సొమ్మును దోచుకుంటున్నారని, 100 రోజుల కూలీ డబ్బును ఆపేస్తున్నారని, వారు మమ్మల్ని దేశవ్యతిరేకులు అంటున్నారని, వారికి మాత్రమే దేశభక్తి ఉందని, వారే జాతీయవాదులని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
2002 గుజరాత్ అల్లర్లను ప్రస్తావిస్తూ.. బీజేపీ పార్టీ ‘ఫ్యూడల్ ల్యాండ్ లార్డ్’గా ప్రవర్తిస్తుందని విమర్శించారు. బెంగాల్ లో మారణహోమం జరుగుతుందని బీజేపీ ఆరోపిస్తోందని, అయితే నిజమైన మరణహోమం గోద్రాలో, బిల్కిస్ బానో విషయంలో, ఢిల్లీలో జరిగిందని ఆరోపించారు. కేంద్ర సంస్థల ద్వారా ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేయడాన్ని దీదీ తప్పుపట్టారు. బీజేపీకి ఎవరైనా ఎదురుమాట్లాడితే ఈడీ, సీబీఐని పంపుతున్నారని విమర్శించారు. బీజేపీని దుర్యోధనుడు, దుశ్శాసనుడితో పోల్చింది. బీజేపీని గద్దె దించడానికి ప్రతిపక్ష పార్టీలు ఏకం కావాలని కోరారు.
తాజావార్తలు
-
Ramayana: ‘రామాయణం’ ట్రైలర్లో హనుమంతుడు ఎందుకు కనిపించలేదు?.. క్లారిటీ ఇచ్చిన రణబీర్ కపూర్!
-
IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
ఏఐ, ఐటీ కోర్సులకు ఫుల్ డిమాండ్.. TG EAPCET 2026 ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి..
-
Dhsnudh-Sivakarthikeyan : ధనుష్, శివకార్తికేయన్ సీక్వెల్స్ సినిమాలపై కోలీవుడ్లో భారీ హైప్
ట్రెండింగ్
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!