India at UNHRC: ప్రజాస్వామ్యం గురించి పాకిస్తాన్ పాఠాలు అవసరం లేదు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India at UNHRC: ప్రపంచవేదికలపై పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని, మానవహక్కుల గురించి చెబుతోంది. సమావేశం ఎజెండాతో సంబంధం లేకుండా వీటి గురించి ప్రస్తావిస్తూ భారత్ ను అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్లాన్స్ ను తిప్పికొడుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి పాకిస్తాన్ మాట్లాడింది. అయితే దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాకిస్తాన్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేనది స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఉగ్రవాదం, హింసను పాకిస్తాన్ ఎగుమతి చేస్తోందని, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని భారత్ విమర్శించింది. అండర్ సెక్రటరీ డాక్టర్ పీఆర్ తులసీదాస్ మాట్లాడుతూ.. తప్పుడు ప్రచారం చేయడానికి బదులుగా మైనారిటీల భద్రత, సంక్షేమం గురించి దృష్టి పెట్టాలని పాకిస్తాన్ కు హితవు పలికారు. యూఎన్ చేత గుర్తించబడిన 150 మంది ఉగ్రవాదులు, తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ నిలయంగా ఉందని, నిషేధించబడిన ఉగ్రవాదులు అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు.
Also Read
- Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
- Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
- PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
- Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
Read Also: Amritpal Singh: మహిళలతో అక్రమ సంబంధాలు.. పాక్ నుంచి ఆయుధాలు.. అమృత్పాల్ లీలలు..
26/11 ముంబై ఉగ్రవాదుల నిందితులు స్వేచ్ఛగా పాకిస్తాన్ లో సంచరిస్తున్నారని.. దీన్ని పాకిస్తాన్ కొట్టిపారేయగలదా..? అని ప్రశ్నించారు. ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పట్టుబడిన విషయాన్ని పాకిస్తాన్ కాదనగలదా..? అని భారత్ ప్రశ్నించింది. పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ సమీపంలో లాడెన్ ఆశ్రయం పొందారని, అతడిని పాక్ రక్షించిందని భారత్ వ్యాఖ్యానించింది.
జమ్మూాకాశ్మీర్ భారత్ లో ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటుందని తులసీదాస్ నొక్కి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ భారత్ లో మిగిలిన ప్రాంతాలతో పాటు శాంతి, అభివృద్ధి వైపు ప్రయాణిస్తోందని అన్నారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నా, తప్పుడు ప్రచారం ద్వారా భారత్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా కూడా కాశ్మీర్ అభివృద్ధి సాధ్యం అయిందని అన్నారు. భారతదేశం లౌకిక దేశంగా ుందని, మైనారిటీల హక్కులను పరిరక్షించడం మా రాజకీయాల్లో ముఖ్య అంశం అని, పాకిస్తాన్ లో మాత్రం దైవదూషన్ చట్టాలు, వివక్ష, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, మైనారిటీల కిడ్నాప్ లు, హత్యలు జరుగుతున్నాయని భారత్, పాకిస్తాన్ తూర్పారపట్టింది.
- Tags
- india
- jammu kashmir
- Pakistan
- UNHRC
తాజావార్తలు
-
Sanatana Row: తమిళనాడులో ‘‘సనాతన ధర్మం’’పై వివాదం.. మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..
-
Supreme Court: తమిళనాడు ‘‘మైండ్ సెట్’’ మార్చుకోవాలి.. హిందీ వ్యతిరేకతపై సుప్రీం సీరియస్..
-
PM Modi: మోడీకి ప్రపంచ నాయకులు బర్త్డే విషెస్.. ట్రంప్, పుతిన్ శుభాకాంక్షలు
-
Telangana MLC Elections : ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా షురూ.. గ్రాడ్యుయేట్స్కు కీలక అలర్ట్
-
US: అమెరికాలో హైదరాబాద్ యువకుడు మృతి.. 17 రోజుల క్రితమే పెళ్లి.. ఇంతలోనే ఘోరం
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!