AAP: మోదీ నిరక్షరాస్యుడు.. భారత్ కు చదువుకున్న ప్రధాని కావాలి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aam Aadmi Party: ప్రధాని నరేంద్రమోదీని టార్గెట్ చేస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలు గుప్పిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆప్ వర్సెస్ బీజేపీగా రాజకీయ పోరాటం కొనసాగుతోంది. ద్వేషాన్ని ఆపడానికి, విధానాలు రూపొందించడానికి, ఈ దేశ వ్యవస్థాపకుల కలలను సాకారం చేయడానికి భారతదేశానికి విద్యావంతులైన ప్రధాని అవసరమని ఆప్ ఈ రోజు శ్రీనగర్ లో వ్యాఖ్యానించింది. ‘‘మోదీ హఠావో – దేశ్ బచావో’’ప్రచారాన్ని ప్రారంభించింది ఆప్. ఆ పార్టీ మీడియా కోఆర్డినేటర్ కమిటీ చైర్మన్ నవాబ్ నాసిర్ అమన్ మాట్లాడుతూ.. నిరక్షరాస్యుడు దేశాన్ని నడపలేదని అన్నాడు.
Read Also: Harish Rao : బీజేపీ పాలనలో అచ్చే దిన్ కాదు.. సామాన్యుడు సచ్చే దిన్
Also Read
- Jantar Mantar Protest: జంతర్ మంతర్ వద్ద మరో నిరసన.. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వేలాది మంది..
- Drugs Control Department: “UP TO 60%/70%/80% DISCOUNT” బోర్డులు.. ఫార్మసీలకు డ్రగ్స్ కంట్రోల్ సీరియస్ వార్నింగ్
- Rahul Gandhi: పెల్లెట్ గన్ ఘటనపై రాహుల్ గాంధీ ధర్నా.. ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదు
- Maharashtra: కొడుకును కాపాడే ప్రయత్నం విషాదాంతం.. తల్లిదండ్రులు సహా ముగ్గురూ మృతి
ప్రధాని నరేంద్రమోది నిరక్షరాస్యుడు అని, ఈ దేశానికి విద్యావంతులు ప్రధానిగా ఉండాలని, దేశంలో ద్వేషాన్ని అరికట్టాలని అన్నాడు. పార్టీ విమర్శలను ఎదుర్కొంటోందని, తమను జైళ్లకు కూడా పంపవచ్చని, కానీ నిజాలు చెప్పడం ఆపేయం అని అమన్ అన్నాడు. దేశాన్ని రక్షించాలంటే సర్దార్ వల్లభాయ్ పటేల్, మహత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ కలలను సాకారం చేయాంటే నరేంద్రమోదీని గద్దె దించాలని ప్రజలకు సూచించారు. ప్రధాని మోదీ కోర్టులను, ఈడీ, ఎన్నికల కమిషన్ వంటి కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ విమర్శించారు. మనం స్వాతంత్య్రం కోసం కొత్త పోరాటం చేయాలని ఆప్ పేర్కొంది.
ప్రతీ ముస్లిం, హిందువు, సిక్కు మంచి విద్య, వైద్యం, శాంతిని పొందాలని కోరుకుంటున్నారని, కానీ నేడు ఈ ప్రభుత్వం బీజేపేతర పార్టీలను ముఖ్యమంత్రులకు ఈడీ సమన్లు జారీ చేస్తుందని, ప్రతిపక్షాలపై దాడులు చేస్తుందని, కానీ వారు బీజేపీలో చేరినప్పుడు మాత్రం ఎలాంటి ఆరోపణలు ఉండవని ఆప్ నేత విమర్శించారు. ప్రభుత్వం కేవలం కొందరు వ్యాపారుల కోసమే పనిచేస్తుందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్ లో పరిస్థితులు అన్నీ బాగానే ఉంటే ఎందుకు ఎన్నికలు నిర్వహించడం లేదని ప్రశ్నించారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!