పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రేపు సుప్రీం కోర్టులో తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. జస్టిస్ దీపాంకరదత్త, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ల ధర్మాసనం కేసు విచారణ జరపనున్నారు. నిన్న 5 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు ప్రకటించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ స్పష్టం […]
లగ్జరీ లైఫ్ పై మోజు, తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు అది కూడా ఈజీగా సంపాదించాలన్న ఆశతో లంచాలకు పడగలెత్తుతున్నారు కొందరు ప్రభుత్వ అధికారులు. వేలు, లక్షల్లో లంచాలు పుచ్చుకుంటున్నారు. లంచం ఇవ్వడం, పుచ్చుకోవడం నేరం అని అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ అధికారులే లంచాలు తీసుకుంటుండడంతో పలువురు మండిపడుతున్నారు. లంచగొండి అధికారులపై ఏసీబీ ఉక్కుపాదం మోపుతున్నప్పటికీ లంచాలకు మాత్రం అడ్డుకట్టపడడం లేదు. తాజాగా నిర్మల్ జిల్లా బైంసాలో లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు సీనియర్ అసిస్టెంట్ భీమన్న. […]
పార్టీ మారలేదని స్పీకర్కు చెప్పి ఆ ఎమ్మెల్యే ప్రత్యర్థులకు పొలిటికల్ టార్గెట్ అయ్యారా? నైతికతను ప్రశ్నిస్తూ నియోజకవర్గంలో చెడుగుడు ఆడేసుకుంటున్నారా? తవ్వకాలు జరిపి మరీ… పాత బైట్స్ వెలికి తీసి సోషల్ మీడియాలో సర్క్యులేషన్స్తో రచ్చ చేస్తున్నారా? ఏ ఎమ్మెల్యే విషయంలో ఆ స్థాయి హంగామా జరుగుతోంది? అక్కడే ఎందుకలా? సార్…. నేను పార్టీ మారలేదు. కాంగ్రెస్లోకి ఫిరాయించానన్న మాట అబద్ధం. కావాలంటే చూడండి… నా జీతం నుంచి ఇప్పటికీ నెలనెలా ఐదు వేల రూపాయలు బీఆర్ఎస్ […]
నిర్లక్ష్యం, అజాగ్రత్త, ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించడం వంటి కారణాలతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు పలువురు వాహనదారులు. ఈ ప్రమాదాల్లో ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటుండగా.. చాలా మంది తీవ్ర గాయాలపాలై వైకల్యాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లోక్సభలో రోడ్డు భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో జరిగే చాలా రోడ్డు ప్రమాదాలు ప్రజల ప్రవర్తన, భద్రతా నియమాలను పట్టించుకోకపోవడం వల్లే జరుగుతున్నాయని తెలిపారు. ప్రశ్నోత్తరాల […]
ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ లకు డిమాండ్ పెరిగింది. బ్రాండెడ్ ఎలక్ట్రానిక్ కంపెనీలు క్రేజీ ఫీచర్లతో ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. మరి మీరు కూడా కొత్త ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ కొనాలని భావిస్తున్నారా? అలా అయితే, ఫ్లిప్కార్ట్ ఎండ్-ఆఫ్-సీజన్ సేల్ కొన్ని బెస్ట్ డీల్లను అందిస్తుంది. Samsung Galaxy Z Fold 6 ఎటువంటి బ్యాంక్ ఆఫర్లు లేకుండా ఫ్లిప్కార్ట్లో రూ.58,009 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. కంపెనీ ఈ హ్యాండ్ సెట్ ను రూ. 1,64,999 […]
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించిన అధికారులకు అభినందనలు తెలిపారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ఫలితాలు సాధించిందని.. 2029 లో కూడా ఈ తీర్పు రిపీట్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు.. ఆశీర్వదించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్లు పూర్తి అయిన సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయన్నారు. ప్రజలు సంపూర్ణ విశ్వాసం ప్రదర్శించారు.. అభినందించారన్నారు. 12702 గ్రామ […]
యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా ఎంపికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పదేళ్లు ప్రభుత్వం నడిపాం కానీ పార్టీని బలపర్చలేదన్నారు. జనవరిలో కమిటీల ఏర్పాటును చేపడతామని కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ కు కనిపించడం లేదు.. వినిపించడంలేదని కేటీఆర్ ఎద్దేవ చేశారు. అభివృద్ధి కోసమే పార్టీ మారినం అని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలే చెప్తున్నారని అన్నారు. Also Read:Dhurandhar: పాక్లో “ధురంధర్” బ్యాన్.. […]
సోషల్ మీడియా ఎఫెక్ట్, సినిమాల ప్రభావం ఏమోగాని ఇటీవల లవ్ స్టోరీలు ఎక్కువైపోతున్నాయి. తెలిసి తెలియని వయసులో అట్రాక్షన్ కు లోనై అదే లవ్ అనుకుని కొందరు జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టుకుంటున్నారు. పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్తున్నారు. అయితే ప్రేమ వివాహం తర్వాత భర్త వేధింపులు లేక అత్తమామల వేధింపులతో యువతులు బలైపోతున్నారు. ప్రేమ పెళ్లి ఇష్టం లేక కొందరు, కట్నం డిమాండ్ చేస్తూ మరికొందరు ప్రియురాలి మృతికి కారణమవుతున్నారు. ఇదే రీతిలో […]
బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 514 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులై ఉండాలి. అదనంగా, చార్టర్డ్ అకౌంటెంట్, చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్, ICWA, MBA లేదా బ్యాంకింగ్ లేదా ఫైనాన్స్లో PGDBM లేదా బ్యాంకింగ్, క్రెడిట్లో తత్సమాన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉన్న అభ్యర్థులకు పోస్టు స్థాయిని బట్టి ప్రాధాన్యత ఉంటుంది. Also […]
భారత్-దక్షిణాఫ్రికా మధ్య ఐదు మ్యాచ్ల T20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా బుధవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో 4వ T20 మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, దట్టమైన పొగమంచు టాస్ ను అడ్డుకుంది. అంపైర్లు చివరికి మ్యాచ్ రద్దు చేశారు. సిరీస్లోని చివరి మ్యాచ్ డిసెంబర్ 19న అహ్మదాబాద్లో జరుగనుంది. సాయంత్రం 6:30 గంటలకు టాస్ వేయాలని నిర్ణయించారు, కానీ దట్టమైన పొగమంచు కారణంగా టాస్ ఆలస్యం అయ్యింది. Also Read:Palanadu Accident Case: […]