Veerababu Burugadda
Author- NTV Telugu-
Job Fraud: నిరుద్యోగులు కదా ప్రభుత్వ ఉద్యోగం అంటే నమ్మేశారు.. ఒకొక్కరి నుంచి రూ.15 లక్షల చొప్పున వసూలు చేసి..
ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే నిరుద్యోగుల కలలను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పేరు చెప్పి, అక్రమ మార్గాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులను నమ్మించి, కోట్లాది రూపాయలు గుంజిన ఒక భారీ మోసం తాజాగా తిరుపతిలో వెలుగుచూసింది. రూ.3 కోట్ల భారీ స్కామ్.. అసలేం జరిగిందంటే.. తిరుపతిలో నిరుద్యోగులే లక్ష్యంగా కిరణ్ కుమార్ రెడ్డి అనే నిందితుడు భారీ వసూళ్లకు తెరలేపాడు. తాను ఒక అడ్వకేట్నని పరిచయం చేసుకుని, బాధితులకు నమ్మకం […] -
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. వారికి రూ. లక్షన్నర వరకు రుణమాఫీ.. కీలక నిర్ణయాలివే..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దాదాపు 30కి పైగా కీలక అజెండా అంశాలకు ఆమోదం లభించింది. వాటిలో ముఖ్యంగా.. మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్. గ్రామాల్లో రూ.9,355 కోట్లతో 10 భారీ మల్టీ విలేజ్ తాగునీటి పథకాల మంజూరుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల కోసం రూ.1,811 కోట్లతో 2,943 తాగునీటి పథకాలకు అనుమతులు మంజూరు చేశారు. పెద్దగెడ్డ రిజర్వాయర్ కమాండ్ […] -
Shreyas Iyer: ‘శ్రేయస్ అయ్యర్ అలాంటి వాడు అనుకోలేదు’.. అన్నీ అబద్ధాలే.. ఏం జరిగిందంటే..
ఇంగ్లాండ్తో జరిగిన టీ-20 సిరీస్ ఓటమి అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ‘ టీమిండియా జట్టు మార్పుల దశలో ఉంది(ట్రాన్సిషన్)’ అని చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. యువ ఆటగాళ్ల వల్ల తప్పులు జరుగుతాయని, వాటి నుండి నేర్చుకుంటామని ఆయన సమర్థించుకున్నారు. అయితే.. ఈ ప్రకటన వాస్తవాలకు దూరంగా ఉందనేది స్పష్టమవుతోంది. ప్రస్తుత భారత జట్టు స్క్వాడ్ను నిశితంగా పరిశీలిస్తే.. కేవలం ముగ్గురు (వైభవ్ సూర్యవంశీ, ప్రిన్స్ యాదవ్, సూర్యాంశ్ శెడ్గే) మాత్రమే కొత్త ఆటగాళ్లు. […] -
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా బ్రిస్టల్ వేదికగా జరుగుతున్న నాల్గవ టీ20 మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే ఇన్నింగ్స్ ప్రారంభంలోనే జట్టుకు గట్టి షాక్ తగిలింది. యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి ఇంగ్లాండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో వెనుదిరిగాడు. కేవలం 10 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్సర్తో 15 పరుగులు చేసి మంచి టచ్లో కనిపించిన వైభవ్.. ఆర్చర్ వేసిన షార్ట్ లెంగ్త్ బంతిని పుల్ చేయడానికి ప్రయత్నించి […] -
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నేడు (శుక్రవారం) నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇంగ్లాండ్లోని బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదటగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు కాసేపట్లో ముందుగా బౌలింగ్ చేయనుంది. కెప్టెన్ల మాటల్లో.. టాస్ గెలిచిన అనంతరం భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. “మేము మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ […] -
Team India: 142 ఏళ్ల తర్వాత సరికొత్త చరిత్ర.. టీమ్ ఇండియా అరుదైన రికార్డు..
టీ20 వరల్డ్ కప్ 2026 వైఫల్యం తర్వాత, భారత మహిళల క్రికెట్ జట్టు సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. లండన్లోని చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో శుక్రవారం నుంచి ఇంగ్లాండ్తో భారత్ ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆడనుంది. పురుషుల తొలి టెస్ట్ జరిగిన 142 ఏళ్ల తర్వాత లార్డ్స్ మైదానంలో ఒక మహిళల టెస్ట్ మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. లార్డ్స్ కల నిజమవుతోంది.. ఈ చారిత్రాత్మక మ్యాచ్పై భారత హెడ్ కోచ్ అమోల్ మజుందార్ […] -
BSNL Mobile: కాల్స్ చేసుకోవడానికి సిగ్నల్స్ అవసరమే లేదు.. అద్భుత ఫోన్ లాంచ్ చేసిన BSNL..
BSNL సరికొత్త శాటిలైట్ ఫోన్ను భారతదేశంలో లాంచ్ చేసింది. మొబైల్ టవర్లు లేని అత్యంత మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రజలు ఒకరికొకరు కనెక్ట్ అవ్వడానికి ఇది సహాయపడుతుంది. పన్నులతో కలిపి ఈ ఫోన్ ధర రూ. 1,34,166 గా నిర్ణయించారు. ఇది ఎలా పని చేస్తుంది? సాధారణ స్మార్ట్ఫోన్ల లాగా కాకుండా.. ఈ డివైజ్ సెల్యులార్ నెట్వర్క్ల స్థానంలో నేరుగా ఇన్మార్శాట్ వంటి గ్లోబల్ శాటిలైట్ నెట్వర్క్ల సహాయంతో కనెక్ట్ అవుతుంది. మొబైల్ సిగ్నల్స్ అస్సలు లేని […] -
Ben Stokes: ఒత్తిడిలోనే రిటైర్మెంట్? ‘అతడిని బయటకు పంపండి’ అంటూ స్టోక్స్ సంచలన పోస్ట్..
న్యూజిలాండ్తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ మధ్యలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన అంతర్జాతీయ క్రికెట్ రిటైర్మెంట్ ప్రకటించడం వివాదాస్పదమైంది. మ్యాచ్ కొనసాగుతుండగానే ఈ ప్రకటన రావడం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ‘ప్లేయర్ అండ్ మ్యాచ్ అఫీషియల్స్ ఏరియా’ (PMOA) నియమాలను ఉల్లంఘించడమేనని ఐసీసీ పేర్కొంది. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB)కి ఐసీసీ లేఖ రాసింది. ట్రెంట్ బ్రిడ్జ్ టెస్ట్ నాల్గో రోజు ఆట ప్రారంభానికి ముందు, బెన్ […] -
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ భేటీ.. అమరావతి రైతులకు భారీ ఊరట..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఉదయం 10:30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో అమరావతి రాజధాని ప్రాంత అభివృద్ధి, భూములు ఇచ్చిన రైతులకు ప్రయోజనాలు, పలు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు భూ కేటాయింపులతో పాటు పారిశ్రామిక పెట్టుబడులకు ఆమోదం తెలపడమే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. క్యాబినెట్ భేటీలో చర్చకు రానున్న ప్రధానాంశాలు, అజెండా వివరాల్లో ముఖ్యంగా.. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ఈ క్యాబినెట్ భేటీలో […] -
Sanju Samson: ఎట్టకేలకు సంజూ శాంసన్కు చోటు.. ఆ బ్యాటర్పై వేటు..
ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టి20 సిరీస్లో భాగంగా గురువారం బ్రిస్టల్ వేదికగా జరగనున్న నాలుగో పోరుకు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని టీమిండియా సిద్ధమైంది. ప్రస్తుతం సిరీస్లో భారత్ 0-2తో వెనుకబడి ఉంది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా, ఆ తర్వాతి రెండు మ్యాచ్ల్లోనూ భారత్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ముఖ్యంగా మూడో టి20లో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమై కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయ్యారు. జట్టులో ఏ ఒక్క బ్యాటర్ కూడా […]
తాజావార్తలు
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్పై చికిత్స!
-
India-Pakistan Tensions: పాక్ హైకమిషన్ వద్ద భద్రతా బారికేడ్లు తొలగించిన భారత్.. J&K వ్యాఖ్యల వేళ కీలక పరిణామం
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
ట్రెండింగ్
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!