China: నేటితో ముగియనున్న కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్ పింగ్..!
China’s Communist Party Meeting To End Today With Xi Jinping Set For 3rd Term: చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. గత ఆదివారం రోజున రాజధాని బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటాయి. పార్టీలో కీలక పదవులకు ఎన్నికలు జరగడంతో పాటు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కీలకమైన 2,300 మంది హాజరయ్యారు.
ఇదిలా ఉంటే పార్టీ అధ్యక్షుడి మరోసారి జి జిన్ పింగ్ మూడోసారి బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీతో పాటు ప్రభుత్వంపై పూర్తి పట్టు ఉన్న జిన్ పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశాల్లో సీనియర్ అధికారులు 200 మందితో కూడిన సెంట్రల్ కమిటీని, ఇదే విధంగా 25 మందితో కూడిన పోలిట్ బ్యూరోను, అత్యంత శక్తివంతమైన ఏడుగురు సభ్యులతో కూడిన పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటిని ప్రకటించనున్నారు. ఆదివారం రోజున జిన్ పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించబడతారని అంతా భావిస్తున్నారు.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: Arunachal Pradesh: సరిహద్దుల్లో చైనాకు ధీటుగా భారత్ అభివృద్ధి పనులు
ఇది చైనా అధ్యక్షుడిగా మూడోసారి కొనసాగడానికి జిన్ పింగ్ కు అనుమతి ఇస్తుంది. మార్చిలో ప్రభుత్వ వార్షిక శాసనసభ సమావేశాల్లో జిన్ పింగ్ ను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించనున్నారు. 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన జిన్ పింగ్, ఒక వ్యక్తి రెండుసార్ల కన్నా ఎక్కువ సార్లు అధ్యక్షుడి పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. ఆదివారం ప్రారంభంమైన కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నత సమావేశాల్లో జిన్ పింగ్ దేశ ఆర్థిక పరిస్థితులు, దేశం సాధించిన విజయాలు, కోవిడ్ విధానం, విదేశీ సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు.
తైవాన్ విషయంలో స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తామని.. చైనా సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని అన్నారు. తైవాన్ వేర్పాటువాదాన్ని అణిచివేస్తామని జిన్ పింగ్ ప్రకటించారు. జాతీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. హాంగ్ కాంగ్ పై మాట్లాడారు జిన్ పింగ్.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!