Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- గుజరాత్లో ఘోర విషాదం
- ప్రముఖ పుణ్యక్షేత్రంలో ఘోరం
- భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుజరాత్లో ఘోర విషాదం చోటుచేసుకుంది. భక్తుల కళ్ల ముందే 11 ఏళ్ల బాలుడిని సింహం అడవిలోకి ఈడ్చుకెళ్లిన అత్యంత దారుణంగా చంపేసింది. దీంతో భక్తులంతా భయాందోళనకు గురయ్యారు. కళ్లెదుటే ఘోరం జరగడంతో ఆందోళన చెందారు.
గుజరాత్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం గిర్నార్ కొండపై తెల్లవారుజామున ఘోర విషాదం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనానికి వెళ్తున్న 11 ఏళ్ల బాలుడిపై సింహం ఒక్కసారిగా దాడి చేసి అడవిలోకి ఈడ్చుకెళ్లి చంపేసింది. ఈ ఘటనతో అక్కడ ఉన్న వందలాది మంది భక్తులు భయాందోళనలకు గురయ్యారు.
Also Read
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Bankra mosque: కోల్కతా ఎయిర్పోర్టు పక్కన 136 ఏళ్ల మసీదు తరలింపు..
- VBSA Bill: పార్లమెంట్లోకి ‘వీబీఎస్ఏ బిల్లు’.. ఎన్డీఏ రాష్ట్రాల సహా తీవ్ర వ్యతిరేకత.. కారణమిదేనా?
- TMC CRISIS: మమతా బెనర్జీకి షాక్.. రెబల్ వర్గంలో చేరిన కీలక అనుచరుడు..
భక్తుల సమక్షంలోనే దాడి
అధికారుల వివరాల ప్రకారం.. ఈ ఘటన ఉదయం సుమారు 5.45 గంటలకు గిర్నార్ కొండపై ఉన్న యాత్రా మార్గంలోని 50వ మెట్టు దగ్గర జరిగింది. ఖేడా జిల్లాలోని మోదాజ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం గిర్నార్ కొండపై ఉన్న ఆలయాల దర్శనానికి మెట్లు ఎక్కుతుండగా, సమీపంలోని అడవి నుంచి ఒక్కసారిగా ఓ సింహం బయటకు వచ్చి 11 ఏళ్ల బాలుడిపై దాడి చేసింది. కుటుంబ సభ్యులు, ఇతర భక్తులు చూస్తుండగానే బాలుడిని సింహం అడవిలోకి ఈడ్చుకెళ్లింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు.
100 మీటర్ల దూరంలో
గాలింపు సమయంలో ఘటనాస్థలం నుంచి సుమారు 100 మీటర్ల దూరంలో అడవిలో బాలుడి శరీర అవశేషాలను అధికారులు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం, ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. ఈ ఘటన అనంతరం గిర్నార్ కొండపై యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులను మెట్ల మార్గంలో వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు ఆపివేశారు. ట్రాకర్లు, అటవీ సిబ్బంది, పశువైద్య బృందాలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా దాడి చేసినట్లు అనుమానిస్తున్న సింహాన్ని సుమారు నాలుగు గంటల్లోనే పట్టుకున్నారు. అదే ప్రాంతంలో సంచరిస్తున్న మరో రెండు సింహాలను కూడా ముందుజాగ్రత్త చర్యగా బంధించి జునాగఢ్లోని సక్కర్బాగ్ జూకు తరలించారు. పరీక్షల సందర్భంగా అనుమానిత సింహం వాంతులు చేయగా, అందులో బాలుడి శరీర భాగాలు గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు వెల్లడించారు. దీంతో దాడికి పాల్పడింది అదే సింహమనే అనుమానాలు మరింత బలపడ్డాయి. మిగిలిన రెండు సింహాలకు కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఘటనాస్థలం నుంచి సింహం పాదముద్రలు, ఈడ్చుకెళ్లిన ఆనవాళ్లు సహా పలు కీలక ఆధారాలను అధికారులు సేకరించారు. ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రముఖ పుణ్యక్షేత్రం గిర్నార్
గుజరాత్లోని జునాగఢ్ సమీపంలో ఉన్న గిర్నార్ కొండ పశ్చిమ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన యాత్రా కేంద్రాల్లో ఒకటి. ఇక్కడ అంబాజీ ఆలయం, దత్తాత్రేయ స్వామి ఆలయం సహా అనేక ప్రాచీన హిందూ, జైన దేవాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాల దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు దాదాపు 10 వేల మెట్లు ఎక్కి గిర్నార్ శిఖరానికి చేరుకుంటారు. ఈ ఘటనతో భక్తుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
- Tags
- Gujarat
- Junagadh
- Lion Attack
తాజావార్తలు
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
-
S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!