Venu Goapl Reddy
Author- NTV Telugu-
Pakistan: పతనం అంచున పాకిస్తాన్.. ఏడాదిలో పాతాళానికి విదేశీమారక నిల్వలు
Pakistan Economic Crisis: దాయాది దేశం పాకిస్తాన్ పతనం అంచున ఉంది. కేవలం మూడు వారాలకు మాత్రమే విదేశీ మారక నిల్వలు ఉన్నాయి. ఏడాది క్రితం 16.6 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలు ఉంటే ప్రస్తుతం కేవలం 3.1 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్న ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ బెయిలౌట్ ప్యాకేజీ కోసం ప్రయత్నిస్తోంది. ఐఎంఎఫ్ విధించే అన్ని షరతులకు తలొగ్గుతోంది. 7 బిలియన్ డాలర్ల నిధుల కోసం ఐఎంఎఫ్ తో పాకిస్తాన్ చర్చలు జరుపుతోంది. -
Covid-19: కోవిడ్ తర్వాత తీవ్ర మానసిక క్షోభకు గురువుతున్న హెల్త్ వర్కర్స్.. అధ్యయనంలో వెల్లడి..
Covid-19: మూడేళ్లుగా కోవిడ్-19 మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. తన రూపాలను మార్చుకుంటూ ప్రపంచంపై దాడి చేస్తూనే ఉంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ ఇలా రకరకాల వేరియంట్లు ప్రజలపై దాడి చేస్తూనే ఉన్నాయి. కోరోనా వైరస్ పలు దేశాల వ్యాపారం, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపడమే కాకుండా ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర ఒత్తడిని కలిగించింది. ముఖ్యంగా కరోనా వేవ్ లు ముంచుకొచ్చిన సమయంలో వైద్యరంగం తీవ్ర ఇబ్బందులకు గురైంది. వైద్యులు, హెల్త్ వర్కర్లు తీవ్ర ఒత్తడిని ఎదుర్కొన్నారు. -
Kerala: పెట్రోల్, డిజిల్, మద్యంపై సెస్ విధించిన ఎల్డీఎఫ్ సర్కార్.. బడ్జెట్పై అట్టుడుకుతున్న కేరళ
Kerala Budget: కేరళ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఆయుధంగా మారింది. పెట్రోల్, డిజిల్, మద్యంపై సెస్ విధించడంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బడ్జెట్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. శుక్రవారం కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. డిజిల్, పెట్రోల్, మద్యంపై సెస్ విధిస్తున్నట్లు ప్రకటించారు. -
Pakistan PM: ఊహకు అందని విధంగా ఐఎంఎఫ్ షరతులు.. తలొగ్గక తప్పని పరిస్థితి..
Pakistan Economic Crisis: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది దాయాది దేశం పాకిస్తాన్. మిత్రదేశాలను అడిగినా అప్పు పుట్టడం లేదు. ఇప్పటికే చేసిన అప్పులు భారీగా ఉండటంతో అరబ్ దేశాలు, చైనా, ఇతర దేశాలు అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. దీంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) సహకరిస్తే తప్పా ఈ సంక్షోభం నుంచి పాకిస్తాన్ బయటపడే అవకాశం లభించదు. -
IndiGo: బీహార్ వెళ్లాల్సిన వ్యక్తిని రాజస్థాన్లో దించిన విమానం.. ఘటనపై డీజీసీఏ విచారణ
IndiGo Incident: ఇటీవల కాలంలో విమానయాన రంగంలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి. గత నెల వరకు ఫ్లైట్ లో మూత్రవిసర్జన సంఘటన దేశ విమానయాన రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. దీంతో విమానాల్లో వికృతంగా ప్రవర్తించే ప్రయాణికుల పట్ల వ్యవహారించాల్సిన తీరుపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మార్గదర్శకాలు విడుదల చేయాల్సి వచ్చింది. ఏయిరిండియా సంస్థ తన మద్యం పాలసీని సవరించుకుంది. -
Mumbai: గర్ల్ఫ్రెండ్ ఎక్స్ చేతిలో టీనేజర్ దారుణ హత్య..
Teen Student Murdered By Girlfriend's Ex: ప్రేమ వ్యవహారాలు హత్యలకు దారి తీస్తున్నాయి. బిజీ రోడ్డుపైనే ఓ అమ్మాయి మాజీ లవర్ మరో వ్యక్తిని హత్య చేశాడు. ఇది ముంబై మహానగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గురువారం సాయంత్రం ముంబైలో బిజీగా ఉన్న ఓ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు 19 ఏళ్ల కాలేజీ స్టూడెంట్ ను పొడిచి చంపారు. చనిపోయిన వ్యక్తిని చెంబూరు ప్రాంతానికి చెందిన ముఖ్తార్ షేక్ గా గుర్తించారు పోలీసులు. -
China spy balloon: అమెరికా అణుక్షిపణి కేంద్రాలపై చైనా స్పై బెలూన్.. కూల్చేందుకు సిద్ధమైన అగ్రరాజ్యం.
China spy balloon: అమెరికా, చైనా మధ్య హై ఆల్టిట్యూడ్ బెలూన్ ఒకటి ఉద్రిక్తతలను పెంచుతోంది. చైనా నిఘా బెలూన్ గా అనుమానిస్తున్న అమెరికా దాన్ని కూల్చేందుకు సిద్ధం అయింది. కమర్షియల్ విమానాలు ఎగిరే ఎత్తు కన్నా పైన ఈ బెలూన్ ఉన్నట్లు పెంటగాన్ గుర్తించింది. ఈ బెలూన్ ను ట్రాక్ చేస్తున్నట్లు అమెరికా అధికారులు ప్రకటించారు. నిఘా కోసమే దీన్ని చైనా ఉపయోగిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే దీన్ని కూల్చేందుకు అమెరికా తన ఎఫ్-22 ఫైటర్ జెట్లను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. కాగా, దీన్ని… -
Apple: యాపిల్ చూపు.. భారత్ వైపు.. ఎందుకంటే?
Apple: ప్రపంచం ఆర్థికమాంద్యం పరిస్థితులను ఎదుర్కొంటోంది. అమెరికా, యూరోపియన్ మార్కెట్లు ఆశాజనకంగా లేవు. 6 నెలల నుంచి ఏడాది వ్యవధిలో మాంద్యం ఎప్పుడైనా రావచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఒక్క భారత ఆర్థిక పరిస్థితి మాత్రమే ఆశాజనకంగా ఉంటుందని ఐఎంఎఫ్ తో పాటు పలు ఆర్థిక సంస్థలు వెల్లడిస్తున్నాయి. దీంతో ప్రపంచ దిగ్గజ కంపెనీలు భారత్ వైపు చూస్తున్నాయి. -
IT Layoffs: ఐఐటీలో చదివిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కు తప్పలేదు.. ఉద్యోగం ఉంటే చెప్పాలని పోస్ట్..
IT Layoffs: ఐఐటీలో చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఉద్యోగి కూడా తాజా లేఆఫ్స్ నుంచి తప్పించుకోలేకపోయారు. ఐఐటీ గ్రాడ్యుయేట్ అంటే ఏ కంపెనీ అయిన కళ్లకద్దుకుని కొలువు ఇస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూన్ రెండో విడత ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. దాదాపుగా 1000 మందిని కొలువుల నుంచి తీసిపారేసింది. -
Afghanistan: టీవీ షోలో సర్టిఫికేట్లు చించేసిన ప్రొఫెసర్.. దాడి చేసి నిర్భంధించిన తాలిబాన్లు.
Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ పాలన ప్రారంభం అయినప్పటి నుంచి అక్కడ మహిళా విద్యకు ఆస్కారమే లేకుండా పోయింది. తాజాగా పీజీ విద్యార్థినులు విద్యపై కూడా నిషేధం తెలిపింది తాలిబాన్ సర్కార్. మహిళలు ఎంతగా తమ నిరసన తెలిపినా కూడా తాలిబాన్లు వాటన్నింటిని అణిచివేశారు. అయితే ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇస్మాయిల్ మషాల్ అనే యూనివర్సిటీ ప్రొఫెసర్ తన సర్టిఫికేట్లను ఓ ఛానెల్ లైవ్ ప్రోగ్రాంలోనే చించేశారు.
తాజావార్తలు
-
Donald Trump: తగ్గేదేలే.. కాల్పులతో బయపెడదాం అనుకున్నారా.? ఇరాన్పై విజయం సాధిస్తాం.!
-
CM Chandrabbau: రాష్ట్రంలో డీజిల్, పెట్రోల్ కొరత.. బంకుల మూసివేతపై సీఎం సమీక్ష!
-
Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
-
Toxic: యశ్ ‘టాక్సిక్’ పై రుక్మిణి వసంత్ క్రేజీ కామెంట్స్..
-
Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కష్టాలు.. బంకుల దగ్గర వాహనాల బారులు!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!