India at UNHRC: ప్రజాస్వామ్యం గురించి పాకిస్తాన్ పాఠాలు అవసరం లేదు.. భారత్ స్ట్రాంగ్ కౌంటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India at UNHRC: ప్రపంచవేదికలపై పాకిస్తాన్ జమ్మూ కాశ్మీర్ అంశాన్ని, మానవహక్కుల గురించి చెబుతోంది. సమావేశం ఎజెండాతో సంబంధం లేకుండా వీటి గురించి ప్రస్తావిస్తూ భారత్ ను అభాసుపాలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ కూడా ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ప్లాన్స్ ను తిప్పికొడుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ప్రజాస్వామ్యం, మానవహక్కుల గురించి పాకిస్తాన్ మాట్లాడింది. అయితే దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రజాస్వామ్యం గురించి ప్రపంచానికి పాకిస్తాన్ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేనది స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.
ఉగ్రవాదం, హింసను పాకిస్తాన్ ఎగుమతి చేస్తోందని, ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోందని భారత్ విమర్శించింది. అండర్ సెక్రటరీ డాక్టర్ పీఆర్ తులసీదాస్ మాట్లాడుతూ.. తప్పుడు ప్రచారం చేయడానికి బదులుగా మైనారిటీల భద్రత, సంక్షేమం గురించి దృష్టి పెట్టాలని పాకిస్తాన్ కు హితవు పలికారు. యూఎన్ చేత గుర్తించబడిన 150 మంది ఉగ్రవాదులు, తీవ్రవాద సంస్థలకు పాకిస్తాన్ నిలయంగా ఉందని, నిషేధించబడిన ఉగ్రవాదులు అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని విమర్శించారు.
Also Read
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- Shivsena: ఉద్ధవ్కు భారీ షాక్.. షిండే సేనలో ఎంపీల విలీనానికి స్పీకర్ ఆమోదం..
- Anna Hazare: ‘‘సహనాన్ని పరీక్షించొద్దు’’.. సోనమ్ వాంగ్చుక్కు అన్నాహజారే మద్దతు..
- Abhishek Banerjee: "తిరిగి రండి, గంటలో రాజీనామా చేస్తా".. అభిషేక్ బెనర్జీ సంచలన ప్రకటన..
Read Also: Amritpal Singh: మహిళలతో అక్రమ సంబంధాలు.. పాక్ నుంచి ఆయుధాలు.. అమృత్పాల్ లీలలు..
26/11 ముంబై ఉగ్రవాదుల నిందితులు స్వేచ్ఛగా పాకిస్తాన్ లో సంచరిస్తున్నారని.. దీన్ని పాకిస్తాన్ కొట్టిపారేయగలదా..? అని ప్రశ్నించారు. ప్రపంచంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ పట్టుబడిన విషయాన్ని పాకిస్తాన్ కాదనగలదా..? అని భారత్ ప్రశ్నించింది. పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ సమీపంలో లాడెన్ ఆశ్రయం పొందారని, అతడిని పాక్ రక్షించిందని భారత్ వ్యాఖ్యానించింది.
జమ్మూాకాశ్మీర్ భారత్ లో ఎప్పటికీ అంతర్భాగంగా ఉంటుందని తులసీదాస్ నొక్కి చెప్పారు. జమ్మూ కాశ్మీర్ భారత్ లో మిగిలిన ప్రాంతాలతో పాటు శాంతి, అభివృద్ధి వైపు ప్రయాణిస్తోందని అన్నారు. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తూ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నా, తప్పుడు ప్రచారం ద్వారా భారత్ వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నా కూడా కాశ్మీర్ అభివృద్ధి సాధ్యం అయిందని అన్నారు. భారతదేశం లౌకిక దేశంగా ుందని, మైనారిటీల హక్కులను పరిరక్షించడం మా రాజకీయాల్లో ముఖ్య అంశం అని, పాకిస్తాన్ లో మాత్రం దైవదూషన్ చట్టాలు, వివక్ష, ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, మైనారిటీల కిడ్నాప్ లు, హత్యలు జరుగుతున్నాయని భారత్, పాకిస్తాన్ తూర్పారపట్టింది.
- Tags
- india
- jammu kashmir
- Pakistan
- UNHRC
తాజావార్తలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
-
Chennai Love Story Trailer: కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ ట్రైలర్ చూశారా!
-
IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
-
Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!