Howrah Ram Navami clashes: హౌరా రామనవమి ఊరేగింపులో అల్లర్లు.. టీఎంసీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Howrah Ram Navami clashes: అనుకన్నట్లుగానే దేశంలోని పలు ప్రాంతాల్లో రామనవమి ఊరేగింపు సమయంలో అల్లర్లు జరిగాయి. గుజరాత్ వడోదరా, మహరాష్ట్ర ఔరంగాబాద్, బెంగాల్ హౌరాల్లో ఇరు వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ముఖ్యంగా హౌరాలో ఈ అల్లర్లు హింసాత్మకంగా మారాయి. ఆందోళనకారులు పలు వాహానాలకు నిప్పుపెట్టారు. ఇదిలా ఉంటే ఈ అల్లర్లు అధికార త్రుణమూల్ కాంగ్రెస్(టీఎంసీ), బీజేపీల మధ్య తీవ్ర రాజకీయ వివాదంగా మారింది.
Read Also: Shreya Dhanwanthary: తెలంగాణ పిల్ల.. హద్దుదాటి.. షర్ట్ బటన్స్ విప్పి.. దేవుడా
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
కావాలనే బీజేపీ అల్లర్లను సృష్టిస్తోందని సీఎం మమతా బెనర్జీ ఆరోపించగా.. హిందువుల మనోభావాలను విస్మరిస్తున్నారంటూ బీజేపీ విమర్శించింది. అల్లర్లు, కుట్రలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని దీదీ వెల్లడించారు. సున్నితమైన ప్రాంతాల్లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇచ్చినవారికి అల్లర్లకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని మమతా బెనర్జీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. రామ నమవి ఊరేగింపుల్లో కత్తులు తీయదానికి మీరు ఎవరు అధికారం, అనుమతి ఇచ్చారు..? హౌరా ర్యాలీలో బుల్డోజర్లు ఉపయోగించారని ఎంత ధైర్యమని ప్రశ్నించారు.
ముస్లింల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లోకి ఊరేగింపు వెల్లడంపై మమతా బెనర్జీ హెచ్చరించారు. ముస్లింలకు రంజాన్ మాసమని, ఏదైనా జరిగితే హింస చెలరేగుతుందని ముందే హెచ్చరించారు. బెంగాల్ లో హింస కాల్పులపై బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా స్పందించారు. హిందువుల మనోభావాలను విస్మరిస్తూ మమతా బెనర్జీ శ్రీరామ నవమి రోజు ధర్నా చేశారని.. ముస్లిం ప్రాబల్య ప్రాంతాలకు దూరంగా ఉండాలని హిందువులను హెచ్చరించారని, ఆమె హిందువులను మరిచిపోయిందని అన్నారు. బెంగాల్ హోంమంత్రి హౌరా హింసకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. గతేడాది కూడా ఇలాగే అల్లర్లు చెలరేగాయని, ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని బెంగాల్ ప్రతిపక్ష నేత సువేంధు అధికారి విమర్శించారు.
తాజావార్తలు
-
Eng vs NZ: లార్డ్స్ టెస్టులో బౌలర్ల హవా.. తొలి రోజే 16 వికెట్లు డౌన్.. అసలేమవుతోంది.?
-
Vladimir Putin: “మోడీపై ఒత్తిడి తేవడం ఎవరి తరం కాదు”.. భారత్కు రష్యా అధ్యక్షుడు పుతిన్ గట్టి మద్దతు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!