Karnataka-Maharashtra border row: మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దుల్లో హై టెన్షన్.. 144 సెక్షన్ విధింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Massive protest at Belagavi for no to maha mela, sec 144 imposed: కర్ణాటక, మహారాష్ట సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత పెరిగింది. సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. సరిహద్దుల్లోని కోగ్నోలి టోల్ ఫ్లాజా దగ్గర వందలాది మంది మహారాష్ట్ర ఏకీకరణ సమితి(ఎంఇఎస్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) కార్యకర్తలు, నాయకులు సోమవారం పెద్దఎత్తున నిరసన తెలిపారు. మహామేళాకు కర్ణాటక ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో సీఎం బస్వరాజ్ బోమ్మైకి వ్యతిరేకంగా అంతర్ రాష్ట్ర సరిహద్దు బెలగావికి సమీపంలో నిరసన తెలిపారు.
ఎంఈఎస్ ప్రతీ ఏడాది కర్ణాటక అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభ రోజున బెలగావిలో సమావేశాన్ని నిర్వహిస్తుంటుంది. ఐదు దశాబ్ధాలుగా సరిహద్దు సమస్యను లేవనెత్తుతోంది ఈ సంస్థ. అయితే తాజాగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలకు ముందు భారీ నిరసనలకు ప్లాన్ చేసింది. శాసనసభ 10 రోజుల శీతాకాల సమావేశాలు ఈ రోజు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో బెలగావి పట్టణంలో ఎంఈఎస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు వందలాది కార్యకర్తలు, నాయకులు గుమిగూడటంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు.
Also Read
- India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
- Ayodhya Ram mandir: రామ మందిర విరాళాలు చోరీ.. 8 మందిపై ఎఫ్ఐఆర్..
- Ketan Agarwal Case: పెళ్లికి ముందు కేతన్ గురించి సియా ఏం చెప్పిందంటే..! తల్లిదండ్రులు కీలక వ్యాఖ్యలు
- Ram Mandir Donation Scam: రామ మందిర విరాళాల వ్యవహారంలో ట్విస్ట్.. 8 మందిపై ఎఫ్ఐఆర్
Read Also: Lionel Messi: మెస్సీ అస్సాంలో పుట్టాడు.. కాంగ్రెస్ ఎంపీ ట్వీట్ వైరల్
సరిహద్దు వివాదంలో బెలగావిలో హై అలర్ట్ విధించింది ప్రభుత్వం. దాదాపుగా 5000 మంది పోలీసులను మోహరించారు. ఆరుగురు ఎస్పీలు, 11 ఏఎస్పీలు, 43 మంది డీఎస్పీలు, 95 మంది సీఐలు, 241 మంది ఎస్ఐలు భద్రతను పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు శివసేన ఎమ్మెల్యేలను బెలగావిలోకి అనుమతించడం లేదు కర్ణాటక ప్రభుత్వం. అయితే సరిహద్దు వివాదంపై ఇటు కర్ణాటక, అటు మహారాష్ట్ర నేతలు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. శివసేన, ఎన్సీపీ పార్టీలు అధికార బీజేపీపై విమర్శలు చేస్తున్నాయి.
మహారాష్ట్ర సాంగ్లీ జిల్లాలో జాత్ తహసీలుకు చెందిన కొన్ని గ్రామాలు కర్ణాటకలో విలీనం అయ్యేందుకు తీర్మానం చేశాయని కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై అనడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిగా మహారాష్ట్రలోని ఏ గ్రామం కూడా కర్ణాటకలోకి వెళ్లదని.. బెల్గాం-కార్వార్-నిపానీ సహా మరాఠీ మాట్లాడే గ్రామాలను పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో గట్టిగా పోరాడుతుందని .. ఏ గ్రామం కూడా కర్ణాటకలో చేరేందుకు తీర్మానం చేయలేదని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ వ్యాఖ్యానించడంతో ఈ రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ముదిరింది. 1956లో రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య అలాగే ఉంది. కర్ణాటకలోని బెళగావిని మహారాష్ట్ర తమదే అని చెబుతుంటే.. మహారాష్ట్రలోని షోలాపూర్ తమదే అని కర్ణాటక చెబుతోంది.
తాజావార్తలు
-
T20 World Cup: మహిళా ప్రపంచకప్లో సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగమ్మాయి.. రికార్డులు బద్దలు..
-
India Vs Ireland: మళ్లీ మారిన టీ20 కెప్టెన్.. ఐర్లాండ్తో తలపడే ప్రతి టీ-20 సిరీస్లోనూ కొత్త కెప్టెనే..
-
Anantha Sriram : రివ్యూస్ రాసేవాళ్ళకు ఏం అర్హత ఉంది?
-
India-Bangladesh: బంగ్లాదేశ్ పౌరులకు గుడ్న్యూస్.. టూరిస్ట్ వీసాల జారీకి భారత్ గ్రీన్ సిగ్నల్
-
AP Government Schools: ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ పాఠశాలల్లో భారీగా విద్యార్థుల చేరిక
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!