-
Gold Rates: ఓరి దేవుడా.. బంగారం కొనేదెట్టా.. ఒక్కరోజే రూ. 1600 పెరిగిన గోల్డ్ ధర
బంగారం ధరలు పసిడి ప్రియులను గజగజ వణికిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. నేడు మరోసారి భారీగా పెరిగి షాకిచ్చాయి. ఒక్కరోజులోనే తులం గోల్డ్ ధర రూ. 1640 పెరిగింది. వెండి కూడా బంగారం బాటలోనే పయనించింది. నేడు కిలో సిల్వర్ ధర రూ. 1100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,495, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,620 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ […] -
Naxalites: బీజాపూర్లో ఉపాధ్యాయుడిని హత్య చేసిన మావోయిస్టులు..
బీజాపూర్లో పోలీస్ ఇన్ ఫార్మర్ నెపంతో నక్సలైట్లు మరో హత్యకు పాల్పడ్డారు. ఉపాధ్యాయుడిని హత్య చేశారు మావోయిస్టులు. కళ్ళు తాటి తోడ్కా అనే ఉపాధ్యాయుడుని గంగలూర్ ప్రాంతంలోని నేంద్రలో డ్యూటీ వేశారు.. నిన్న సాయంత్రం, పాఠశాల నుంచి తిరిగి వస్తుండగా, నక్సలైట్లు అతన్ని కిడ్నాప్ చేసి హత్య చేశారు. మూసివేసిన పాఠశాలను తిరిగి తెరిచిన కారణంగా ఈ హత్య చేసినట్లుగా పోలీసులు చెప్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 9 మంది పోలీస్ ఇన్ ఫార్ములా పేరిట హత్య చేసినట్లుగా […] -
Hyderabad Crime: కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ లో భర్తను హత్య చేసిన భార్య.. కారణం మాత్రం అది కాదు
నగరంలో మరో దారుణం వెలుగుచూసింది. ఓ భార్య తన భర్తను హత్య చేసింది. కానీ ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణం అయి ఉండొచ్చు అనుకుంటే పొరపాటే.. మరి ఎందుకు చంపేసిందని ఆలోచిస్తున్నారా? అప్పులు ఎక్కువ కావడంతో భార్యాభర్తలిద్దరు చనిపోదామనుకున్నారు. ఈ క్రమంలో మొదట భర్త గొంతు కోసం చంపేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రమ్యకృష్ణ, రామకృష్ణ దంపతులు. వీరు కెపిహెచ్బిలో నివాసముంటున్నారు. Also Read:Karnataka: వేరే కులం అబ్బాయిని ప్రేమించిన కూతురు.. ఆ తండ్రి ఏం […] -
Saroor Nagar Husband M*urder case: సరూర్ నగర్ భర్త హత్యకేసులో వెలుగులోకి సంచలన విషయాలు.. డంబెల్స్ తో మోది..
సరూర్ నగర్ భర్త హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భర్త శేఖర్(40) ని తన భార్య డంబెల్స్ తో మోది హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. భర్త శేఖర్ నిద్రిస్తున్న సమయంలో భార్య చిట్టి డంబెల్స్ తో మోదగా, ప్రియుడు హరీష్ గొంతు నులిమి హత్యకు పాల్పడ్డారు. కొద్దీ రోజుల క్రితమే భార్య చిట్టికి హరీష్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు తెలిపారు. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. శేఖర్,చిట్టీలకు కూతురు,కుమారుడు పిల్లలున్నారు. […] -
Kerala: క్యాంటీన్లో బీఫ్ నిషేధించిన బ్యాంక్ మేనేజర్.. బీఫ్ వడ్డిస్తూ ఉద్యోగుల నిరసన
కేరళలోని కొచ్చిలోని కెనరా బ్యాంక్ శాఖ వద్ద ఒక విచిత్రమైన నిరసన కనిపించింది. ఆఫీసు, క్యాంటీన్లలో గొడ్డు మాంసం నిషేధించాలన్న ఆదేశాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు బయటకు వచ్చి గొడ్డు మాంసం, పరాఠాలు వడ్డిస్తూ నిరసన తెలిపారు. ఇటీవల కేరళలో బాధ్యతలు స్వీకరించిన బీహార్ స్థానికుడైన రీజినల్ మేనేజర్, కెనరా బ్యాంక్ క్యాంటీన్లలో గొడ్డు మాంసం నిషేధించాలని ఆదేశించినట్లు వార్తలు వస్తున్నాయని నిరసనకారులు ఆరోపించారు. బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) మొదట మేనేజర్ మానసిక వేధింపులు, […] -
Telangana Assembly: నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి (ఆగస్టు 30) ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు మొత్తం 3 రోజులపాటు కొనసాగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ సమావేశాల్లో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై చర్చ జరగనుంది. తెలంగాణ క్యాబినెట్ ఇటీవలే ఈ రిపోర్టును ఆమోదించింది. పూర్తి స్థాయిలో రూపొందించబడిన రిపోర్టు మొత్తం 600 పేజీలకు పైగా ఉంది. అసెంబ్లీ సభ్యులకు ఈ రిపోర్టును అందజేసి, అన్ని పార్టీల అభిప్రాయాలను సవివరంగా తెలుసుకొని, తర్వాత పూర్తి స్థాయిలో చర్చలు నిర్వహించడం లక్ష్యంగా […] -
HYD Metro: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. హైదరాబాద్ మెట్రో సేవలు పొడిగింపు..
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మెట్రో రైల్ సంస్థ మెట్రో సేవలను పొడిగించింది. ఆగస్ట్ 30న ప్రత్యేకంగా పొడిగించిన సేవలు అందిస్తోంది. అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచి చివరి రైలు రాత్రి 11:45 గంటలకు బయలుదేరుతుంది. మీ పండల్ దర్శనాలు ఇప్పుడు మరింత సులభం, టెన్షన్ లేకుండా..ఎక్కువ సమయం.. ఎక్కువ భక్తి.. ఎక్కువ సౌకర్యం.. అంటూ హైదరాబాద్ మెట్రో ప్రకటించింది. నగరంలో గణపతి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. గణేషుడిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు ప్రయాణంలో ఇబ్బందులు తలెత్తకుండా […] -
Medak: భారీ వరదలో బోటు బోల్తా.. మెదక్ జిల్లాలో ఆర్మీ జవాన్లకి తప్పిన పెను ప్రమాదం..
మెదక్ జిల్లాలో ఆర్మీ జవాన్లకి పెను ప్రమాదం తప్పింది. రెస్క్యూ కోసం ట్రయల్ వేస్తుండగా బోటు బోల్తా పడింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది జవాన్లను రక్షించేందుకు రంగంలోకి దిగారు. తాళ్ల సాయంతో జవాన్లను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. కాగా ఈ నెల 27న వినాయకుని విగ్రహం కొనుగోలు చేసేందుకు కామారెడ్డి జిల్లా లింగంపల్లి గ్రామానికి చెందిన 8 మంది చిన్నారులు మెదక్ కు వచ్చారు. భారీగా కురిసిన వర్షాలతో పోచారం వరద ఎక్కువ కావడంతో మూడు రోజులుగా […] -
Samsung Galaxy A17 5G: 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ.. మిడ్ రేంజ్ లో సామ్ సంగ్ గెలాక్సీ ఏ17 5G రిలీజ్
ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్ సంగ్ మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. సామ్ సంగ్ గెలాక్సీ ఏ17 5G స్మార్ట్ఫోన్ భారత్ లో విడుదలైంది. ఇది సామ్ సంగ్ A-సిరీస్ లైనప్లో తాజా బడ్జెట్ స్మార్ట్ఫోన్. సామ్ సంగ్ తాజా Galaxy A17 5G స్మార్ట్ఫోన్ AMOLED డిస్ప్లేతో వస్తోంది. కంపెనీ ఈ ఫోన్ను 5000 mAh బ్యాటరీ, 50 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరాతో మార్కెట్లో విడుదల చేసింది. Also Read:Power Star […] -
ACB Raids: తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. భారీగా పట్టుబడుతున్న నగలు
వరంగల్ జిల్లా ఖిలావరంగల్ తహసిల్దార్ బండి నాగేశ్వర్ రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు చేశారు. హనుమకొండ ప్రశాంత్ నగర్ లోని ఆయన ఇంటిపై వరంగల్ ఏసీబీ అధికారులు ఉదయం నుంచి సోదాలు జరుపుతున్నారు. తహసిల్దార్ నాగేశ్వరరావు సొంత జిల్లా ఖమ్మంలో సైతం ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. బండి నాగేశ్వర్ రావు గతంలో ధర్మసాగర్, కాజీపేట, హసన్ పర్తి మండలాల్లో తహసిల్దారుగా పనిచేశారు. ఆ సమయంలో ఆయనపై ఆరోపణలు వచ్చినట్లు తెలిసింది. […]
తాజావార్తలు
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Engineering College fees: “అక్షరాలను అమ్ముకుంటున్న భకాసురులు”.. ఇంజినీరింగ్ కాలేజీల్లో అదనపు వసూళ్ల పర్వం!
-
Ramayana vs Godzilla: ‘రామాయణం’ vs ‘గాడ్జిల్లా’.. దీపావళికి గ్లోబల్ క్లాష్ తప్పదా ?
-
Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి.. మంత్రులకు నారా లోకేష్ దిశానిర్దేశం!
-
Vivo S2: భారత్లో వివో S2 విడుదల.. 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 7,050mAh బ్యాటరీ, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!