Myanmar: మయన్మార్లో సైనిక పాలకుల అరాచకం.. ఉపాధ్యాయుడి తల నరికి పైశాచికం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Myanmar junta beheads high school teacher: మయన్మార్ దేశంలో ప్రజా ప్రభుత్వం నుంచి అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత సైన్యం అరాచకాలు పెరిగిపోయాయి. మానవహక్కులను ఉల్లంఘిస్తోంది అక్కడి జుంటా ప్రభుత్వం. సైనిక పాలకులకు ఎదురుతిరిగినా.. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడినా.. నిర్ధాక్షిణ్యంగా చంపేస్తోంది. ఇప్పటికే అనేక ఆరోపణపై ప్రముఖ నాయకురాలు ఆంగ్ సాంగ్ సూచీని జైలులో నిర్భంధించింది సైన్యం. తమకు వ్యతిరేకంగా ఉంటే దారుణంగా చంపేస్తోంది.
ఇదిలా ఉంటే మరోసారి అక్కడి సైనిక పాలకులు అరాచకానికి పాల్పడ్డారు. సైనిక పాలనను వ్యతిరేకించినందుకు ఉపాధ్యాయుడి తల నరికేశారు. మయన్మార్ గ్రామీణ ప్రాంతం అయిన మాగ్వే ప్రాంతంలో తౌంట్ మైంట్ గ్రామంలో 46 ఏళ్ల సా తున్ మో అనే గణిత ఉపాధ్యాయుడి తల నరికేసి, మృతదేహాన్ని పాఠశాల గేటు ముందు ప్రదర్శించారు. తలను గేటుకు వేలాడదీశారు. గతేడాది మూతపడిన ఈ పాఠశాలను కాల్చేశారు. అయితే ఈ ఘటన గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైడ్ స్పందించారు. బహిరంగంగా ఒక ఉపాధ్యాయుడి తల నరకడం దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
Also Read
- Cannes: కేన్స్ ఫెస్టివల్స్లో మిస్ వెనిజులా 2025పై దాడి.. ముఖం రక్తసిక్తం.. ఫొటోలు వైరల్
- Marco Rubio: భారత్ టూర్కు మార్కో రూబియో.. వెనిజులా ట్విస్ట్తో పర్యటనపై సర్వత్రా ఆసక్తి
- Cockroach Trend Goes Global: పాకిస్థాన్కు చేరిన బొద్దింకల ట్రెండ్.. పాక్లో "కాక్రోచ్" పేరుతో కొత్త పార్టీలు..
- Chinese Alcohol: బీరు కాదు.. విస్కీ అసలే కాదు.. చైనీస్ శతాబ్దాలుగా తాగే మద్యం ఏంటి? దాని ప్రత్యేక ఏంటి?
Read Also: Brahmastra 2 : ‘బ్రహ్మాస్త్ర 2’ ను నిర్మిస్తామంటూ ముందుకొచ్చిన డిస్నీ
గతేడాది ఫిబ్రవరిలో మయన్మార్ లో సైనిక తిరుగుబాటు జరిగింది. ప్రజా ప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేపట్టింది. రాజధాని నేపితాను ఆధీనంలోకి తీసుకుని ఆంగ్ సాంగ్ తో పాటు పలువురు రాజకీయ నాయకులను జైల్లలో నిర్భంధించారు. 2300 మంది పౌరులను చంపినట్లు సైన్యంపై ఆరోపణలు ఉన్నాయి. సైన్యం పాలనను వ్యతిరేకించిన వారిని దారుణంగా అణిచివేసింది. సైన్యం అధికారాన్ని స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి అక్కడ విద్యా సిబ్బందిపై 260 దాడులు జరిగాయని యూఎన్ బాలల హక్కుల కమిటీ వెల్లడించింది. హత్యకు గురైన సా తున్ మో సైనిక పాలనకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. దీంతో ఆదివారం ఆయన స్థానికంగా ఉన్న వేరుశెనెగ పంటలో దాక్కున్నా సైన్యం వదిలిపెట్టకుండా వెతికిపట్టుకుని మరీ చంపింది
తాజావార్తలు
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో కోర్టులో లొంగిపోయిన భర్త సమర్థ్ సింగ్
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
VishnuPriya : ఏడ్చి ఏడ్చి విసిగిపోయా, ఇక నోరు మూసుకునేది లేదు: విష్ణుప్రియ ఫైర్!
-
Supreme Court: తల్లిదండ్రులు ఐఏఎస్లు అయితే మళ్లీ పిల్లలకు రిజర్వేషన్లు ఎందుకు? సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు
-
RBI Dividend: ప్రభుత్వానికి ఆర్బీఐ రికార్డు స్థాయి నిధుల బదిలీ.. దాదాపు రూ.2.87 లక్షల కోట్ల వరకు..
ట్రెండింగ్
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!