UK: మమ్మల్ని రక్షించండి.. యూకే ప్రధాని లిజ్ ట్రస్కు హిందూ సంఘాల లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindu groups Wrote open letter to Liz Truss after Leicester violence: ఇటీవల యూకే వ్యాప్తంగా జరగుతున్న పరిణామాలు హిందువులను, భారతీయులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఆసియా కప్ లో భారత్-పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగిన తర్వాత బ్రిటన్ లోని పలు నగరాల్లో హిందూ-ముస్లింల మధ్య ఘర్షణ చెలరేగింది. హిందువుల ఇళ్లు, కార్లు టార్గెట్ గా రాడికల్ ముస్లింగ్రూపులు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. ముఖ్యంగా లిచెస్టర్ సిటీతో పాటు బర్మింగ్ హామ్ వంటి నగరాల్లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి.
ఇదిలా ఉంటే ఇటీవల జరిగిన పరిణామాలపై, హింసాకాండ తర్వాత దేశంలో తమను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారని, మమ్మల్ని రక్షించండంటూ 180 బ్రిటీస్ ఇండియన్, హిందూ సంస్థలు యూకే ప్రధాని లిజ్ ట్రస్ కు బహిరంగ లేఖ రాశాయి. హిందూ సమాజానికి స్వల్ప, దీర్ఘకాలికంగా తగిన భద్రత కల్పించేందుకు ఆరు విజ్ఞప్తులు చేశారు. ఇటీవల జరిగిన లిసెస్టర్, బర్మింగ్ హామ్ ఘటనలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. భౌతిక దాడులకు పాల్పడటంతో పాటు సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడుతున్నారని.. పాఠశాలలు, కార్యాలయాల వద్ద హిందువులను టార్గెట్ చేస్తున్నారని ప్రధానికి తెలియజేశారు.
Also Read
- Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్పై ట్రంప్ వార్నింగ్..
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Hormuz-US: హార్ముజ్పై అమెరికా వ్యూహం ఇదేనా? టార్గెట్ ఏంటంటే..!
- Sanae Takaichi: రోజుకి 3 గంటలే నిద్రపోతా.. దుమారం రేపుతోన్న జపాన్ ప్రధాని వ్యాఖ్యలు
Read Also: Pakistan: బైడెన్ వ్యాఖ్యలపై యూఎస్ రాయబారికి సమన్లు.. భారత్పై కామెంట్స్
అర శతాబ్ధానికి పైగా హిందూ సమాజం యూకేను తమ నివాసంగా మార్చుకుందని.. మేము ఈ జనాభాలో 2 శాతం కన్నా ఎక్కువగా ఉన్నామని, బ్రిటన్ చట్టాలను గౌరవిస్తూ, దేశ పురోగతికి సహకరిస్తున్నామని హిందూ సంస్థల ప్రతినిధులు లేఖలో పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రతీ రోజు మేం భయంగా బతకాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ సమాజం భయాందోళనలో ఉందని.. ఇప్పటికే కొన్ని కుటుంబాలు ఇరుగుపొరుగు ప్రాంతాలను వదిలి వెళ్లగా.. మరికొంత మంది వేరే ప్రాంతాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారని లేఖలో తెలిపారు.
హిందూ సమాజానికి వ్యతిరేకంగా ఇటీవల నేారాలకు పాల్పడిన వారిపై పోలీసులు దర్యాప్తు చేయాలని, అల్లర్లలో ధ్వంసం అయిన లిసెస్టర్ లోనా వ్యాపారులకు ఆర్థిక సహాయాన్ని అందించాలని.. హిందూ వ్యతిరేక ద్వేషంపై దర్యాప్తు చేయాలని, బ్రిటన్ లో తీవ్రవాద ముప్పు గుర్తించడం, దీపావళి జరుపుకునే సమయంలో ప్రభుత్వం తగిన భద్రత కల్పించాలని, పాఠశాల్లలో హిందూ ద్వేషాన్ని గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆరు డిమాండ్లను బ్రిటన్ ప్రధాని ముందు ఉంచాయి హిందూ సంఘాలు.
తాజావార్తలు
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!