UK Parliament: “ఖలిస్తానీ పోకిరీల”పై చర్యలు తీసుకోవాలి.. యూకే పార్లమెంట్ లో ఎంపీల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK Parliament: యూకేలోని భారత హైకమిషన్ పై ఖలిస్తాని మద్దతుదారులు దాడులు అంశాన్ని యూకే హౌస్ ఆఫ్ కామన్స్లో గురువారం లేవనెత్తారు. బ్రిటన్ ఎంపీలు ఖలిస్తానీ పోకిరీలపై చర్యలు తీసుకోవాలని, భారత దౌత్యసిబ్బందికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్మన్ పార్లమెంట్లో చర్చను తేవనెత్తారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ గారెత్ థామస్ మాట్లాడుతూ.. అలాంటివి పునరావృతం కాకుండా ప్రధాని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
పార్లమెంట్ లో క్యాబినెట్ మంత్రి పెన్నీమోర్డాంట్ మాట్లాడుతూ.. భారత రాయబార కార్యాలయం రక్షణ చర్యలను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. హైమిషన్ వెలుపల దాడిని ఖండిస్తున్నామని అన్నారు. భారత హైకమిషన్ పై ఇటీవల ఆరుసార్లు దాడులు జరిగినట్లు ఎంపీ బ్లాక్మన్ పార్లమెంట్ లో లేవనెత్తారు. ఆదివారం హైమిషన్ ముందు ఖలిస్తానీ పోకిరీలు చేసి చర్యల దేశానికి అవమానకరం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఖలిస్తానీ మిలిటెంట్లు పనిచేస్తున్నారు, కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియాలో ఇలాంటి దాడులను చూశామని, మనం ప్రస్తుతం ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నామని, వీరిని దేశంలో నిషేధించాలని ఆయన అన్నారు.
Also Read
- Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
- Kyiv Air Strike: దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని.. యుద్ధ రంగంలోకి ‘ఒరేశ్నిక్’ హైపర్సోనిక్ మిస్సైల్!
- Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాలకు బిగ్ రిలీఫ్! హోర్ముజ్ జలసంధిపై బిగ్ అనౌన్స్మెంట్..
- Pakistan: హైజాక్ చేసిన అదే రైలు.. "జాఫర్ ఎక్స్ప్రెస్"నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?
Read Also: Akshara Gowda: ఎద అందాలను వంగి మరీ చూపిస్తుందిగా
ఈ అంశానికి ముందు బ్లాక్మన్ భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి యూకే పార్లమెంట్ లో లేవనెత్తారు. ఇరుదేశాలు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాయని, కలిసి పనిచేస్తామని మంత్రి నిగెల్ హాడిల్ స్టన్ అన్నారు. గతేడాది దీపావళికే ఈ ఒప్పందం పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా అమలులోకి రాలేదు.
లండన్ లో భారత హైకమిషన్ పై గత ఆదివారం, బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. భారత జెండాను అవమానపరిచారు. బుధవారం ఇంక్ బాటిళ్లు, గుడ్లు, నీటి సీసాలు విసిరారు. ఆదివారం జరిగిన దాడి తర్వాత బుధవారం హైకమిషన్ ముందు భారీగా బలగాలను మోహరించారు. మరోసారి దాడి జరగకుండా లండన్ పోలీసులు నిలువరించారు. పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్ పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయనకు మద్దతుగా బ్రిటన్ లోని ఖలిస్తానీ వాదులు నిరసన తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
PBKS: ఒక్క మ్యాచ్తో ముగ్గురి కథ క్లోజ్.. పాపం సర్పంచ్ సాబ్ ఆశలను ముంచేసిన ‘వాంఖేడే’ పోరు..
-
Virat Kohli: ఈ గడ్డం ఏంటి బాబోయ్.. గిల్ కొత్త లుక్పై కోహ్లీ సెటైర్లు.. వీడియో వైరల్
-
Petrol Prices: పొరుగు దేశంలో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.6 తగ్గిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
-
CM Revanth Reddy: తెలంగాణ మహిళలకు రేవంత్ సర్కార్ కానుక.. రేపే ప్రారంభం..
-
Aayan: ‘మీట్ అవర్ వైజాగ్ హీరో’.. అక్కయ్యపాలెం టు హైదరాబాద్.. అయాన్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!