Operation Sindhu: యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి.. భారత్ కు చేరిన 110 మంది విద్యార్థులు
- యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్
- భారత్ కు చేరిన 110 మంది విద్యార్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. యుద్ధంతో అతలాకుతలమైన ఇరాన్ నుంచి 110 మంది భారతీయ విద్యార్థులతో కూడిన ప్రత్యేక విమానం ఢిల్లీకి చేరుకుంది. ఈ విద్యార్థులను మొదట ఇరాన్ నుంచి అర్మేనియాకు తరలించారు. అక్కడి నుంచి వారిని భారత్ కు తీసుకువచ్చారు. ఈ విద్యార్థులలో, 90 మంది జమ్మూ, కాశ్మీర్ కు చెందిన వారు. వీరంతా వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. విద్యార్థుల కుటుంబాలు విమానాశ్రయంలో తమ పిల్లల కోసం ఆసక్తిగా ఎదురు చూశాయి. రాజస్థాన్లోని కోటకు చెందిన ఓ విద్యార్థి తండ్రి మాట్లాడుతూ.. “నా కొడుకు ఇరాన్లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. అతను ఇప్పుడు భారత ప్రభుత్వం పంపిన ప్రత్యేక విమానంలో తిరిగి వచ్చాడు. నేను భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను” అని అన్నారు.
Also Read:Naga Bandham: 10 నిమిషాలకు 10 కోట్లు.. అబ్బుర పరిచేలా నాగబంధం సెట్..!
Also Read
- Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
ఢిల్లీలో దిగిన తర్వాత విద్యార్థి అమన్ అజార్ ANIతో మాట్లాడుతూ.. “నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా కుటుంబాన్ని కలిసిన తర్వాత నాకు ఎలా అనిపిస్తుందో మాటల్లో చెప్పలేను. ఇరాన్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడి ప్రజలు కూడా మనలాగే ఉన్నారు, చిన్న పిల్లలు బాధపడుతున్నారు. యుద్ధం ఎవరికీ మంచిది కాదు. ఇది మానవత్వాన్ని నాశనం చేస్తుంది” అని అన్నారు. భారత ప్రభుత్వం తీసుకున్న సత్వర చర్యను ఆ కుటుంబాలు హృదయపూర్వకంగా అభినందించాయి.
Also Read:CM Chandrababu: మామిడికి అదనపు మద్దతు ధర.. సీఎం ఆదేశాలు
అదే సమయంలో ఇరాన్ యుద్ధ ప్రాంతంలో, ముఖ్యంగా టెహ్రాన్లో ఇప్పటికీ చిక్కుకుపోయిన విద్యార్థుల పట్ల ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రస్తుతం ఇరాన్లో 4,000 మందికి పైగా భారతీయ పౌరులు ఉన్నారు. వీరిలో సగం మంది విద్యార్థులు. అక్కడ చిక్కుకున్న ఇతర పౌరులు సురక్షితంగా తిరిగి వచ్చేలా భారత ప్రభుత్వం ఇరాన్ అధికారులతో కలిసి పనిచేస్తోంది.
#WATCH | Flight carrying 110 Indian Nationals evacuated from Iran, lands in Delhi.
Mariam Roz, a student evacuated from Iran, says, "The Indian Embassy had already prepared everything for us. We did not face any issues. We are travelling for three days, so we are tired… The… pic.twitter.com/EIi6z7Kgsi
— ANI (@ANI) June 19, 2025
తాజావార్తలు
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
Ramayana: ‘రామాయణ’లో..సాయి పల్లవిపై మేకర్స్ కీలక నిర్ణయం!
-
Daily Horoscope: బుధవారం రాశి ఫలాలు.. ఆ రాశుల వారికి ఊహించని శుభవార్తలు!
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!