Pakistan: బైడెన్ వ్యాఖ్యలపై యూఎస్ రాయబారికి సమన్లు.. భారత్పై కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan summons US envoy over Joe Biden’s comments: పాకిస్తాన్ దేశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అణ్వాయుధాలపై సమన్వయం లేని కారణంగా పాకిస్తాన్ ప్రపంచంలోనే ప్రమాదకర దేశాల్లో ఒకటి అని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్ దేశాన్ని షాక్ కు గురిచేశాయి. అమెరికాతో ఇప్పుడిప్పుడే సంబంధాలను మెరుగుపరుచుకుంటున్నామని అనుకుంటున్న పాకిస్తాన్ కు ఇది మింగుడు పడటం లేదు. ఈ వ్యాఖ్యలపై పాకిస్తాన్ తమ నిరసన తెలుపుతోంది.
పాకిస్తాన్ లోని అమెరికా రాయబారిని పిలిచింది పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ. పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో జర్ధారీ దీనిపై మాట్లాడుతూ.. జో బైడెన్ వ్యాఖ్యలు తనను ఆశ్చర్యానికి గురి చేశాయని అన్నారు. ఇస్లామాబాద్ లోని యూఎస్ రాయబారి డొనాల్డ్ బ్లోమ్ కు సమన్లు జారీ చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ తన సమగ్రత, భద్రతపై కఠినంగా ఉందని.. ప్రశ్నలు లేవనెత్తాలంటే అవి భారతదేశం అణ్వాయుధాలపై ఉండాలని బిలావల్ బుట్టో అన్నారు. పాకిస్తాన్-అమెరికా మధ్య సరైన సంబంధాలు లేకపోవడంతోనే అపార్థం చేసుకున్నట్లు ఉన్నారని ఆయన అన్నారు.
Also Read
- Trump: ఈ రాత్రి ఇరాన్ను ఊహించలేని దెబ్బ కొడతాం.. ఖర్గ్ కూడా స్వాధీనం చేసుకుంటాం.. ట్రంప్ వార్నింగ్
- Nuclear Warheads: ప్రపంచాన్ని ఆలోచింపజేస్తున్న భారత్ నిర్ణయం.. ఆ 12 న్యూక్లియర్ వార్ హెడ్ల కథేంటి?
- Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు...
- Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
Read Also: Uttam Kumar Reddy : టీఆర్ఎస్ పాలనలో ఒక్క గిరిజనుడు పట్టా వచ్చిందా
గతంలో భారతదేశం నుంచి బ్రహ్మోస్ క్షిపణి ప్రమాదవశాత్తు పాక్ భూభాగంలో పడిన విషయాన్ని బుట్టో ప్రస్తావించారు. లాస్ ఏంజిల్స్ లో జరిగిన డెమొక్రాటిక్ కాంగ్రెస్ ప్రచార కమిటీ రిసెప్షన్ లో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటి అని వ్యాఖ్యానించారు. చైనా, రష్యాకు వ్యతిరేకంగా యూఎస్ విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ హయాంలో పాకిస్తాన్- అమెరికా సంబంధాలు క్షీణించాయి. అమెరికా ఇచ్చే సైనిక సహాయాన్ని కడా నిలిపివేసింది. అయితే జో బైడెన్ వచ్చిన తర్వాత ఇటీవల కాలంలో రెండు దేశాలు సంబంధాలను మెరుగుపరుచుకునే పనిలో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికంగా చితికిపోయిన పాకిస్తాన్ అమెరికా సాయాన్ని కోరుతోంది. ఇప్పటికే ఎఫ్-16 విమానాలను ఆధునీకీకరించే ఢిపెన్స్ డీల్ అమెరికా- పాకిస్తాన్ మధ్య కుదిరింది. ఈ నేపథ్యంలోనే ప్రెసిడెంట్ జో బైడెన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో పాకిస్తాన్ కాస్త ఆందోళన చెందుతోంది.
తాజావార్తలు
-
Pawan Kalyan : ఓజీ 2 ఈజ్ ఆన్.. పవన్ ఫ్యాన్ కి పండుగ లాంటి న్యూస్
-
Riyan Parag: గాయంతో పోరాటం.. కన్నీళ్లు దాచుకుంటూ సర్జరీ బెడ్పై నుంచి రియాన్ పరాగ్ ఎమోషనల్ వర్డ్స్..
-
Vishal: ఒళ్లు గగుర్పొడిచేలా విశాల్ ‘మకుటం’ టీజర్
-
Tilak Varma: మా కొంప ముంచింది అదొక్కటే.. ఓటమిపై కీలక వ్యాఖ్యలు చేసిన తిలక్ వర్మ..
-
EPFO New Rules: ఉద్యోగులకు శుభవార్త.. 100 శాతం PF విత్డ్రా చేయొచ్చు..! ఎప్పుడంటే..?
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!