ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్ కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కాశ్మీర్ కు చెందిన వారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల కుటుంబాలు విమానాశ్రయంలో తమ పిల్లల కోసం ఆసక్తిగా ఎదురు చూశాయి. రాజస్థాన్లోని […]
మెదక్ లో కామారెడ్డి డిక్లరేషన్ సాధన కోసం బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రతి జిల్లాలో సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు. UPF, తెలంగాణ జాగృతి బీసీల కోసం పోరాడుతున్నాయి.. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసే వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు. మెదక్ లో బీసీల సమావేశం పెడితే కొందరు […]
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిపై కేసు నమోదు కాగా సిట్ విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలో టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ట్యాప్ చేసిన నెంబర్లలో తన నెంబర్ ఉండడంతో కొంత సమాచారం కావాలని సిట్ కోరడంతో సిట్ కార్యాలయానికి వెళ్లారు. సిట్ కు తన స్టేట్ మెంట్ ను ఇచ్చాడు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డితో పాటు నా ఫోన్ […]
హైదరాబాద్ లో డిఫెన్స్ మద్యం పట్టుబడింది. మల్కాజిగిరిలో 37 బాటిల్లు, మేడ్చల్ లో 24 బాటిల్ల మద్యం సీజ్ చేశారు అధికారులు. ఎక్స్ ఆర్మీ పర్సన్ ను అరెస్ట్ చేశారు. ఎక్స్ ఆర్మీకి చెందినటువంటి ఇద్దరూ వ్యక్తులు రెండు చోట్ల మద్యం అమ్మకాలు జరుపుతున్నారు అనే సమాచారం మేరకు మల్కాజిగిరి ఏఈఎస్ ముకుంద రెడ్డి బృందం రెండు చోట్ల దాడి చేసి 37 డిఫెన్స్ మద్యం బాటిల్లను సీజ్ చేశారు. పట్టుబడినటువంటి టిఫిన్స్ మద్యం బాటిళ్లు కర్ణాటక […]
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వాహన యజమానులకు ఆందోళన కలిగిస్తుంది. మరోవైపు పెట్రోల్ పంపులు మోసాలకు పాల్పడుతుండడంతో వాహనదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. మీటర్ ను రీ సెట్ చేయకపోవడం, ఎలక్ట్రానిక్ చిప్ లు పెట్టి మోసం చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఘరానా మోసం వెలుగుచూసింది. భారత్ పెట్రోల్ పంపులో మోసం జరుగుతున్నట్లు వాహనదారులు తెలిపారు. మెహిఫిల్ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న భారత్ పెట్రోల్ పంపులో జరుగుతున్న మోసాన్ని బయటపెట్టారు. Also Read:Robert Vadra: […]
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ రకమైన సంఘటన అయినా క్షణాల్లో వైరల్ గా మారి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. తాజాగా ఈ తరహా వీడియో ఒకటి నెట్టింటా హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఏ వీడియో ఏంటి స్టోరీ అనుకుంటున్నారా? తాజాగా ఉత్తర్ప్రదేశ్లోని నోయిడా ఎక్స్ప్రెస్వేపై లవర్స్ బైక్ పై వెళ్తూ రొమాన్స్ లో మునిగి తేలారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ప్రయాణికుడు ఈ తతంగాన్నంత వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది […]
క్రికెట్ చరిత్రలో ఇది గుర్తుండిపోయే మ్యాచ్. ఎందుకంటే మ్యాచ్ ఫలితం తేలడానికి ఏకంగా మూడు సూపర్ ఓవర్లు ఆడాల్సి వచ్చింది. క్రికెట్ మ్యాచ్ లో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. ప్రతి బంతి, ప్రతి పరుగు, ప్రతి వికెట్ మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేస్తుంటాయి. ఇక సూపర్ ఓవర్ విషయానికి వస్తే, ఉత్కంఠత తారాస్థాయికి చేరుకుంటుంది. కానీ ఒక మ్యాచ్లో ఒకటి కాదు మూడు సూపర్ ఓవర్లు ఆడితే ఏమి జరుగుతుందో ఊహించుకోండి? ఇలాంటిదే జరిగింది. ఇది […]
పసిడి ధరలు దిగొస్తున్నాయి. నిన్న స్వల్పంగా తగ్గిన గోల్డ్ రేట్స్ నేడు భారీగా పడిపోయాయి. ఒక్కరోజులోనే తులం బంగారంపై ఏకంగా రూ. 1,140 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.10,037, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,200 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,050 తగ్గింది. దీంతో రూ. 92,000 వద్ద […]
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెలికమ్యూనికేషన్ వ్యాపారంలోకి ప్రవేశించారు. ఆయన తాజా కంపెనీ ట్రంప్ మొబైల్ T1 స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ఫోన్ అమెరికాలో ఉత్పత్తి అవుతుంది. వార్తా సంస్థ రాయిటర్స్ ప్రకారం, ఆయన దేశీయ కస్టమర్ సపోర్ట్ సెంటర్ను కూడా ప్రారంభించారు. డోనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ న్యూయార్క్లోని ట్రంప్ టవర్లో ఈ కొత్త కంపెనీని ప్రారంభించారు. ట్రంప్కు చెందిన ఈ కంపెనీ అమెరికాలో ప్రధాన టెలికాం ఆపరేటర్గా పనిచేస్తుంది. ట్రంప్ టెలికాం […]
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై కాళేశ్వరం కమిషన్ సీరియస్ అయ్యింది. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని సర్కార్ కు కమిషన్ చీఫ్ మరోసారి లేఖ రాశారు. క్యాబినెట్ మినిట్స్ ఇవ్వాలని ఇప్పటికే రెండుసార్లు కమిషన్ లేఖ రాసింది. తాజాగా మంత్రులు, మాజీ సీఎం కేసీఆర్ స్టేట్మెంట్ తర్వాత మూడోసారి సర్కార్ కు కమిషన్ లేఖ రాసింది. గతంలో ఇంజనీర్ల ఓపెన్ కోర్టు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఒకసారి… ఐఏఎస్ అధికారుల విచారణ తర్వాత మరోసారి లేఖ రాసింది. గతంలో రాసిన లేఖలకు […]