Mumbai Indians: హార్థిక్ నుంచి అశ్వని కుమార్ వరకు.. టాలెంట్ ను గుర్తించడంలో ముంబై ఇండియన్స్ తోపు..
- ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్
- ఎంతో మంది టాలెంట్ ప్లేయర్స్ ను గుర్తించి అవకాశం ఇచ్చింది
- ఐపీఎల్ 18వ సీజన్లో కూడా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లో ముగ్గురు యువ ఆటగాళ్లకు స్థానం కల్పించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్, ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా దేశంలోని ప్రతి మూల నుంచి యువ ప్రతిభను గుర్తిస్తూ తన మార్క్ ను చాటుకుంది. ముంబై ఇండియన్స్ (MI) స్కౌటింగ్ జట్టు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది టాలెంట్ ప్లేయర్స్ ను గుర్తించి అవకాశం ఇచ్చింది. ఈ ఆటగాళ్ళు ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడానికి సహాయపడటమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కూడా తమదైన ముద్ర వేశారు. ఐపీఎల్ 18వ సీజన్లో కూడా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లో ముగ్గురు యువ ఆటగాళ్లకు స్థానం కల్పించింది. వీరి అద్భుతమైన ఆటతో క్రికెట్ లోకానికి అంతగా పరిచయం లేని ఈ ఆటగాళ్ళు రాత్రికి రాత్రే స్టార్లుగా మారారు. ముంబై ఇండియన్స్ ద్వారా పేద నుంచి ధనవంతులుగా మారిని ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
Also Read:Bhatti Vikramarka : తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు
Also Read
- Nandini Reddy: "అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?" రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
- Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
- Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
- Maharashtra: ఆర్టీఐలో మార్పులు.. అన్నాహజారే హెచ్చరికతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం
హార్దిక్ పాండ్యా-కృనాల్ పాండ్యా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృనాల్ పాండ్యా ముంబై ఇండియన్స్ పరిచయం చేసిన ప్లేయర్స్. 2015లో ముంబై హార్దిక్ను రూ. 10 లక్షలకి దక్కించుకుంది. బరోడాలో స్థానిక T20 టోర్నమెంట్ ఆడుతున్న సమయంలో స్కౌటింగ్ బృందం అతన్ని గుర్తించింది. హార్దిక్, అతని సోదరుడు కృనాల్ కేవలం నూడుల్స్ తిని బతికారని ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ ఇటీవల వెల్లడించారు. 2015, 2017, 2019, 2020లో ముంబై టైటిల్ గెలుచుకోవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. కృనాల్ 2016 లో ఫ్రాంచైజీలో చేరాడు. 2019 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
Also Read:UP: “డ్రమ్ మర్డర్” భయం.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేయించిన భర్త.. ఈ కథలో మరో ట్విస్ట్..
జస్ప్రీత్ బుమ్రా
టీం ఇండియా బౌలింగ్ కు వెన్నెముకగా నిలిచిన జస్ప్రీత్ బుమ్రాకు 2013 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అవకాశం ఇచ్చింది. తొలి సీజన్ లోనే బుమ్రా అద్భుతాలు చేశాడు. అతను తన అరంగేట్రంలోనే 3/32 తీసుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బుమ్రా ఇప్పుడు భారత్ లోనే కాదు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో బుమ్రా ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు.
Also Read:Waqf Bill: ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్.. రేపు పార్లమెంట్లో “వక్ఫ్ బిల్లు”..
తిలక్ వర్మ
హైదరాబాద్కు చెందిన ఈ యువ ఆటగాడిని 2022 సీజన్లో ముంబై ఎంపిక చేసింది. అప్పటి నుంచి అతను జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. 2023 సీజన్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత వర్మ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పుడు అతను T20I జట్టులో రెగ్యూలర్ ప్లేయర్ గా ఉన్నాడు.
Also Read:Redmi A5: 5200mAh బ్యాటరీతో Redmi కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల.. ధర రూ. 6 వేలు మాత్రమే
నేహాల్ వధేరా
పంజాబ్ దూకుడు బ్యాట్స్మన్ నేహాల్ వాధేరాను ఐపీఎల్ 2023 సీజన్లో అరంగేట్రం చేయడానికి ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ జట్టు ఎంపిక చేసింది. వధేరా తన అద్భుతమైన సిక్స్-హిట్టర్ గా పాపులర్ అయ్యాడు. దీని కారణంగా అతన్ని యువరాజ్ సింగ్ తో పోల్చారు. అతను ముంబై తరఫున రెండు సీజన్లు ఆడాడు, 16 ఇన్నింగ్స్లలో 350 పరుగులు చేశాడు. 18వ సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ నెహాల్ వధేరాను రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది.
Also Read:UP: “డ్రమ్ మర్డర్” భయం.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేయించిన భర్త.. ఈ కథలో మరో ట్విస్ట్..
విఘ్నేష్ పుత్తూరు
ఎడమచేతి వాటం స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై అరంగేట్రం చేశాడు. 24 ఏళ్ల ఈ యువకుడిని కేరళ క్రికెట్ లీగ్లో ఆడుతున్నప్పుడు MI స్కౌటింగ్ బృందం గుర్తించింది. CSK తో జరిగిన తన తొలి IPL మ్యాచ్ లోనే విఘ్నేష్ పుత్తూర్ 32 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. శివం దూబే, దీపక్ హుడాలతో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్లను పడగొట్టాడు.
Also Read:Waqf Bill: ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్.. రేపు పార్లమెంట్లో “వక్ఫ్ బిల్లు”..
అశ్వని కుమార్
కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన IPL 12వ మ్యాచ్లో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అశ్వని కుమార్ ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం పొందాడు. పంజాబ్లోని మొహాలీకి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ తన ఐపీఎల్ కెరీర్లోని మొదటి బంతికే వికెట్లు పడగొట్టాడు. కోల్ కతా కెప్టెన్ అజింక్య రహానేను అశ్వని పెవిలియన్ కు పంపాడు. 2024లో షేర్-ఎ-పంజాబ్ T20 ట్రోఫీ సందర్భంగా అశ్విని MI సిబ్బంది దృష్టిలో పడ్డాడు. తన తొలి మ్యాచ్లోనే 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతను ఐపీఎల్ అరంగేట్రంలో 4 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్ గా నిలిచాడు.
తాజావార్తలు
-
Nandini Reddy: “అన్నం పెట్టే చెయ్యిని నరుకుతారా..?” రెమ్యునరేషన్లు పెంచే దర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్!
-
Ponnam Prabhakar : ఆడలేక మద్దెల ఓడన్నట్లుంది బీఆర్ఎస్ వ్యవహారం
-
Jailer 2 Release: హుకుం.. రజనీకాంత్ ఫ్యాన్స్కు పండుగ.. ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ కన్ఫామ్.!
-
Iran: ఖమేనీ అంత్యక్రియలకు కుమారుడు మొజ్తబా గైర్హాజరు? కారణమిదే!
-
Ganja Racket : మెడిసిన్ పేరుతో గంజాయి.. పోస్టులో డోర్ డెలివరీ.!
ట్రెండింగ్
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!