KTR: స్పీకర్ కు కనిపించడం లేదు.. వినిపించడంలేదు..
- నూతనంగా ఎంపికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో కేటీఆర్ ఆత్మీయ సమావేశం
- పదేళ్లు ప్రభుత్వం నడిపాం కానీ పార్టీని బలపర్చలేదన్నారు
- సీఎం రేవంత్ చెప్పినట్లు స్పీకర్ వింటున్నాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యాదాద్రి భువనగిరి జిల్లాలో నూతనంగా ఎంపికైన బీఆర్ఎస్ సర్పంచ్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పదేళ్లు ప్రభుత్వం నడిపాం కానీ పార్టీని బలపర్చలేదన్నారు. జనవరిలో కమిటీల ఏర్పాటును చేపడతామని కేటీఆర్ తెలిపారు. ఎమ్మెల్యేల ఫిరాయింపులపై స్పీకర్ కు కనిపించడం లేదు.. వినిపించడంలేదని కేటీఆర్ ఎద్దేవ చేశారు. అభివృద్ధి కోసమే పార్టీ మారినం అని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలే చెప్తున్నారని అన్నారు.
Also Read:Dhurandhar: పాక్లో “ధురంధర్” బ్యాన్.. కానీ, వైరల్ సాంగ్తో చిన్న భుట్టో ఎంట్రీ..
Also Read
- Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
- Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
సీఎం రేవంత్ చెప్పినట్లు స్పీకర్ వింటున్నాడు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి సిగ్గులేదు. అన్ని పదవులు అనుభవించిన పోచారం పార్టీ ఎందుకు మరినారో అర్థం కావడం లేదన్నారు. కడియం కు కమిట్మెంట్ లేదన్నారు. ఎక్కడ పోగొట్టున్నామో అక్కడే వెతుక్కుతున్నాం. పంచాయతీలలో BRS గెలుపు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇచ్చిందన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు స్థానిక ఎన్నికల్లో చిల్లర రాజకీయాలు చేయలేదన్నారు. పంచాయతీ ఎన్నికల వివాదాలను కోర్టులో తేల్చుకుంటాం, న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. KCR మీద ప్రజలకు, కాంగ్రెస్, బీజేపీ కి కోపం లేదు. పార్టీ నిర్మాణంలో వెనకబడినం.. అందుకే ఓడిపోయామన్నారు. MPTC, ZPTC ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలి అని ఆకాంక్షించారు.
Also Read:CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రతిష్టాత్మక అవార్డు..
మనలను మనమే ఓడించుకున్నాం. మన సర్పంచ్ లకు బిల్లులు ఇవ్వకపోవడం వల్లే నష్టం జరిగిందని కేటీఆర్ వెల్లడించారు. మా MLA ఓడిపోయినా.. KCR సీఎం కావాలని ప్రజలు కోరుకున్నారన్నారు. గెలిచిన సర్పంచ్ ల కోసం జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. మూసీ సుందరీకరణకు BRS అడ్డుకాదన్నారు. మూసి సుందరీకరణ ఆలోచన BRS పార్టీదే.. STP ల నిర్మాణం పూర్తి చేస్తే.. మూసి సుందరీకరణ చేసినట్టే అని తెలిపారు. మూసి సుందరీకరణ కాంగ్రెస్ చేయకపోతే.. అధికారంలోకి వచ్చాక BRS చేస్తుందన్నారు. విభేదాలు పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో కేడర్ పోరాటం చేయాలని కేటీఆర్ కార్యకర్తలకు సూచించారు.
- Tags
తాజావార్తలు
-
Donald Trump: మన దగ్గర భారీ ఆయుధ నిల్వ ఉంది.. ఇరాన్ పేద దేశం.. యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన
-
Women’s Asia Cup 2026: మరోసారి తలపడనున్న భారత్, పాకిస్థాన్.. మహిళల ఆసియా కప్ షెడ్యూల్ రిలీజ్
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!