Physical assault on software engineer in jharkhand: జార్ఖండ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తన స్నేహితుడితో కలిసి మాట్లాడుతున్న సమయంలో ఓ యువతిని అపహరించి 10 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీంతో ఈ కేసును విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను ఏర్పాటు చేసింది అక్కడి ప్రభుత్వం. ఈ కేసులో 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. నిందితులను పట్టుకునేందు పోలీసుదుల దాడులు నిర్వహిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని […]
China's Communist Party Meeting To End Today With Xi Jinping Set For 3rd Term: చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. గత ఆదివారం రోజున రాజధాని బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటాయి. పార్టీలో కీలక పదవులకు ఎన్నికలు జరగడంతో పాటు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కీలకమైన 2,300…
MIM is giving biryani dinners to increase party strength in madhya pradesh: హైదరాబాద్ కేంద్రంగా ఏర్పడిన ఎంఐఎం పార్టీ ఇతర రాష్ట్రాల్లో కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ వంటి రాష్ట్రాల్లో సత్తా చాటింది. ఈ రాష్ట్రాల్లో ఎంఐఎంకు బలమైన ఓటు బ్యాంకు ఉంది. ముఖ్యంగా మైనారిటీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎంఐఎం ఇతర పార్టీలకు సవాల్ విసురుతోంది. ఇదిలా ఉంటే మధ్యప్రదేశ్ లో కూడా తమ బలాన్ని పెంచుకునేందుకు ఎంఐఎం ప్రయత్నిస్తోంది. 2023లో మధ్యప్రదేశ్…
Centre Clears Construction Of 6 Corridors In Arunachal Near China Border: భారత-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయి. భారత్ ను ఇరుకునపెట్టేందుకు ఇప్పటికే చైనా కొత్త గ్రామాలను, రోడ్డు, ఎయిర్ స్ట్రిప్స్, ఎయిర్ బేసులను నిర్మించింది. గల్వాన్ ఘర్షణల అనంతరం చైనా తన సైనిక నిర్మాణాలను పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉంటే భారత్ కూడా చైనాకు ధీటుగా సరిహద్దుల్లో మౌళిక నిర్మాణాలను చేపడుతోంది. అరుణాచల్ ప్రదేశ్ మొదలుకుని చైనాతో సరిహద్దు పంచుకుంటున్న రాష్ట్రాల్లో రోడ్లు, వంతెనలను నిర్మిస్తోంది. ఉద్రిక్తతల సమయంలో…
Madya Pradesh Bus Accident: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగం వెళ్తున్న బస్సు, లారీ ట్రైలర్ ను ఢీకొట్టింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఈ ప్రమాదంలో మొత్తం 14 మంది అక్కడిక్కడే చనిపోగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మొత్తంగా 15 మంది చనిపోగా.. 20 మందికి పైగా గాయపడ్డారు.
Myanmar junta beheads high school teacher: మయన్మార్ దేశంలో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత సైన్యం అరాచకాలు పెరిగిపోయాయి. మానవహక్కులను ఉల్లంఘిస్తోంది అక్కడి జుంటా ప్రభుత్వం. సైనిక పాలకులకు ఎదురుతిరిగినా.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినా.. నిర్ధాక్షిణ్యంగా చంపేస్తోంది. ఇప్పటికే అనేక ఆరోపణపై ప్రముఖ నాయకురాలు ఆంగ్ సాంగ్ సూచీని జైలులో నిర్భంధించింది సైన్యం. తమకు వ్యతిరేకంగా ఉంటే దారుణంగా చంపేస్తోంది.
Parliament panel examining Marriage Bill gets another 3 months extension: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బాల్య వివాహాల నిషేధ(సవరణ) బిల్లు 2021ను పరిశీలించే.. విద్యా,మహిళలు, పిల్లలు, యువత, క్రీడల పార్లమెంటరీ స్థాయి సంఘానికి మరో మూడు నెలల గడువును పొడగించారు. రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధంఖర్ పొడగింపును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. మహిళల కనీస వివాహ వయస్సు 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ వివాహ బిల్లును తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం.
100 MPs support Rishi Sunak in UK PM race: లిజ్ ట్రస్ రాజీనామాతో యూకేలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఆర్థికంగా కుదేలవుతున్న బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టలేక లిజ్ ట్రస్ చేతులెత్తేశారు. ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన 45 రోజుల్లోనే రాజీనామా చేశారు. దీంతో మరోసారి బ్రిటన్ ప్రధాని ఎన్నిక అనివార్యం అయింది. ఇదిలా ఉంటే చాలా మంది టోరీ ఎంపీలు, కన్జర్వేటివ్ పార్టీ ప్రతినిధులు రిషి సునక్ ని కాదని లిజ్ ట్రస్ ని ఎన్నుకోవడంపై తప్పు జరిగిందని భావిస్తున్నారు.
A thief called the police fearing a mob attack in Bangladesh: బంగ్లాదేశ్ లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ దొంగ పోలీసులకే ఫోన్ చేసి షాకిచ్చాడు. తనను రక్షించాలని పోలీసులను వేడుకున్నాడు. దొంగతనం చేసి తప్పించుకునే క్రమంలో స్థానిక గుంపుకు చిక్కుతాననే భయంతో తనను కాపాడాలని కోరాడు. కోపంతో ఉన్న గుంపు తనను కొట్టి చంపేస్తాడని భావించిన దొంగ పోలీసుల హెల్ప్ కోరాడు. బంగ్లాదేశ్ దక్షిణ బారిసల్ నగరంలో మూసి ఉన్న దుకాణంలో బుధవారం తెల్లవారుజామున దొంగతనానికి వెళ్లాడు…
Military chopper crashes in Arunachal Pradesh: ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ఘటన మరవక ముందే మరో హెలికాప్టర్ కుప్పకూలింది. అరుణాచల్ ప్రదేశ్ లో శుక్రవారం మిలిటరీ హెలికాప్టర్ కూలింది. ఎగువ సియాంగ్ జిల్లాలోని ఓ గ్రామానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రెస్క్యూ సిబ్బందిని ఘటన జరిగిన ప్రదేశానికి పంపారు అధికారులు. ప్రయాణికుల సంఖ్య, వారి పరిస్థితి గురించి ఇంకా ఏ వివరాలు తెలియవని ఎగువ సియాంగ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ శాశ్వత్ సౌరభ్ తెలిపారు.