Pakistan: బైడెన్ వ్యాఖ్యలపై యూఎస్ రాయబారికి సమన్లు.. భారత్పై కామెంట్స్
Pakistan summons US envoy over Joe Biden’s comments: పాకిస్తాన్ దేశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలపై సమన్వయం లేని కారణంగా పాకిస్తాన్ ప్రపంచంలోనే ప్రమాదకర దేశాల్లో ఒకటి అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ దేశాన్ని షాక్ కు గురిచేశాయి. అమెరికాతో ఇప్పుడిప్పుడే సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నామని అనుకుంటున్న పాకిస్తాన్ కు ఇది మింగుడు పడటం లేదు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ తమ నిరసన తెలుపుతోంది.
పాకిస్తాన్ లోని అమెరికా రాయబారిని పిలిచింది పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్ధారీ దీనిపై మాట్లాడుతూ.. జో బైడెన్ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని అన్నారు. ఇస్లామాబాద్ లోని యూఎస్ రాయబారి డొనాల్డ్ బ్లోమ్ కు సమన్లు జారీ చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ తన సమగ్రత, భద్రతపై కఠినంగా ఉందని.. ప్రశ్నలు లేవనెత్తాలంటే అవి భారతదేశం అణ్వాయుధాలపై ఉండాలని బిలావల్ బుట్టో అన్నారు. పాకిస్తాన్-అమెరికా మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతోనే అపార్థం చేసుకున్నట్లు ఉన్నారని ఆయన అన్నారు.
Also Read
- Mojtaba Khamenei: "సముద్ర గర్భంలో పాతిపెడతాం".. అమెరికాకు ఇరాన్ సుప్రీం లీడర్ స్ట్రాంగ్ వార్నింగ్..
- Mojtaba Khamenei: ‘‘దేవుడి దయతో అమెరికా లేని భవిష్యత్తు’’.. మొజ్తబా ఖమేనీ కీలక ప్రకటన..
- Iran War: ఇరాన్పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
- Pakistan: ట్రంప్ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
Read Also: Uttam Kumar Reddy : టీఆర్ఎస్ పాలనలో ఒక్క గిరిజనుడు పట్టా వచ్చిందా
గతంలో భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణి ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పడిన విషయాన్ని బుట్టో ప్రస్తావించారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన డెమొక్రాటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ రిసెప్షన్ లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. చైనా, రష్యాకు వ్యతిరేకంగా యూఎస్ విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ హయాంలో పాకిస్తాన్- అమెరికా సంబంధాలు క్షీణించాయి. అమెరికా ఇచ్చే సైనిక సహాయాన్ని కడా నిలిపివేసింది. అయితే జో బైడెన్ వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో రెండు దేశాలు సంబంధాలను మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ అమెరికా సాయాన్ని కోరుతోంది. ఇప్పటికే ఎఫ్-16 విమానాలను ఆధునీకీకరించే ఢిపెన్స్ డీల్ అమెరికా- పాకిస్తాన్ మధ్య కుదిరింది. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పాకిస్తాన్ కాస్త ఆందోళన చెందుతోంది.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!