China: చైనా కుయుక్తులు.. సరిహద్దు వెంబడి యుద్ధవిమానాల మోహరింపు
China has deployed drones and warplanes along the border: జిత్తులమారి చైనా భారత సరిహద్దు వెంబడి యుద్ధ విమానాలు, డ్రోన్లను మోహరిస్తోంది. సరిహద్దు వెంబడి పలు ఎయిర్ బేస్ లను నిర్మించిన చైనా దాని వెంబడి సైనిక మోహరింపును పెంచుతోంది. తాజాగా అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ ఘర్షణల తర్వాత డ్రాగన్ కంట్రీ తన కుతంత్రాలకు పదును పెడుతోంది. హై-రిజల్యూషన్ శాటిలైట్ చిత్రాలు చైనా మోహరింపును స్పష్టంగా చూపిస్తున్నాయి. భారత ఈశాన్య ప్రాంతానిక అతి దగ్గరలో వీటిని మోహరించింది.
అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు ఈశాన్యంగా 150 కిలోమీటర్ల దూరంలో చైనా బంగ్డా ఎయిర్ ఎయిర్బేస్ లో అత్యాధునిక WZ-7 ‘సోరింగ్ డ్రాగన్’ డ్రోన్ ను ఉంచింది. 2021లో తొలిసారిగా ఈ డ్రోన్ ను చైనా ఆవిష్కరించింది. ఏకంగా 10 గంటల వరకు నాన్ స్టాప్ గా ఎగరడం దీని ప్రత్యేకత. నిఘాతో పాటు క్రూయిజ్ క్షిపణులను ఇది భూమిపై లక్ష్యాలపై ప్రయోగించగలదు. అయితే ప్రస్తుతం భారత్ వద్ద ఇలాంటి డ్రోన్లు లేవు. అయితే ప్రస్తుతం ఇండియా ఎయిర్ ఫోర్స్ కోసం హిందూస్తాన్ ఏరోనాటిక్స్ తో కలిసి కొత్త తరం డ్రోన్లను తయారు చేస్తోంది.
Also Read
- West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
- The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
- S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై కేంద్రం కీలక ప్రకటన..

Read Also: FIFA World Cup: సేమ్ టు సేమ్.. సచిన్కు జరిగిందే.. మెస్సీకి జరిగింది..!!
డిసెంబర్ 14 తీసిన చిత్రాల్లో చైనా బాంగ్డా ఎయిర్బేస్ లో రెండు ఫ్లాంకర్ తరగతికి చెందిన ఫైటర్ జెట్లను ఉంచింది. ఈ రకం ఫైటర్ జెట్లు రష్యా సుఖోయ్-30ఎంకేఐ తరహా విమానాలు మేడ్ ఇన్ చైనా వేరియంట్లు. ముఖ్యంగా 2017 డోక్లాం ప్రతిష్టంభన తర్వాత చైనా ఈశాన్య సరిహద్దుల్లో సైనికీకరణను పెంచింది. లాసా గోంగ్గర్ విమానాశ్రయం రన్ వేను విస్తరించింది. టిబెట్ ప్రాంతంలోని అన్ని ఎయిర్ బెస్ లను అప్ గ్రేడ్ చేసింది. సైనికులను వేగంగా తరలించేందుకు రోడ్డు,రైలు మార్గాలను విస్తరించింది. భారత్ ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది.
ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లోని యాంగ్ట్సే ప్రాంతంలో (తవాంగ్ సెక్టార్) ఇరు దేశాల సైనికులు ఘర్షణతో మరోసారి సరిహద్దుల్లో ఉద్రికత్త నెలకొంది. చైనా మూడు కీలక ఎయిర్ బేసుల అభివృద్ధి చేస్తోంది. బంగ్డా( అరుణాచల్ సరిహద్దు నుంచి 150 కిలోమీటర్లు), లాసా ( సరిహద్దు నుంచి 260కిలోమీటర్లు), షిగట్సే(సిక్కిం సరిహద్దు నుంచి 150 కిలోమీటర్లు) ఎయిర్ బేసులను డెవలప్ చేసింది.
అయితే భారత్ తేజ్పూర్, మిస్సమారి, జోర్హాట్, హషిమారా మరియు బాగ్డోగ్రాలతో సహా అస్సాం, బెంగాల్ ప్రాంతాల్లో ఎయిర్ బేసులను నిర్వహిస్తోంది. చైనా ఎయిర్ బేసులతో పోలిస్తే భారత ఎయిర్ బేసులు వ్యూహాత్మకంగా మెరుగైన స్థితిలో ఉన్నాయి. చైనా ఎయిర్ బేసులు పూర్తిగా టిబెట్ ప్రాంతంలో ఎతైన ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో బరువులను మోసుకెళ్లాలంటే చైనా విమానాలు ఇబ్బందులు ఎదుర్కొంటాయి. అయితే భారత్ వైమానికి స్థావరాల నుంచి యుద్ధవిమానాలు సులువుగా ఇంధనం, క్షిపణులను తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Marcus Stoinis: 4, 6, 6, 4, 4.. స్టోయినిస్ డెత్ ఓవర్ బీభత్సం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Vaibhav Sooryavanshi: పొలార్డ్ రికార్డుకు ఎసరు.. ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ..
-
West Bengal Assembly Election 2026: చివరి దశ ఓటింగ్కు సిద్ధమైన బెంగాల్.. భవానీపుర్లో మమతా-సువేందు ఫేస్ ఆఫ్
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో