UK Parliament: “ఖలిస్తానీ పోకిరీల”పై చర్యలు తీసుకోవాలి.. యూకే పార్లమెంట్ లో ఎంపీల డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UK Parliament: యూకేలోని భారత హైకమిషన్ పై ఖలిస్తాని మద్దతుదారులు దాడులు అంశాన్ని యూకే హౌస్ ఆఫ్ కామన్స్లో గురువారం లేవనెత్తారు. బ్రిటన్ ఎంపీలు ఖలిస్తానీ పోకిరీలపై చర్యలు తీసుకోవాలని, భారత దౌత్యసిబ్బందికి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్ బ్లాక్మన్ పార్లమెంట్లో చర్చను తేవనెత్తారు. ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ గారెత్ థామస్ మాట్లాడుతూ.. అలాంటివి పునరావృతం కాకుండా ప్రధాని చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.
పార్లమెంట్ లో క్యాబినెట్ మంత్రి పెన్నీమోర్డాంట్ మాట్లాడుతూ.. భారత రాయబార కార్యాలయం రక్షణ చర్యలను సమీక్షిస్తున్నట్లు తెలిపారు. హైమిషన్ వెలుపల దాడిని ఖండిస్తున్నామని అన్నారు. భారత హైకమిషన్ పై ఇటీవల ఆరుసార్లు దాడులు జరిగినట్లు ఎంపీ బ్లాక్మన్ పార్లమెంట్ లో లేవనెత్తారు. ఆదివారం హైమిషన్ ముందు ఖలిస్తానీ పోకిరీలు చేసి చర్యల దేశానికి అవమానకరం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఖలిస్తానీ మిలిటెంట్లు పనిచేస్తున్నారు, కెనడా, యూఎస్ఏ, ఆస్ట్రేలియాలో ఇలాంటి దాడులను చూశామని, మనం ప్రస్తుతం ఖలిస్తానీ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తున్నామని, వీరిని దేశంలో నిషేధించాలని ఆయన అన్నారు.
Also Read
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
- Chatgpt: చాట్ జీపీటీలో అంతరాయం.. వినియోగదారుల్లో ఆందోళన
- Jaishankar-Zelenskyy: కీవ్లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
- Tata Chemicals: టాటా కెమికల్స్కు కెన్యా షాక్.. వెళ్లిపోవాలని అధ్యక్షుడి ఆదేశం..
Read Also: Akshara Gowda: ఎద అందాలను వంగి మరీ చూపిస్తుందిగా
ఈ అంశానికి ముందు బ్లాక్మన్ భారతదేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం గురించి యూకే పార్లమెంట్ లో లేవనెత్తారు. ఇరుదేశాలు ఈ ఒప్పందానికి కట్టుబడి ఉన్నాయని, కలిసి పనిచేస్తామని మంత్రి నిగెల్ హాడిల్ స్టన్ అన్నారు. గతేడాది దీపావళికే ఈ ఒప్పందం పూర్తి కావాల్సి ఉన్నా ఇంకా అమలులోకి రాలేదు.
లండన్ లో భారత హైకమిషన్ పై గత ఆదివారం, బుధవారం ఖలిస్తానీ మద్దతుదారులు దాడులు చేశారు. భారత జెండాను అవమానపరిచారు. బుధవారం ఇంక్ బాటిళ్లు, గుడ్లు, నీటి సీసాలు విసిరారు. ఆదివారం జరిగిన దాడి తర్వాత బుధవారం హైకమిషన్ ముందు భారీగా బలగాలను మోహరించారు. మరోసారి దాడి జరగకుండా లండన్ పోలీసులు నిలువరించారు. పంజాబ్ లో అమృత్ పాల్ సింగ్ పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఆయనకు మద్దతుగా బ్రిటన్ లోని ఖలిస్తానీ వాదులు నిరసన తెలుపుతున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!