Mumbai Indians: హార్థిక్ నుంచి అశ్వని కుమార్ వరకు.. టాలెంట్ ను గుర్తించడంలో ముంబై ఇండియన్స్ తోపు..
- ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్
- ఎంతో మంది టాలెంట్ ప్లేయర్స్ ను గుర్తించి అవకాశం ఇచ్చింది
- ఐపీఎల్ 18వ సీజన్లో కూడా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లో ముగ్గురు యువ ఆటగాళ్లకు స్థానం కల్పించింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటైన ముంబై ఇండియన్స్, ట్రోఫీని గెలుచుకోవడమే కాకుండా దేశంలోని ప్రతి మూల నుంచి యువ ప్రతిభను గుర్తిస్తూ తన మార్క్ ను చాటుకుంది. ముంబై ఇండియన్స్ (MI) స్కౌటింగ్ జట్టు గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది టాలెంట్ ప్లేయర్స్ ను గుర్తించి అవకాశం ఇచ్చింది. ఈ ఆటగాళ్ళు ముంబై ఇండియన్స్ టైటిల్ గెలవడానికి సహాయపడటమే కాకుండా అంతర్జాతీయ క్రికెట్లో కూడా తమదైన ముద్ర వేశారు. ఐపీఎల్ 18వ సీజన్లో కూడా ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11లో ముగ్గురు యువ ఆటగాళ్లకు స్థానం కల్పించింది. వీరి అద్భుతమైన ఆటతో క్రికెట్ లోకానికి అంతగా పరిచయం లేని ఈ ఆటగాళ్ళు రాత్రికి రాత్రే స్టార్లుగా మారారు. ముంబై ఇండియన్స్ ద్వారా పేద నుంచి ధనవంతులుగా మారిని ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
Also Read:Bhatti Vikramarka : తమను అభినందించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారు
Also Read
- Abhijit Dipke: "నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు".. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
- Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
- Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
- Delhi Heatwave: ఢిల్లీలో నిప్పుల కొలిమి.. తారు రోడ్ల ఏకంగా 65°C ఉష్ణోగ్రత నమోదు!
హార్దిక్ పాండ్యా-కృనాల్ పాండ్యా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అతని సోదరుడు కృనాల్ పాండ్యా ముంబై ఇండియన్స్ పరిచయం చేసిన ప్లేయర్స్. 2015లో ముంబై హార్దిక్ను రూ. 10 లక్షలకి దక్కించుకుంది. బరోడాలో స్థానిక T20 టోర్నమెంట్ ఆడుతున్న సమయంలో స్కౌటింగ్ బృందం అతన్ని గుర్తించింది. హార్దిక్, అతని సోదరుడు కృనాల్ కేవలం నూడుల్స్ తిని బతికారని ముంబై ఇండియన్స్ యజమాని నీతా అంబానీ ఇటీవల వెల్లడించారు. 2015, 2017, 2019, 2020లో ముంబై టైటిల్ గెలుచుకోవడంలో హార్దిక్ కీలక పాత్ర పోషించాడు. కృనాల్ 2016 లో ఫ్రాంచైజీలో చేరాడు. 2019 ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
Also Read:UP: “డ్రమ్ మర్డర్” భయం.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేయించిన భర్త.. ఈ కథలో మరో ట్విస్ట్..
జస్ప్రీత్ బుమ్రా
టీం ఇండియా బౌలింగ్ కు వెన్నెముకగా నిలిచిన జస్ప్రీత్ బుమ్రాకు 2013 ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ అవకాశం ఇచ్చింది. తొలి సీజన్ లోనే బుమ్రా అద్భుతాలు చేశాడు. అతను తన అరంగేట్రంలోనే 3/32 తీసుకున్నాడు. ఆ తర్వాత బుమ్రా వెనక్కి తిరిగి చూసుకోలేదు. బుమ్రా ఇప్పుడు భారత్ లోనే కాదు.. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలర్. ఐసీసీ టెస్ట్ బౌలింగ్ ర్యాంకింగ్స్లో బుమ్రా ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్నాడు.
Also Read:Waqf Bill: ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్.. రేపు పార్లమెంట్లో “వక్ఫ్ బిల్లు”..
తిలక్ వర్మ
హైదరాబాద్కు చెందిన ఈ యువ ఆటగాడిని 2022 సీజన్లో ముంబై ఎంపిక చేసింది. అప్పటి నుంచి అతను జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. 2023 సీజన్లో అద్భుతమైన ప్రదర్శన తర్వాత వర్మ అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పుడు అతను T20I జట్టులో రెగ్యూలర్ ప్లేయర్ గా ఉన్నాడు.
Also Read:Redmi A5: 5200mAh బ్యాటరీతో Redmi కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల.. ధర రూ. 6 వేలు మాత్రమే
నేహాల్ వధేరా
పంజాబ్ దూకుడు బ్యాట్స్మన్ నేహాల్ వాధేరాను ఐపీఎల్ 2023 సీజన్లో అరంగేట్రం చేయడానికి ముంబై ఇండియన్స్ స్కౌటింగ్ జట్టు ఎంపిక చేసింది. వధేరా తన అద్భుతమైన సిక్స్-హిట్టర్ గా పాపులర్ అయ్యాడు. దీని కారణంగా అతన్ని యువరాజ్ సింగ్ తో పోల్చారు. అతను ముంబై తరఫున రెండు సీజన్లు ఆడాడు, 16 ఇన్నింగ్స్లలో 350 పరుగులు చేశాడు. 18వ సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ నెహాల్ వధేరాను రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది.
Also Read:UP: “డ్రమ్ మర్డర్” భయం.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి చేయించిన భర్త.. ఈ కథలో మరో ట్విస్ట్..
విఘ్నేష్ పుత్తూరు
ఎడమచేతి వాటం స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)పై అరంగేట్రం చేశాడు. 24 ఏళ్ల ఈ యువకుడిని కేరళ క్రికెట్ లీగ్లో ఆడుతున్నప్పుడు MI స్కౌటింగ్ బృందం గుర్తించింది. CSK తో జరిగిన తన తొలి IPL మ్యాచ్ లోనే విఘ్నేష్ పుత్తూర్ 32 పరుగులకు 3 వికెట్లు పడగొట్టాడు. శివం దూబే, దీపక్ హుడాలతో పాటు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వికెట్లను పడగొట్టాడు.
Also Read:Waqf Bill: ఎంపీలకు విప్ జారీ చేసిన బీజేపీ, కాంగ్రెస్.. రేపు పార్లమెంట్లో “వక్ఫ్ బిల్లు”..
అశ్వని కుమార్
కోల్కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన IPL 12వ మ్యాచ్లో ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ అశ్వని కుమార్ ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం పొందాడు. పంజాబ్లోని మొహాలీకి చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ తన ఐపీఎల్ కెరీర్లోని మొదటి బంతికే వికెట్లు పడగొట్టాడు. కోల్ కతా కెప్టెన్ అజింక్య రహానేను అశ్వని పెవిలియన్ కు పంపాడు. 2024లో షేర్-ఎ-పంజాబ్ T20 ట్రోఫీ సందర్భంగా అశ్విని MI సిబ్బంది దృష్టిలో పడ్డాడు. తన తొలి మ్యాచ్లోనే 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో అతను ఐపీఎల్ అరంగేట్రంలో 4 వికెట్లు తీసిన తొలి భారతీయ బౌలర్ గా నిలిచాడు.
తాజావార్తలు
-
Abhijit Dipke: “నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేశారు”.. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సంచలన ఆరోపణలు
-
Donald Trump: ట్రంప్ కుమార్తెను చంపేందుకు కుట్ర!.. ఖాసిం సులేమానీ మరణానికి ఐఆర్జిసి ప్రతీకార ప్లాన్
-
Kashmiri Beauty Secrets: మేకప్ లేకుండానే గులాబీ బుగ్గలు.. కాశ్మీరీ మహిళల సౌందర్య రహస్యాలు మీకోసం..
-
Aishwarya Rai: 1500 గంటల హ్యాండ్వర్క్.. కేన్స్లో ఐశ్వర్య లుక్ ఇంటర్నెట్ షేక్
-
Best Parathas for Summer: మీరు పరోటా ప్రేమికులా..? వేసవిలో ఆరోగ్యానికి బెస్ట్ పరోటాలు ఇవే.. రుచితో పాటు శరీరానికి చల్లదనం
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!