Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
E20 పెట్రోల్ గురించి సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కీలక ప్రకటన చేశారు. 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ మాత్రమే కావాలనుకునే వారు, ఎక్కువ ధర చెల్లించి దానిని కొనుగోలు చేయవచ్చని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని అన్ని పెట్రోల్ బంకుల్లో E20 ఇంధనం అందుబాటులోకి వచ్చిన తర్వాత వేరే ప్రత్యామ్నాయాలు సాధ్యం కాదని, అయితే ఇథనాల్ లేని పెట్రోల్ కోరుకునే వారి కోసం ప్రీమియం ధరలో అది లభిస్తుందని చెప్పారు. ఇథనాల్ కలపడం వల్ల వాహనాలు పాడవుతాయనే వార్తల్లో నిజం లేదని, ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు రాలేదని ఆయన స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో వస్తున్న పుకార్ల వల్ల వాహనదారుల్లో ఉన్న ఆందోళనలను తొలగించడానికి ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఇంధన నాణ్యత తనిఖీలను మరింత ముమ్మరం చేశాయి. ఇంధన నాణ్యతపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే నేరుగా బంకుల్లో లేదా కస్టమర్ కేర్లో నమోదు చేయాలని, సోషల్ మీడియా పోస్టులను నమ్మవద్దని చమురు సంస్థలు కోరాయి.
Also Read
- David Warner: "అలా చేయడానికి వీల్లేదు".. స్మిత్ చేసిన పనికి డేవిడ్ వార్నర్ తీవ్ర ఆగ్రహం
- Rishabh Pant: 98 సిక్సర్లు.. ఇక 100పై కన్ను! చరిత్రకు అడుగు దూరంలో రిషభ్ పంత్
- OTR: కోదండరాంకు యువత సెగ..! నాడు నమ్మినవాళ్లే ఇప్పుడు నిలదీస్తున్నారా..?
- Nitin Nabin: నితిన్ నబీన్ ఏపీ పర్యటన ఖరారు.. ఆగస్టు 17 నుంచి 21 వరకు..
మరోవైపు.. ఐఐటీ కాన్పూర్ పరిశోధకులు కూడా E20 ఇంధనంపై కీలక విషయాలను వెల్లడించారు. E20 పెట్రోల్ వల్ల వాహనాల ఇంజన్లకు ఎలాంటి నష్టం వాటిల్లదని, తుప్పు పట్టడం లేదా ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తుతాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని ఐఐటీ కాన్పూర్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన పరిశోధకుడు ధృవ రాజ్ కర్ణా స్పష్టం చేశారు. విస్తృత పరిశోధనల తర్వాతే ఈ విషయాన్ని నిర్ధారించినట్లు ఆయన తెలిపారు.
అలాగే.. చాలా మంది భయపడుతున్నట్లుగా E20 పెట్రోల్ వల్ల వాహనాల మైలేజీలో ఎలాంటి పెద్ద మార్పులు లేదా తగ్గుదల కనిపించలేదని పేర్కొన్నారు. నిజానికి మైలేజీ అనేది ఇంధనం కంటే కూడా వాహనం నడిపే విధానం, రోడ్ల పరిస్థితి, వాహనం యొక్క సకాలంలో మెయింటెనెన్స్ (రహదారి రక్షణ)పైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని వివరించారు. ఇప్పటివరకు జరిపిన అన్ని పరీక్షల్లో ఇంజన్ మన్నికపై గానీ, వాహన వేగంపై గానీ E20 ఇంధనం వల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని పరిశోధకులు తేల్చి చెప్పారు. కాబట్టి వాహనదారులు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని స్పష్టమవుతోంది.
తాజావార్తలు
-
Vivo Y6k: వివో Y6k త్వరలో లాంచ్?.. Google Play Console లిస్టింగ్లో కీలక వివరాలు
-
Sunday Rasi Phalalu: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బు రాక మొదలు!
-
Samantha New Show: సెలబ్రిటీ మాస్టర్చెఫ్ తమిళ్కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి
-
David Warner: “అలా చేయడానికి వీల్లేదు”.. స్మిత్ చేసిన పనికి డేవిడ్ వార్నర్ తీవ్ర ఆగ్రహం
-
Sankranti 2027 Box Office Clash : 2027 సంక్రాంతి పోరు బాక్సాఫీస్ వద్ద భారీ మల్టీస్టారర్లు, క్రేజీ కాంబినేషన్ల మోత
ట్రెండింగ్
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్రేంజ్లో బెస్ట్ స్మార్ట్ఫోన్ ఏది.?
-
డిజైన్, ఫీచర్లలో భారీ అప్డేట్స్ తో సెప్టెంబర్ 5న రాబోతున్న Maruti Baleno Facelift..!
-
కొత్త పికప్ ట్రక్ Mahindra Scorpio Lifestyler వచ్చేస్తోంది.. ధర, ఫీచర్లు ఇవే!