Moonlighting: “మూన్లైటింగ్”పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన.. టెక్కీలకు షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Worker Can Not Take Up Moonlighting As Per Rule says Labour Minister In Parliament: ఈ మధ్య ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘‘మూన్లైటింగ్’’. ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూనే మరో కంపెనీకి కూడా పనిచేయడాన్ని మూన్లైటింగ్ గా పేర్కొంటారు. ఇటీవల దేశీయ ఐటీ దిగ్గజ కంపెనీ విప్రో మూన్లైటింగ్ చేస్తున్నారనే ఆరోపణలతో ఒకేసారి 300 మంది ఉద్యోగులను తొలగించింది. దీంతో ఒక్కసారిగా ఐటీ రంగంలో ఉద్యోగులు షాక్ కు గురయ్యారు. మూన్లైటింగ్ పద్దతిని విడనాడకుంటే తాము కూడా ఇదే విధంగా వ్యవహారించాల్సి ఉంటుందని మిగతా కంపెనీలు కూడా ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చింది.
తాజాగా మూన్లైటింగ్ పై కేంద్రమంత్రి పార్లమెంట్ లో కీలక ప్రకటన చేశారు. చట్టపరంగా ఒక కార్మికుడు తన ఉద్యోగంతో పాటు యజమాని ఆసక్తికి వ్యతిరేకంగా ఏ విధమైన పనిని చేయకూడదని అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వర్క్ ఫ్రం హోం పుణ్యమా అని చాలా మంది ఐటీ ఉద్యోగులు మూన్లైటింగ్ కి పాల్పడ్డారు.
Also Read
- Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
- Meerut Murder: ఆరేళ్ల క్రితం ప్రేమ పెళ్లి.. డ్రైవర్తో ఎఫైర్.. భర్తను పాముతో కరిపించి చంపేసిన భార్య..
- Sakshi Jha: సాక్షి ఝా 'మ్యాన్ హేటర్' వ్యాఖ్యలు.. భర్తకు మద్యం తాగించి చంపాలనుకుంటున్నట్లు చెప్పిన వైనం
- Vikram-1 Launch: చరిత్ర సృష్టించిన విక్రమ్-1.. భారత తొలి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ విజయవంతం
Read Also: Umair Sandhu: చిరంజీవిని అంకుల్ అన్న ప్రముఖ క్రిటిక్.. మెగా అభిమానుల ఫైర్
అయితే ఉద్యోగుల తొలగింపుకు మూన్లైటింగ్ కారణం అని ప్రభుత్వం భావిస్తుందా..? అనే ప్రశ్నకు కేంద్ర మంత్రి రామేశ్వర్ తేలి సమాధానం ఇచ్చారు. ఇండస్ట్రియల్ ఎంప్టాయిమెంట్(స్టాండర్డ్ ఆర్డర్స్)చట్టం 1946 ప్రకారం.. ఒక కార్మికుడు తను ఉద్యోగం చేస్తున్న సంస్థ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేయకూడదు. అతని ఉద్యోగంతో పాటు మరో ఉద్యోగం చేయకూడదు. సంస్థ యజమాని ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఇది ఉంటుందని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి లోక సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఉద్యోగుల తొలగింపు అనేది సంస్థల్లో సాధారణం అని.. దేశంలో మూన్లైటింగ్ పై ప్రభుత్వం అధ్యయనం చేస్తుందా..? అనే ప్రశ్నకు లేదని సమాధానం ఇచ్చారు.
మూన్లైటింగ్ కారణంగా ఉద్యోగులను తొలగించవద్దని ప్రభుత్వం కంపెనీలను ఆదేశించిందా..? అనే ప్రశ్నకు సంబంధించి ఐటీ, సోషల్ మీడియా, ఎడ్టెక్ సంస్థలు, సంబంధిత రంగాల్లో మల్లీనేషనల్ కంపెనీలు, భారతీయ కంపెనీల విషయంలో అధికార పరిధి ఆయా రాష్ట్రప్రభుత్వాలదే అని మంత్రి పేర్కొన్నాడు. పారిశ్రామిక వివాదాల చట్టం-1947 ప్రకారమే ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Shocking Statistics: 6 నెలల్లో 554 మంది భర్తల మృతి.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన సంచలన నివేదిక!
-
Pawan Kumar Chandana: మ్యాథ్స్లో 51 మార్కులు.. నేడు భారత తొలి ప్రైవేట్ రాకెట్ విజయవంతం.. హైదరాబాద్ కుర్రాడి విజయగాథ!
-
Jani Master: నిర్మాతల డబ్బులు దోచేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా?
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
Childhood Trauma: కళ్ల ముందే తల్లి హత్య.. ఈ చిన్నారుల ఆవేదన చూస్తే కన్నీళ్లు ఆగవు!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!