-
Health Tips: రుచికి తీపిగా ఉన్నప్పటికీ.. మధుమేహ రోగులకు ఈ పండ్లు బెస్ట్ ఆప్షన్
వేసవి కాలంలో అధిక వేడి, వడగాలులు అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంటాయి. ఈ సమయంలో, ఆరోగ్యం పట్ల అదనపు శ్రద్ధ తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవడం ముఖ్యం.వేసవిలో ప్రతి ఒక్కరూ చల్లగా, తాజాగా ఉండే ఆహార పదార్థాలను తినాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో, పండ్లు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ పండ్ల ప్రత్యేకత ఏమిటంటే వాటిలో చక్కెర పరిమాణం చాలా తక్కువగా ఉంటుంది. మీరు చక్కెర గురించి శ్రద్ధ వహిస్తే లేదా డయాబెటిస్ వంటి సమస్యలను నివారించాలనుకుంటే, […] -
Flipkart: బ్లాక్బస్టర్ డీల్స్ తో.. ఫ్లిప్కార్ట్ ప్రత్యేక సేల్ వచ్చేస్తోంది..
ఇటీవలే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025ను ప్రకటించింది. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ కూడా మే 1 నుంచి ప్రారంభమయ్యే తన కొత్త సేల్ను ప్రకటించింది. ఈ-కామర్స్ దిగ్గజం తన కోట్లాది మంది కస్టమర్ల కోసం SASA LELE అమ్మకాన్ని తీసుకువస్తోంది. ఫ్లిప్కార్ట్ ఈ ప్రత్యేక సేల్లో స్మార్ట్ఫోన్స్, ఏసీ, ఫ్రిజ్ సహా అనేక గృహోపకరణాలు అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉండనున్నాయి. సమ్మర్ లో కొత్త వస్తువులను కొనాలనే ప్లాన్ లో ఉన్న వారు ఈ సేల్ […] -
Gold Rates: భారీగా తగ్గిన బంగారం ధరలు.. నేడు తులం ఎంతంటే?
బంగారం ధరలు లక్షకు చేరుకుని కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. సామాన్యులకు అందని ద్రాక్షలా మిగిలిపోతోంది. పెరుగుతున్న గోల్డ్ ధరలతో ఆందోళన చెందుతున్న వారికి నేడు పసిడి ధరలు తగ్గి ఊరటనిచ్చాయి. ఇవాళ గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. తులం బంగారంపై రూ. 680 తగ్గింది. వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 9,753, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,940 వద్ద […] -
Shahid Afridi: పహల్గామ్ దాడిపై రక్తం మరిగే వ్యాఖ్యలు చేసిన అఫ్రిది.. మండిపడుతున్న భారతీయులు
ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్ర దాడిలో 28 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో భారతీయులు పాక్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది సిగ్గుచేటు పని చేశాడు. పహల్గామ్ దాడిపై రక్తం మరిగే వ్యాఖ్యలు చేశాడు. ఉగ్ర దాడిని ఖండించడానికి బదులుగా, అఫ్రిది భారతదేశాన్ని ఆధారాలు అందించమని కోరాడు. వైరల్ అయిన ఓ […] -
US: అమెరికాలోని కళాశాలలో కాల్పులు.. విద్యార్థి మృతి, 5 గురికి గాయాలు
అమెరికాలోని నార్త్ కరోలినాలోని ఒక కళాశాలలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి మృతి చెందాడు. మరో 5 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ఘటన కళాశాలలో భయాందోళనకు దారితీసింది. ఈ సంఘటన ఎలిజబెత్ సిటీ విశ్వవిద్యాలయంలో జరిగింది. యార్డ్ ఫెస్ట్ సమయంలో అకస్మాత్తుగా కాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసులు కాల్పుల ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నార్త్ కరోలినా యూనివర్సిటీ క్యాంపస్లో యార్డ్ ఫెస్ట్ జరుగుతోంది. బ్లాక్ యూనివర్సిటీలో నిర్వహించబడే ఈ ఉత్సవం ఒక వారం […] -
RR Vs GT: నేడు గుజరాత్ తో రాజస్థాన్ ఢీ.. హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగిపోతోంది. నేడు మరో పోరుకు సర్వం సిద్ధమవుతోంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ తో తలపడనుంది. IPL 2025లో గుజరాత్ టైటాన్స్ భీకర ఫామ్లో ఉంది. శుభ్మాన్ గిల్ నేతృత్వంలోని గుజరాత్ ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్లలో 6 మ్యాచ్ల్లో గెలిచి, రెండు మ్యాచ్ల్లో ఓడిపోయింది. గుజరాత్ జట్టు 12 పాయింట్లతో కొనసాగుతోంది. గుజరాత్ తన చివరి మ్యాచ్లో KKRను 39 పరుగుల తేడాతో ఓడించింది. రాజస్థాన్ ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచ్ల్లో […] -
Madhya Pradesh: కునో నేషనల్ పార్క్ లో 5 పిల్లలకు జన్మనిచ్చిన చిరుత నిర్వా
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ లో చిరుత నిర్వా ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదివారం ప్రకటించారు. రాష్ట్రంలోని షియోపూర్ జిల్లాలో ఉన్న కునో పార్కులో చిరుతలు, పిల్లల సంఖ్య 29కి పెరిగింది. ఈ నెల ప్రారంభంలో రక్షిత అటవీ ప్రాంతం నుంచి రెండు చిరుతలను గాంధీ సాగర్ అభయారణ్యానికి తరలించారు. సీఎం మోహన్ యాదవ్ ఆదివారం రాత్రి X లో పోస్ట్ చేస్తూ.. ” కునోలోకి కొత్త అతిథులకు స్వాగతం.. […] -
DC vs RCB: దంచి కొట్టిన కోహ్లీ-క్రునాల్.. ఢిల్లీపై బెంగళూరు ఘన విజయం
సొంతగడ్డపై జరిగిన మ్యాచ్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం తీర్చుకునేందుకు ఢిల్లీకి వచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాట్స్మెన్ను అడ్డుకున్నారు. భువనేశ్వర్ కుమార్ (3/33), జోష్ హాజిల్వుడ్ (2/36) గట్టి బౌలింగ్ను ఎదుర్కొని ఢిల్లీ బ్యాట్స్మెన్ పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డారు. ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. కెఎల్ రాహుల్ 41 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. Also Read:India Pakistan: […] -
Raja Singh: కెసీఆర్ పై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు..
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్, బీజేపీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర వెనకబాటుకు కారణం ఆ రెండు జాతీయ పార్టీలే అని దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మె్ల్యే రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. రాజా సింగ్ మాట్లాడుతూ.. కెసిఆర్ అన్ని అబద్ధాలే మాట్లాడారని అన్నారు. కెసిఆర్ అంటే జుటా.. మోడీ ప్రధానిగా ఉన్నప్పుడు దేవుడని పొగిడావు.. అప్పుడు ఎందుకు నిధుల గురించి అడగలేదు.. భయ పడ్డావ అంటూ ఎద్దేవా చేశారు. […] -
Kunamneni Sambasiva Rao: అగ్నిప్రమాదానికి గురై దగ్దమైన ఇండ్లకు లక్ష రూపాయలు ఇవ్వాలి..
అబ్దుల్లాపూర్మెట్టు, కుంట్లూరులో జరిగిన ఘోరమైన అగ్నిప్రమాదంలో ఇండ్లు కోల్పోయిన వారికి తక్షణ సహాయం క్రింద లక్ష రూపాయలు ఇవ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. శనివారం రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్మెంట్ రెవెన్యూ పరిధిలోని కుంట్లూరు వద్ద గల రావినారాయణ రెడ్డి కాలనీలో జరిగిన అగ్ని ప్రమాద స్థలాన్ని సాంబశివరావు పరిశీలించి, బాధిత కుటుంబాలను ఓదార్చారు. ఈ ఘోర అగ్నిప్రమాదంలో దాదాపు 300ల వరకు గుడిసెలు కాలి పోయాయని, గ్యాస్ సిలెండర్స్ పేలడం వలన […]
తాజావార్తలు
-
Nitin Gadkari: అండర్వరల్డ్, రెడ్లైట్ ఏరియాల నుంచి ఎక్కువ ఓట్లు.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు..
-
CM Chandrababu: స్వర్ణాంధ్ర విజన్ 2047పై సీఎం చంద్రబాబు క్లారిటీ.. ఎమ్మెల్యేలకు కీలక ఆదేశాలు..
-
Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది దుర్మరణం..
-
Ishan Kishan: దులీప్ ట్రోఫీ ఫైనల్లో కాటేరమ్మ కొడుకు డబుల్ ధమాకా.. 270 పరుగులతో వీర విహారం..
-
AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు.. ఫోటో ఓటర్ల జాబితాలపై ఎస్ఈసీ కీలక నోటిఫికేషన్
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!