‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐపీఎల్ 2026 క్వాలిఫయర్-2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ (GT) చేతిలో రాజస్థాన్ రాయల్స్ (RR) ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ తీసుకున్న కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలపై భారత మాజీ బ్యాటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 214 పరుగులు చేసింది. 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 47 బంతుల్లో 96 పరుగులతో మరోసారి చెలరేగాడు. అయితే గుజరాత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ (104) సెంచరీతో అదరగొట్టడంతో ఈ భారీ స్కోరు కూడా సరిపోలేదు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాజస్థాన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా గాయం కారణంగా ‘రిటైర్డ్ హర్ట్’గా వెనుదిరిగి, ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్కు వచ్చి 35 బంతుల్లో 45 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
Also Read
- Angry On Vaibhav: ‘వెళ్లి ఐపీఎల్ ఆడుకోపో.. నీకు అంతర్జాతీయ క్రికెట్ అనవసరం’.. వైభవ్పై తీవ్ర ఆగ్రహం..
- NKR: ‘చిన్న మార్పు చేశాను.. సక్సెస్ అయ్యాను’.. నితీష్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..
- Vaibhav Batting: ఎట్టకేలకు వైభవ్ బ్యాటింగ్ సీక్రెట్ రివీల్ చేసిన కోచ్.. అందరూ ఇది ఫాలో అవుతారేమో ఇక..
- Kane Williamson: ఆరెంజ్ ఆర్మీ గుండెల్లో ‘కేన్ మామ’.. ఒంటిచేత్తో SRHను ఫైనల్కు చేర్చిన క్షణాలు..
జట్టు తీసుకున్న ఈ నిర్ణయాన్ని మంజ్రేకర్ తప్పుబట్టారు. గాయపడిన జడేజాను మళ్లీ బ్యాటింగ్కు పంపడం, అలాగే విధ్వంసకర బ్యాటర్ డోనోవన్ ఫెరీరా కంటే ముందు ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ను ప్రమోట్ చేయడం పెద్ద పొరపాటని విమర్శించారు. 8వ స్థానంలో బరిలోకి దిగిన ఫెరీరా కేవలం 11 బంతుల్లోనే 4 సిక్సర్లు, 2 ఫోర్లతో 38 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. “రిటైర్డ్ హర్ట్ అయిన జడేజాను మళ్లీ లోపలికి పంపడం, ఫెరీరా కంటే ముందు ఆర్చర్ను బ్యాటింగ్కు దించడం రాజస్థాన్ చేసిన అత్యంత చెత్త నిర్ణయాలు. వీటిని నేను అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాను.. మీరు బుద్దిలేకుండా ఆ నిర్ణయాలు తీసుకున్నారు” అని మంజ్రేకర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసుకొచ్చారు.
Still can’t get over the poor call by RR to put Jadeja back in after he had retired hurt & then have Joffra Archer come before Donovan Ferreira.
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) May 30, 2026
మరోవైపు రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. తాము చేసిన స్కోరు డిఫెండ్ చేసుకోవడానికి సరిపోయేదేనని, అయితే సెకండ్ ఇన్నింగ్స్లో పిచ్ బ్యాటింగ్కు మరింత అనుకూలించిందని అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో ఎక్కువ మంది యువ, అనుభవం లేని ఆటగాళ్లు ఉన్నప్పటికీ క్వాలిఫయర్ వరకు రావడం పెద్ద సానుకూలాంశమని, భవిష్యత్తులో ఈ అనుభవంతో వారు మరింత మెరుగవుతారని పరాగ్ పేర్కొన్నాడు.
తాజావార్తలు
-
Ramnagar Stampede: రాంనగర్ గణేష్ ఆగమన్ ర్యాలీలో విషాదం.. తొక్కిసలాటలో యువకుడు మృతి
-
KCR: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం
-
Harmanpreet Kaur History: హర్మన్ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Subhash Chandra: సుభాష్ చంద్రా చుట్టూ సీబీఐ ఉచ్చు.. రూ.1,322 కోట్ల లోన్ కేసులో ఎఫ్ఐఆర్
-
Suriya : ఆ బ్లాక్బస్టర్ సినిమాకు సీక్వెల్గా సూర్య 50?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!