protest against Pathaan movie in Indore: బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ నటిస్తున్న ‘ పఠాన్’ మూవీకి నిరసన సెగ తగులుతోంది. మరో బాలీవుడ్ సినిమాకు ‘బాయ్ కాట్’ సెగ తగులుతోంది. ఈ సినిమాలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని కొన్ని హిందూ సంఘాలు ఆరోపిస్తున్నాయి. హిందువలు మనో భావాలను దెబ్బతీసినందుకు ఈ సినిమాను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఈ సినిమాపై సీరియస్ గా ఉంది.
Bird flu in Kerala, Order to kill chickens and ducks: కేరళలో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. కేరళలోని రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూను గుర్తించారు అధికారులు. దీంతో దీన్ని అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. కొట్టాయంలోని అర్పూకర, తలయజమ్ అనే రెండు పంచాయతీల్లో బర్డ్ ఫ్లూ వ్యాపించింది. ప్రభావిత ప్రాంతాల నుంచి కిలోమీటర్ పరిధిలో ఉన్న 8000 కోళ్లు, బాతులను, ఇతర పెంపుడు పక్షులను చంపాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. జిల్లా కలెక్టర్ పీకే జయశ్రీ అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో…
India strong Reply After Pak Raises Kashmir At UN: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో కాశ్మీర్ సమస్యను లేవనెత్తిన పాకిస్తాన్ మరోసారి తన పరువును తీసుకుంది. భద్రతా మండలిలో ఒక రోజు ముందు పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి బిలావల్ భుట్టో కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. అయితే దీనికి ఘాటుగా స్పందించారు భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్. ఆల్ ఖైదా ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ కు పాకిస్తాన్ ఆశ్రయం ఇవ్వడాన్ని భద్రతా మండలిలో ఎత్తి చూపుతూ.
France End Morocco's Dream FIFA World Cup Run To Set Up Final Clash With Argentina: ఖతార్ వేదికగా జరగుతున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ బెర్తులు ఖరారు అయ్యాయి. టోర్నీ ఆద్యంతం ఆధిప్యతం ప్రదర్శించిన మొరాకోను మట్టికరిపించింది ఫ్రాన్స్. అద్భుత ప్రదర్శనతో ప్రపంచకప్ గెలుచుకునేందుకు ఒక అడుగు దూరంలో నిలిచింది. కప్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న మొరాకో ఆశలపై ఫ్రాన్స్ నీళ్లు చల్లింది. ఆదివారం అర్జెంటీనాతో తలపడననుంది ఫ్రాన్స్. హోరాహోరీగా జరిగి సెమీఫైనల్ మ్యాచులో ఫ్రాన్స్ 2-0తో…
Elon Musk Is Now The World's Second Richest Man. New No. 1 Is Bernard Arnaul: ప్రపంచ కుబేరుడి జాబితాలో అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్ రెండో స్థానానికి పడిపోయాడు. బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ఎలాన్ మస్క్ గత జనవరి నుంచి క్రమంగా తన సంపదను కోల్పోతూ వస్తున్నాడు. దాదాపుగా అతని సంపదలో 100 బిలియన్ డాలర్లను కోల్పోయాడు. ప్రస్తుతం ఎలాన్ మస్క్ సంపద 168.5 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇన్నాళ్లు ప్రపంచ నెంబర్ 1 ధనవంతుడిగా ఉన్న…
Acid Attack On Delhi Schoolgirl, Victim Critical: ఢిల్లీలో దారుణం జరిగింది. 17 ఏళ్ల బాలికపై దుండగులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన ఢిల్లీలోని మోహన్ గార్డెన్ ప్రాంతంలో బుధవారం జరిగింది. తన చెల్లిలితో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు బాలికపై యాసిడ్ దాడి చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు ప్రస్తుతం చికిత్ పొందుతోంది. బాధితురాలు ఇద్దరు వ్యక్తలపై అనుమానం వ్యక్తం చేయడంతో అందులో ఒకరిని…
college students suspended in Karnataka after altercation over interfaith relationship: హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయిల మధ్య ప్రేమ వ్యవహారం కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలో కొత్త వివాదానికి దారి తీసింది. మతాంతల సంబంధంపై కాలేజీలో జరిగిన గొడవలో 18 మంది విద్యార్థులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది కాలేజీ యాజమాన్యం. సస్పెండ్ అయిన విద్యార్థులు నేరుగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు. దక్షిణ కన్నడ జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలలో హిందూ బాలిక, ముస్లిం వ్యక్తి మధ్య మతాంతర సంబంధంపై…
Prashant Kishore criticizes Bihar Deputy CM Tejashwi Yadav: ప్రముఖ ఎన్నికల స్ట్రాటజిస్ట్, రాజకీయ నాయకుడు ప్రశాంత్ కిషోర్, బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ పై విమర్శలు గుప్పించారు. సొంత రాష్టమైన బీహార్ లో 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్న ఆయన తేజస్వీ యాదవ్ ని లక్ష్యంగా చేసుకుంటూ విమర్శించారు. బీహార్ వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్), సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్( సీటెట్)కి అర్హత సాధించిన అభ్యర్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు. సామాన్య కుటుంబాలకు చెందిన…
Murder Case Against CBI Officials Over Death Of Bengal Violence Accused: కేంద్ర ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం ఏర్పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెంగాల్ రాష్ట్రంలో బీర్భూమ్ హింసాకాండలో నిందితుడి మరణం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణం కాబోతోంది. బీర్బూమ్ హింసాకాండలో ప్రధాన నిందితుడిగా ఉన్న లాలన్ షేక్ సోమవారం సీబీఐ క్యాంపు కార్యాలయంలోని వాష్రూమ్లో శవమై కనిపించాడు. లాలన్ షేక్ ఆత్మహత్య చేసుకున్నట్లు సీబీఐ అధికారులు వెల్లడించారు.
MK Stalin's Son, Udhayanidhi, Joins His Cabinet As Sports Minister: తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ కేబినెట్ లో చేరారు. మంత్రిగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సీఎం ఎంకే స్టాలిన్ మంత్రివర్గంలో రాష్ట్ర క్రీడాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఉదయనిధి స్టాలిన్ చెన్నైలోని చేపాక్ - తిరువల్లికేణి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎంకే స్టాలిన్ రాజకీయ వారసుడిగా ఉదయనిధిని డీఎంకే పార్టీ భావిస్తోంది. ఉదయనిధి స్టాలన్ ఎప్పటి నుంచో మంత్రివర్గంలో చేరుతారని వార్తలు వస్తున్నప్పటికీ.. తాజాగా…