Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- గుజరాత్లో ఘోర విషాదం
- ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఘోరం
- భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భక్తుల కళ్ల ముందే 11 ఏళ్ల బాలుడిని సింహం అడవిలోకి ఈడ్చుకెళ్లిన అత్యంత దారుణంగా చంపేసింది. దీంతో భక్తులంతా భయాందోళనకు గురయ్యారు. కళ్లెదుటే ఘోరం జరగడంతో ఆందోళన చెందారు.
గుజరాత్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం గిర్నార్ కొండపై తెల్లవారుజామున ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనానికి వెళ్తున్న 11 ఏళ్ల బాలుడిపై సింహం ఒక్కసారిగా దాడి చేసి అడవిలోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న వందలాది మంది భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
Also Read
- Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
- UPI Charges Bill: UPI చెల్లింపులపై ఛార్జీలకు గ్రీన్ సిగ్నల్.. లోక్సభలో కీలక బిల్లు ఆమోదం
- Karnataka: ఘోరం.. వాలీబాల్ ఆడుతుండగా గుండెపోటుతో టెన్త్ విద్యార్థి మృతి
భక్తుల సమక్షంలోనే దాడి
అధికారుల వివరాల ప్రకారం.. ఈ ఘటన ఉదయం సుమారు 5.45 గంటలకు గిర్నార్ కొండపై ఉన్న యాత్రా మార్గంలోని 50వ మెట్టు దగ్గర జరిగింది. ఖేడా జిల్లాలోని మోదాజ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం గిర్నార్ కొండపై ఉన్న ఆలయాల దర్శనానికి మెట్లు ఎక్కుతుండగా, సమీపంలోని అడవి నుంచి ఒక్కసారిగా ఓ సింహం బయటకు వచ్చి 11 ఏళ్ల బాలుడిపై దాడి చేసింది. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు చూస్తుండగానే బాలుడిని సింహం అడవిలోకి ఈడ్చుకెళ్లింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు.
100 మీటర్ల దూరంలో
గాలింపు సమయంలో ఘటనాస్థలం నుంచి సుమారు 100 మీటర్ల దూరంలో అడవిలో బాలుడి శరీర అవశేషాలను అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. ఈ ఘటన అనంతరం గిర్నార్ కొండపై యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులను మెట్ల మార్గంలో వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు ఆపివేశారు. ట్రాకర్లు, అటవీ సిబ్బంది, పశువైద్య బృందాలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా దాడి చేసినట్లు అనుమానిస్తున్న సింహాన్ని సుమారు నాలుగు గంటల్లోనే పట్టుకున్నారు. అదే ప్రాంతంలో సంచరిస్తున్న మరో రెండు సింహాలను కూడా ముందుజాగ్రత్త చర్యగా బంధించి జునాగఢ్లోని సక్కర్బాగ్ జూకు తరలించారు. పరీక్షల సందర్భంగా అనుమానిత సింహం వాంతులు చేయగా, అందులో బాలుడి శరీర భాగాలు గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో దాడికి పాల్పడింది అదే సింహమనే అనుమానాలు మరింత బలపడ్డాయి. మిగిలిన రెండు సింహాలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఘటనాస్థలం నుంచి సింహం పాదముద్రలు, ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు సహా పలు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం గిర్నార్
గుజరాత్లోని జునాగఢ్ సమీపంలో ఉన్న గిర్నార్ కొండ పశ్చిమ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన యాత్రా కేంద్రాల్లో ఒకటి. ఇక్కడ అంబాజీ ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం సహా అనేక ప్రాచీన హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దాదాపు 10 వేల మెట్లు ఎక్కి గిర్నార్ శిఖరానికి చేరుకుంటారు. ఈ ఘటనతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
- Tags
- Gujarat
- Junagadh
- Lion Attack
తాజావార్తలు
-
Mohan Bhagwat: జెన్-జీతో దేశద్రోహులైపోతారా? నిరసనలో తప్పేముంది? మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
-
Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
-
India-Meta: మా చట్ట ప్రకారం నడవాల్సిందే.. మెటాకు కేంద్రం వార్నింగ్
-
2027 World Cup: వన్డే వరల్డ్ కప్కు కౌంట్ డౌన్ స్టార్ట్.. షెడ్యూల్ ప్రకటించిన ఐసీసీ.. ఈ తేదీల్లోనే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!