China: నేటితో ముగియనున్న కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్ పింగ్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
China’s Communist Party Meeting To End Today With Xi Jinping Set For 3rd Term: చైనా అధికార కమ్యూనిస్ట్ పార్టీ సమావేశాలు శనివారంతో ముగియనున్నాయి. గత ఆదివారం రోజున రాజధాని బీజింగ్ లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లో ఈ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ప్రతీ ఐదేళ్లకు ఒకసారి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కాంగ్రెస్ సమావేశాలు జరుగుతుంటాయి. పార్టీలో కీలక పదవులకు ఎన్నికలు జరగడంతో పాటు పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన కీలకమైన 2,300 మంది హాజరయ్యారు.
ఇదిలా ఉంటే పార్టీ అధ్యక్షుడి మరోసారి జి జిన్ పింగ్ మూడోసారి బాధ్యతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే పార్టీతో పాటు ప్రభుత్వంపై పూర్తి పట్టు ఉన్న జిన్ పింగ్ మూడోసారి చైనా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ సమావేశాల్లో సీనియర్ అధికారులు 200 మందితో కూడిన సెంట్రల్ కమిటీని, ఇదే విధంగా 25 మందితో కూడిన పోలిట్ బ్యూరోను, అత్యంత శక్తివంతమైన ఏడుగురు సభ్యులతో కూడిన పోలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటిని ప్రకటించనున్నారు. ఆదివారం రోజున జిన్ పింగ్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రకటించబడతారని అంతా భావిస్తున్నారు.
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
Read Also: Arunachal Pradesh: సరిహద్దుల్లో చైనాకు ధీటుగా భారత్ అభివృద్ధి పనులు
ఇది చైనా అధ్యక్షుడిగా మూడోసారి కొనసాగడానికి జిన్ పింగ్ కు అనుమతి ఇస్తుంది. మార్చిలో ప్రభుత్వ వార్షిక శాసనసభ సమావేశాల్లో జిన్ పింగ్ ను అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించనున్నారు. 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించిన జిన్ పింగ్, ఒక వ్యక్తి రెండుసార్ల కన్నా ఎక్కువ సార్లు అధ్యక్షుడి పదవిని చేపట్టేందుకు మార్గం సుగమం చేసుకున్నాడు. ఆదివారం ప్రారంభంమైన కమ్యూనిస్ట్ పార్టీ అత్యున్నత సమావేశాల్లో జిన్ పింగ్ దేశ ఆర్థిక పరిస్థితులు, దేశం సాధించిన విజయాలు, కోవిడ్ విధానం, విదేశీ సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడారు.
తైవాన్ విషయంలో స్పష్టమైన విధానాన్ని అనుసరిస్తామని.. చైనా సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటామని అన్నారు. తైవాన్ వేర్పాటువాదాన్ని అణిచివేస్తామని జిన్ పింగ్ ప్రకటించారు. జాతీయ ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని ఆయన అన్నారు. హాంగ్ కాంగ్ పై మాట్లాడారు జిన్ పింగ్.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!