UK: మమ్మల్ని రక్షించండి.. యూకే ప్రధాని లిజ్ ట్రస్కు హిందూ సంఘాల లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu groups Wrote open letter to Liz Truss after Leicester violence: ఇటీవల యూకే వ్యాప్తంగా జరగుతున్న పరిణామాలు హిందువులను, భారతీయులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆసియా కప్ లో భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిన తర్వాత బ్రిటన్ లోని పలు నగరాల్లో హిందూ-ముస్లింల మధ్య ఘర్షణ చెలరేగింది. హిందువుల ఇళ్లు, కార్లు టార్గెట్ గా రాడికల్ ముస్లింగ్రూపులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ముఖ్యంగా లిచెస్టర్ సిటీతో పాటు బర్మింగ్ హామ్ వంటి నగరాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన పరిణామాలపై, హింసాకాండ తర్వాత దేశంలో తమను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని, మమ్మల్ని రక్షించండంటూ 180 బ్రిటీస్ ఇండియన్, హిందూ సంస్థలు యూకే ప్రధాని లిజ్ ట్రస్ కు బహిరంగ లేఖ రాశాయి. హిందూ సమాజానికి స్వల్ప, దీర్ఘకాలికంగా తగిన భద్రత కల్పించేందుకు ఆరు విజ్ఞప్తులు చేశారు. ఇటీవల జరిగిన లిసెస్టర్, బర్మింగ్ హామ్ ఘటనలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. భౌతిక దాడులకు పాల్పడటంతో పాటు సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడుతున్నారని.. పాఠశాలలు, కార్యాలయాల వద్ద హిందువులను టార్గెట్ చేస్తున్నారని ప్రధానికి తెలియజేశారు.
Also Read
- Imran Khan: ఇమ్రాన్ ఖాన్ మృతి.? పాక్ జర్నలిస్ట్ సంచలన వ్యాఖ్యలు..
- DY Chandrachud: రష్యా-ఉక్రెయిన్ వివాదంలో మాజీ సీజేఐ ఎంట్రీ.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా బాధ్యతలు
- Mecca Pact Explained: పాకిస్థాన్ పాచికలు చెల్లవు.. మక్కా ఒప్పందం వెనుక ఉన్న అసలు రహస్యం ఇదే!
- Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
Read Also: Pakistan: బైడెన్ వ్యాఖ్యలపై యూఎస్ రాయబారికి సమన్లు.. భారత్పై కామెంట్స్
అర శతాబ్ధానికి పైగా హిందూ సమాజం యూకేను తమ నివాసంగా మార్చుకుందని.. మేము ఈ జనాభాలో 2 శాతం కన్నా ఎక్కువగా ఉన్నామని, బ్రిటన్ చట్టాలను గౌరవిస్తూ, దేశ పురోగతికి సహకరిస్తున్నామని హిందూ సంస్థల ప్రతినిధులు లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రతీ రోజు మేం భయంగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ సమాజం భయాందోళనలో ఉందని.. ఇప్పటికే కొన్ని కుటుంబాలు ఇరుగుపొరుగు ప్రాంతాలను వదిలి వెళ్లగా.. మరికొంత మంది వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని లేఖలో తెలిపారు.
హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఇటీవల నేారాలకు పాల్పడిన వారిపై పోలీసులు దర్యాప్తు చేయాలని, అల్లర్లలో ధ్వంసం అయిన లిసెస్టర్ లోనా వ్యాపారులకు ఆర్థిక సహాయాన్ని అందించాలని.. హిందూ వ్యతిరేక ద్వేషంపై దర్యాప్తు చేయాలని, బ్రిటన్ లో తీవ్రవాద ముప్పు గుర్తించడం, దీపావళి జరుపుకునే సమయంలో ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని, పాఠశాల్లలో హిందూ ద్వేషాన్ని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆరు డిమాండ్లను బ్రిటన్ ప్రధాని ముందు ఉంచాయి హిందూ సంఘాలు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మిల్లర్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్..
-
Parliament Monsoon Session: భయపడొద్దు, పారిపోవద్దు.. అమిత్ షా వస్తున్నాడు..
-
AP Investments : ఏపీకి భారీ పెట్టుబడుల జాతర.. రూ.2.08 లక్షల కోట్లకు SIPB గ్రీన్ సిగ్నల్.!
-
Abhijeet Dipke: త్వరలో జంతర్మంతర్-2 ప్రారంభం.. అభిజీత్ దిప్కే ప్రకటన
-
Police Lathi Testing: పోలీసుల “లాఠీ”లకు ఇన్ని పరీక్షలా.. మనుషుల్ని కొట్టి మరీ పరీక్షిస్తారా.?
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..