Veerababu Burugadda
Author- NTV Telugu-
Robbery: దొంగతనం చేసి అదే ఇంట్లో నిద్రపోయిన దొంగ.. హైదరాబాద్ లో ఘటన..
హైదరాబాద్లోని వాడి-ఎ-ముస్తఫా ప్రాంతంలో ఒక ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో ఉన్న ఒక దొంగ, దొంగతనం చేయడానికి ఒక ఇంట్లోకి చొరబడ్డాడు. ఉద్దేశించినట్లే ఇంట్లోని విలువైన వస్తువులను దొంగిలించినప్పటికీ, ఆ తర్వాత జరిగిన పరిణామం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేసింది. తీవ్రమైన మద్యం మత్తులో ఉండటం వల్ల, దొంగతనం ముగించుకుని బయటపడటానికి బదులుగా సదరు నిందితుడు ఆ ఇంట్లోనే నిద్రపోయాడు. ఉదయాన్నే లేచిన ఇంటి యజమానులు, తమ ఇంట్లో అపరిచిత వ్యక్తి నిద్రపోతుండటాన్ని గమనించి […] -
Ind Vs SL: లంక టీమ్కు చుక్కలే.. రిషభ్ పంత్కు భయపడుతున్న లంక ప్లేయర్లు.. కారణం ఇదే..
భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2027 ఫైనల్ రేసులో నిలవాలంటే భారత్కు ఈ రెండు మ్యాచ్ల్లో విజయం సాధించడం అత్యంత ముఖ్యం. గత 11 ఏళ్లుగా శ్రీలంకపై భారత్ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఓడిపోకపోవడంతో గణాంకాల పరంగా టీమ్ ఇండియాదే పైచేయిగా కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 46 టెస్టులు జరగ్గా, భారత్ 22 మ్యాచ్ల్లో విజయం […] -
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
చిత్తూరు జిల్లా పలమనేరులోని జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ నుంచి ఓ జీవిత ఖైదీ తప్పించుకుపోవడం తీవ్ర కలకలం రేపింది. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సూరి (39) అనే ఖైదీ ఆదివారం ఉదయం అధికారుల కన్నుకప్పి పరారయ్యాడు. ఈ సంచలన ఘటనతో అటు జైళ్ల శాఖ అధికారులతో పాటు ఇటు స్థానిక పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. నిందితుడు సూరి గతంలో జరిగిన ఒక హత్య కేసులో దోషిగా తేలడంతో న్యాయస్థానం అతనికి […] -
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాలకు రాబోయే మూడు గంటల్లో అత్యంత తీవ్రమైన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తూ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, అలాగే గంటకు […] -
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
అనంతపురం జిల్లా యల్లనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో తీవ్ర కలకలం రేపిన ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు శ్రీరామమూర్తిపై సస్పెన్షన్ వేటు వేశారు. పాఠశాలలో విద్యార్థినుల పట్ల సదరు ఉపాధ్యాయుడు అనుచితంగా ప్రవర్తిస్తున్నాడని, అవాంఛనీయంగా తాకుతున్నాడని కొద్ది రోజులుగా ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై బాధితులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో వారు ఆగ్రహంతో పాఠశాలకు చేరుకుని ఆందోళన చేపట్టారు. […] -
CM Chandrababu: బాధితులకు ఊరట.. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
అగ్రిగోల్డ్ వ్యవహారంలో బాధితులకు న్యాయం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఈ కేసులో అదనపు ఆస్తులను జప్తు చేయాలని ఆదేశిస్తూ ఏపీ హోంశాఖ తాజాగా అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మొత్తం 9.87 ఎకరాల విలువైన భూములను అటాచ్ చేసేందుకు సీఐడీ డీజీకి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కృష్ణా జిల్లా పరిధిలోని పోరంకి, పెనమలూరు, ఈదర ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 6.55 ఎకరాల భూమితో పాటు, పొరుగు […] -
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
భారతదేశంలో రూ.10, రూ.20 విలువ కలిగిన కరెన్సీ నోట్ల మన్నికను పెంచేందుకు ప్లాస్టిక్ (పాలిమర్) నోట్లను క్షేత్రస్థాయి పరిశీలన నిమిత్తం ప్రయోగాత్మకంగా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) చట్టం 1934లోని సెక్షన్ 25 ప్రకారం పంపిన ఈ ప్రతిపాదన ఆధారంగా.. మొత్తం 200 కోట్ల పాలిమర్ నోట్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో ధృవీకరించారు. కాగితపు నోట్లతో […] -
Yashasvi Jaiswal: 29 టెస్టులు.. 29 వేదికలు.. ఇదెక్కడి వింత రికార్డు భయ్యా..
భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్ట్ క్రికెట్లో తన అద్భుతమైన బ్యాటింగ్తో పాటు ఒక అరుదైన, వినూత్నమైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. 2023లో వెస్టిండీస్పై టెస్ట్ అరంగేట్రం చేసిన జైస్వాల్, ఇప్పటివరకు తన కెరీర్లో 29 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, అతను ఆడిన ఈ 29 టెస్టులు కూడా ప్రతిసారీ వేర్వేరు వేదికలలోనే (స్టేడియంలలో) జరగడం విశేషం. ఏ ఒక్క మైదానం కూడా మళ్లీ రిపీట్ కాకపోవడం క్రికెట్ చరిత్రలోనే అత్యంత […] -
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన మద్యం పాలసీ రూపకల్పనపై ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎక్సైజ్ పాలసీ గడువు సెప్టెంబర్ 30వ తేదీతో ముగియనుండటంతో, తదుపరి తీసుకోబోయే నిర్ణయాలపై అధికారుల మధ్య చర్చలు సాగుతున్నాయి. 2024 అక్టోబర్ 12న అమల్లోకి వచ్చిన రెండేళ్ల పాలసీ గడువు ముగుస్తున్న నేపథ్యంలో.. పూర్తిగా కొత్త పాలసీని తీసుకురావాలా లేదా ప్రస్తుతం ఉన్న లైసెన్సులనే రెన్యువల్ చేయాలా అనే అంశంపై ప్రభుత్వం తీవ్రంగా ఆలోచిస్తోంది. గతంలో దరఖాస్తు ఫీజుల రూపంలో […] -
AP Govt: రైతులకు మరో శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. కేవలం రూ.1.50కే.. జీవో జారీ..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆక్వా రైతులకు మళ్ళీ ఒక ఆ తీపి కబురు అందించింది. పరిశ్రమలోని రైతులపై విద్యుత్ భార భారాన్ని తగ్గించే లక్ష్యంతో యూనిట్ విద్యుత్ను కేవలం రూ. 1.50కే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ అధికారికంగా జీవోను విడుదల చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6,500కి పైగా ఆక్వా ఫారాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరనుంది. ఆక్వా రంగంలో సాగు ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో.. ఈ […]
తాజావార్తలు
-
Heavy Rain Alert: ఉరుములు, మెరుపులతో దంచికొట్టనున్న వర్షాలు.. ఆ 13 జిల్లాల్లో డేంజర్ బెల్స్..
-
India vs Pakistan: పాకిస్థాన్ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
-
Road Accident: సిద్దిపేటలో దారుణం.. అదుపుతప్పి బావిలో పడ్డ కారు, అక్కడికక్కడే నలుగురు మృతి..
-
WTC Final: భారత్కు అసలైన పరీక్ష.. WTC ఫైనల్ చేరాలంటే ఇలా చేయాల్సిందే..
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!